Chanakya Niti: ఈ ఏడుగురు వ్యక్తులు నిద్రపోతే చాలా ప్రమాదం.. వారిని వెంటనే లేపాలి..!
Chanakya Neeti: సమాజంలో కొందరు వ్యక్తులు తమ బాధ్యతల సమయంలో నిర్లక్ష్యంగా నిద్రపోతే, దాని ప్రభావం వ్యక్తిగత స్థాయిని దాటి మొత్తం రాజ్యానికే నష్టం కలిగించవచ్చు. అందువల్ల బాధ్యతలో ఉన్నవారిని అప్రమత్తంగా ఉంచడం అవసరం చెప్పాడు. ముఖ్యమైన బాధ్యతలో ఉన్న వ్యక్తులు విధుల సమయంలో అసలు నిద్ర పోవద్దని అన్నాడు. ఒకవేళ నిద్రపోయినా వారిని వెంటనే లేపాలని స్పష్టం చేశాడు.

ఆచార్య చాణక్యుడు భారతదేశ చరిత్రలో గొప్ప ఆలోచనాపరుడు, ఆర్థికవేత్త, దౌత్యవేత్త. ఆయన రచించిన చాణక్య నీతి గ్రంథం నేటికీ జీవితానికి మార్గదర్శిగా నిలుస్తోంది. ఇందులో వ్యక్తి, సమాజం, రాజ్యం అభివృద్ధికి అవసరమైన అనేక విలువైన సూత్రాలు చెప్పబడ్డాయి. చాణక్యుడు ఒక ముఖ్యమైన విషయాన్ని సూచించాడు. సమాజంలో కొందరు వ్యక్తులు తమ బాధ్యతల సమయంలో నిర్లక్ష్యంగా నిద్రపోతే, దాని ప్రభావం వ్యక్తిగత స్థాయిని దాటి మొత్తం రాజ్యానికే నష్టం కలిగించవచ్చు. అందువల్ల బాధ్యతలో ఉన్నవారిని అప్రమత్తంగా ఉంచడం అవసరం చెప్పాడు. ముఖ్యమైన బాధ్యతలో ఉన్న వ్యక్తులు విధుల సమయంలో అసలు నిద్ర పోవద్దని అన్నాడు. ఒకవేళ నిద్రపోయినా వారిని వెంటనే లేపాలని స్పష్టం చేశాడు. ఎలాంటి వ్యక్తులు తమ విధుల సమయంలో నిద్రపోకూడదో ఇప్పుడు తెలుసుకుందాం.
1. విద్యార్థి
విద్యార్థి చదువుకునే సమయంలో నిద్రపోతే చదువులో వెనుకబడతాడు. చదువుకోకపోతే పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించలేడు. మంచి ఉపాధి అవకాశాలు కోల్పోతాడు. దీంతో కుటుంబం మాత్రమే కాదు, దేశం కూడా ఒక ప్రతిభావంతుడిని కోల్పోతుంది. ఎందుకంటే విద్యావంతులైన యువతే దేశాభివృద్ధికి పునాది.
2. సేవకుడు
సేవకుడు తన విధుల్లో నిద్రపోతే యజమానికి నష్టం కలగవచ్చు. ఇంటి లేదా కార్యాలయ బాధ్యతలు సక్రమంగా నిర్వహించబడవు. కాబట్టి అతన్ని అప్రమత్తంగా ఉంచాలి.
3. భద్రతా సిబ్బంది (సెక్యూరిటీ గార్డు)
ఇంటి లేదా సంస్థ భద్రత అతని బాధ్యత. అతను నిర్లక్ష్యంగా నిద్రపోతే దొంగతనం లేదా ప్రమాదం సంభవించవచ్చు. కాబట్టి భద్రతా సిబ్బంది ఎప్పుడూ జాగ్రత్తగా ఉండాలి.
4. సైనికులు
సరిహద్దులను కాపాడే సైనికులు నిద్రపోతే శత్రువులు సులభంగా దేశంలోకి ప్రవేశించవచ్చు. వారి అప్రమత్తతే దేశ రక్షణకు బలమైన కవచం.
5. రాజు (నాయకుడు)
రాజ్యం మొత్తం బాధ్యత రాజుపై ఉంటుంది. నాయకుడు నిర్లక్ష్యంగా ఉంటే ప్రజలు ఇబ్బందులు పడతారు. కాబట్టి నాయకుడు ఎప్పుడూ జాగ్రత్తగా, బాధ్యతగా ఉండాలి.
6. రైతులు
రైతులు వ్యవసాయ పనుల్లో నిర్లక్ష్యం చేస్తే ఆహార ధాన్యాల కొరత ఏర్పడుతుంది. దేశ ఆర్థిక వ్యవస్థ కూడా దెబ్బతింటుంది. అందుకే రైతుల కృషి దేశానికి ప్రాణాధారం.
7. గురువు
గురువు నిద్రపోతే లేదా తన బాధ్యతలను నిర్వర్తించకపోతే విద్యార్థుల భవిష్యత్తు దెబ్బతింటుంది. గురువు అప్రమత్తతే మంచి పౌరులను తయారు చేస్తుంది.
అసలు చాణక్యుడు ఏం చెబుతున్నాడంటే… బాధ్యతలో ఉన్న వ్యక్తి నిర్లక్ష్యంగా ఉండకూడదు. ఒకరి అలసత్వం కుటుంబం, సమాజం, రాష్ట్రం మీద ప్రభావం చూపుతుంది. కాబట్టి ప్రతి వ్యక్తి తన కర్తవ్యాన్ని జాగ్రత్తగా, నిబద్ధతతో నిర్వర్తించాలి. ఇదే సమాజ అభివృద్ధికి మూలసూత్రం.
(Disclaimer: ఈ వార్తలోని సమాచారం పాఠకుల ఆసక్తి మేరకు వివిధ వనరుల నుంచి సేకరించి అందించడం జరిగింది. దీనిని సంస్థ ధృవీకరించదు.)
