AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CM KCR: దూకుడు పెంచుతున్న సీఎం కేసీఆర్.. బీర్ఎస్‌లోకి చేరుతున్న మహారాష్ట్ర నేతలు..

ముఖ్యమంత్రి కేసీఆర్ బీఆర్‌ఎస్ పార్టీని విస్తరించేందుకు అనేక వ్యూహాలు రచిస్తున్నారు. పలు రాష్ట్రాలకు చెందిన నాయకులను కలుపుకునే పనిలో ఉన్నారు. ముఖ్యంగా ఇటీవల మహారాష్ట్రకు ఆయన ఎక్కువగా వెళ్తూ అక్కడి నాయకులను తమ పార్టీ వైపు తిప్పుకుంటున్నారు.

CM KCR: దూకుడు పెంచుతున్న సీఎం కేసీఆర్..  బీర్ఎస్‌లోకి చేరుతున్న మహారాష్ట్ర నేతలు..
Chief Minister Kcr
Aravind B
|

Updated on: Jul 30, 2023 | 6:46 AM

Share

ముఖ్యమంత్రి కేసీఆర్ బీఆర్‌ఎస్ పార్టీని విస్తరించేందుకు అనేక వ్యూహాలు రచిస్తున్నారు. పలు రాష్ట్రాలకు చెందిన నాయకులను కలుపుకునే పనిలో ఉన్నారు. ముఖ్యంగా ఇటీవల మహారాష్ట్రకు ఆయన ఎక్కువగా వెళ్తూ అక్కడి నాయకులను తమ పార్టీ వైపు తిప్పుకుంటున్నారు. తాజాగా మహారాష్ట్రకు చెందిన వివిధ పార్టీలోని నాయకులు చేరికలు కొనసాగుతూనే ఉన్నాయి. అదే రాష్ట్రానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త, చక్కెర కర్మాగారాల యజమాని.. మరాఠా థన్‌కర్ సామజిక వర్గంలో పట్టున్న బాలాసాహెబ్ కన్నవార్ బీఆర్‌ఎస్‌లో చేరారు. అలాగే ఉస్మానాబాద్ జిల్లాకు చెందిన రైతు ఉద్యమ నాయకుడు కిషన్ హరిశ్చంద్ర కశీద్, పలువురు శివనేతలు చేరారు.

మరోవైపు ఉస్మానాబాద్ జిల్లా ఆర్‌ఎస్‌పీ ప్రెసిడెంట్ ఓంకార్ నికమ్, కాంగ్రెస్ నాయకుడు విశ్వజిత్ షిండే బీర్‌ఎస్ కండువా కప్పుకున్నారు. అలాదే ఆర్‌ఎస్‌పీ మహారాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు మాణిక్ పోలా, ఛత్రపతి సేన రాష్ట్ర అధ్యక్షుడు రోహిత్ బాహూ మాల్మే తదితరులు పార్టీలో చేరారు. సీఎం కేసీఆర్ సమక్షంలో జరిగిన ఈ పార్టీ చేరికలో సమావేశంలో మహారాష్ట్ర బీఆర్ఎస్ ఇంఛార్జి కల్వకుంట్ల వంశీధర్ రావు, స్టీరింగ్ కమిటీ సభ్యుడు శంకరన్న డోందే తదితరులు పాల్గొన్నారు. వచ్చే ఎన్నికల్లో సీఎం కేసీఆర్ మహారాష్ట్రలో తమ పార్టీని రంగలోకి దింపనున్నట్లు స్పష్టంగా కనబడుతుంది. అయితే ఎన్నికలు దగ్గిరికొస్తున్నందున ఇంకా ఏ రాష్ట్రాల్లోని నాయకులు బీర్‌ఎస్‌లో చేరుతారని ఆసక్తి నెలకొంది.