Mission 2024: పవార్‌తో పీకే మంత్రాంగం.. ఈ సారి సునామీ ఉంటుందంటున్న ఢిల్లీ వర్గాలు..

PK MEET Sharad Pawar: ముంబైలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP) అధినేత శరద్‌ పవార్‌ ఇంట్లో ప్రశాంత్‌ కిశోర్‌ లంచ్‌ చేయడం పెద్ద రాజకీయ చర్చకు దారి తీసింది. మిషన్‌ 2024 గురించి చర్చించి ఉంటారనే ఊహాగానాలు

Mission 2024: పవార్‌తో పీకే మంత్రాంగం.. ఈ సారి సునామీ ఉంటుందంటున్న ఢిల్లీ వర్గాలు..
Prashant Kishor Meets Shara
Follow us

|

Updated on: Jun 11, 2021 | 8:03 PM

బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల తర్వాత దేశ రాజకీయ చిత్రం ఒక్కసారిగా వేడెక్కుతోంది. కరోనా సెకెండ్ వేవ్ కొద్దిగా తగ్గుతుండటంతో పొలిటికల్ చదరంగా మొదలైంది. దేశ రాజధాని కేంద్రంగా కమలనాథులు వ్యూహం పన్నుతుంటే.. మరో వైపు హైట్రిక్ విజయంను అందుకుని తెగ జోష్‌లో ఉన్న బెంగాల్ సీఎం మమతా… తృణమూల్ కాంగ్రెస్‌(TMC)లోకి రివర్స్ మైగ్రేషన్ ట్రెండ్‌ మొదలు పెట్టింది. అయితే బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల విజయానంతరం ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిషోర్‌ మరో ఎత్తుగడకు ప్లాన్ చేస్తున్నట్లుగా కనిపిస్తోంది.

తాజాగా ముంబైలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP) అధినేత శరద్‌ పవార్‌ ఇంట్లో ప్రశాంత్‌ కిశోర్‌ లంచ్‌ చేయడం పెద్ద రాజకీయ చర్చకు దారి తీసింది. మిషన్‌ 2024 గురించి చర్చించి ఉంటారనే ఊహాగానాలు దేశ రాజధానిని చుట్టేస్తున్నాయి. వీరి మధ్య జరిగిన చర్చల వివరాలు బయటకు తెలియక పోయినా.. జరగబోయే పొలిటికల్ మ్యాప్ అందరికి కనిపిస్తోంది.

ఇటీవల జరిగిన బెంగాల్‌, తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ప్రశాంత్‌ కిశోర్ తన వ్యూహాలతో మమతా బెనర్జీ, ఎం.కె.స్టాలిన్‌కు భారీ విజయాన్ని కట్టబెట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో వీరివురికి మద్దతు ప్రకటించిన నేతలందరినీ కలిసి ప్రశాంత్‌ కృతజ్ఞతలు తెలపనున్నారని ఆయన కార్యాలయ వర్గాలు తెలిపాయి. అందులో భాగంగానే నేడు పవార్‌ను కలుస్తున్నట్లు పేర్కొన్నాయి.

కానీ, రాజకీయ వర్గాల్లో మాత్రం పవార్‌, ప్రశాంత్‌ భేటీ నేపథ్యంలో ఓ ఆసక్తికరమైన చర్చ తెరమీదకు వచ్చింది. ‘మిషన్‌-2024’ టార్గెట్‌గానే ఈ సమావేశం జరగనున్నట్లు పొలిటికల్ సెంటర్‌లో గుస గుసలు వినిపిస్తున్నాయి.

మరోవైపు ప్రస్తుతం తాను చేస్తున్న ‘ఎన్నికల వ్యూహరచన’ నుంచి తప్పుకోనున్నట్లు ప్రశాంత్ గతంలోనే ప్రకటించిన విషయం తెలిసిందే. తాను విఫలమైన రాజకీయ నాయకుడిని అంటూ చెప్పుకుంటున్న పీకే… మరో ఎత్తుగడతో దేశ రాజకీయాల్లో తుఫాన్ సృష్టించాలని ప్లాన్ చేస్తున్నట్లుగా కనిపిస్తోంది.

ఇవి కూడా చదవండి : AP CM Jagan Delhi Tour: విజయవంతంగా సాగిన సీఎం జగన్ ఢిల్లీ పర్యటన

Amazing Benefits: పాలలో తేనె కలిపి తాగుతున్నారా..! ఎలాంటి ప్రయోజనాలు.. కలిగే నష్టాలు తెలుసుకోండి..!

Swami Sivanand Baba : కొవిడ్ టీకా తీసుకున్న 125 ఏళ్ల వ్యక్తి..! వ్యాక్సిన్ తీసుకున్న పెద్ద వయస్కుడిగా గుర్తింపు

బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.