AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఏపీ సీఎం చంద్రబాబుపై తలసాని శ్రీనివాస్ ఫైర్

బీసీ సామాజిక వర్గాలను అణగదొక్కేందకు సీఎం చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని మాజీ మంత్రి, టీఆర్ఎస్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో పాలన చూస్తుంటే ఇండియాలో ఉన్నామా అనే అనుమానం కలుగుతున్నదని అన్నారు. గురువారం విజయవాడలోని గేట్‌వే హోటల్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. గుంటూరులో యాదవ, బీసీ గర్జనకు ఏర్పాట్లుచేస్తున్నట్టు తెలిపారు. సం క్రాంతి సమయంలో తాను ఏపీకి వచ్చి వె ళ్లాక.. ఏపీలో యాదవులపై వేధింపులు ఎక్కువయ్యాయని ఆరోపించారు. మంగళగిరిలోని హాయ్‌ల్యాండ్‌లో ప్రెస్‌మీట్ పెట్టకుండా ఇంటెలిజెన్స్‌తో ఒత్తిడి […]

ఏపీ సీఎం చంద్రబాబుపై తలసాని శ్రీనివాస్ ఫైర్
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Mar 06, 2019 | 9:09 PM

Share

బీసీ సామాజిక వర్గాలను అణగదొక్కేందకు సీఎం చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని మాజీ మంత్రి, టీఆర్ఎస్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో పాలన చూస్తుంటే ఇండియాలో ఉన్నామా అనే అనుమానం కలుగుతున్నదని అన్నారు. గురువారం విజయవాడలోని గేట్‌వే హోటల్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. గుంటూరులో యాదవ, బీసీ గర్జనకు ఏర్పాట్లుచేస్తున్నట్టు తెలిపారు. సం క్రాంతి సమయంలో తాను ఏపీకి వచ్చి వె ళ్లాక.. ఏపీలో యాదవులపై వేధింపులు ఎక్కువయ్యాయని ఆరోపించారు. మంగళగిరిలోని హాయ్‌ల్యాండ్‌లో ప్రెస్‌మీట్ పెట్టకుండా ఇంటెలిజెన్స్‌తో ఒత్తిడి తీసుకొచ్చి రద్దుచేయించారని ఆరోపించారు. అక్కడ బసచేస్తున్నానని హాయ్‌ల్యాండ్ హో టల్ యాజమాన్యాన్ని కూడా బెదిరింపులకు గురిచేశారన్నారు. హైదరాబాద్‌ను తానే కట్టానని చెప్పుకొంటున్న చంద్రబాబు.. విజయవాడలో దుర్గమ్మ ఫైఓవర్‌ను ఎందుకు కట్టలేకపోతున్నారని ప్రశ్నించారు.