‘ప్లీజ్ ! హెల్ప్ !’ ఆక్సిజన్ కొరతను తీర్చాలంటూ ప్రముఖ పారిశ్రామికవేత్తలకు కేజ్రీవాల్ లేఖ

ఆక్సిజన్ కొరతతో అల్లాడుతున్న తమ రాష్ట్రానికి ఆక్సిజన్ ని పంపి ఆదుకోవాలని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ దేశంలోని ప్రముఖ పారిశ్రామికవేత్తలను కోరారు.

'ప్లీజ్ ! హెల్ప్ !' ఆక్సిజన్ కొరతను తీర్చాలంటూ ప్రముఖ పారిశ్రామికవేత్తలకు కేజ్రీవాల్ లేఖ
Arvind Kejriwal
Follow us

| Edited By: Phani CH

Updated on: Apr 25, 2021 | 9:03 PM

ఆక్సిజన్ కొరతతో అల్లాడుతున్న తమ రాష్ట్రానికి ఆక్సిజన్ ని పంపి ఆదుకోవాలని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ దేశంలోని ప్రముఖ పారిశ్రామికవేత్తలను కోరారు. నిన్న ఆయన ఇదే అభ్యర్థనతో పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లేఖలు రాసిన సంగతి తెలిసిందే. అయితే ఆదివారం ఆయన ఇండస్ట్రియలిస్టులకు కూడా లేఖలు రాస్తూ.. దయ చేసి తమ ప్రభుత్వానికి సాయపడాలని, ఆక్సిజన్, ట్యాంకర్లను పంపాలని, ఏ రూపంలోనైనా సహాయపడాలని అభ్యర్థించారు. కేంద్ర ప్రభుత్వం తమ రాష్ట్రాలకు  ఆక్సిజన్ కోటాను కేటాయించినప్పటికీ అది ఏ మూలకూ సరిపోలేదని ఆయన తెలిపారు. మా వద్ద ఉన్న వనరులన్నీ అయిపోయాయి అని తెలిపారు. ఈ లేఖలను  ఎస్ ఓ ఎస్ మెసేజులుగా భావించాలని కేజ్రీవాల్ కోరారు.  ఈ తరుణంలో అంతా కలిసి సంక్షోభ నివారణకు కృషి చేయాల్సి ఉందని, సమర్థవంతమైన గవర్నెన్స్ అంటే ఏమిటో ప్రపంచానికి చూపాలని అన్నారు. కేంద్రం గతవారం  ఢిల్లీకి ఆక్సిజన్ కోటాను 380 నుంచి 480 మెట్రిక్ టన్నులకు పెంచింది. అయితే ఇది చాలదని ప్రభుత్వం అంటోంది. తమకు 700 టన్నుల ఆక్సిజన్ అవసరమని డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా ఇటీవల అన్నారు.

అయితే నిన్న కేజ్రీవాల్ ముఖ్యమంత్రులకు లేఖలు రాసిన కొద్దిసేపటికే బీజేపీ రంగంలోకి దిగింది. ఢిల్లీలో 8 ఆక్సిజన్ ప్లాంట్ల ఏర్పాటుకు పీఎం కేర్స్ ఫండ్ నుంచి గత డిసెంబరులోనే కేంద్రం   నిధులు కేటాయించినా ఈ ప్రభుత్వం  కేవలం ఒక్క ప్లాంటునే ఏర్పాటు చేసిందని బీజేపీ నేతలు ఆరోపించారు. ఈ మేరకు ఢిల్లీ బీజేపీ చీఫ్ ఆదేశ్ గుప్తా తీవ్రంగా ఎదురు దాడికి దిగారు.   ఈ పార్టీ ఐటీ విభాగం చీఫ్ అమిత్ మాలవీయ కూడా ఇలాగే ట్వీట్ చేశారు. ఇచ్చిన నిధులను వినియోగించుకోలేదని దుయ్యబట్టారు. అయితే ఈ ఆరోపణలపై కేజ్రీవాల్ గానీ, ఆప్ నేతలు గానీ నోరెత్తలేదు.

మరిన్ని ఇక్కడ చూడండి: తీరానికి కొట్టుకొచ్చిన భారీ తాబేలు ! విశాఖ బీచ్ లో అరుదైన తాబేలు..వైరల్ వీడియో..Huge Turtle carcass video.

India-US Flights: అమెరికా వెళ్లాలనుకుంటున్నారా..? అయితే మూడు రెట్లు ఎక్కువ ఛార్జీలు చెల్లించాల్సిందే..!

కోడి గుడ్డు కోసం లక్షలు.. మూడు రోజుల పాటు జరిగిన వేలం..ఎగబడ్డ జనం
కోడి గుడ్డు కోసం లక్షలు.. మూడు రోజుల పాటు జరిగిన వేలం..ఎగబడ్డ జనం
237 స్ట్రైక్‌రేట్‌తో ఊచకోత.. కట్‌చేస్తే.. టీ20 ప్రపంచకప్‌లో చోటు?
237 స్ట్రైక్‌రేట్‌తో ఊచకోత.. కట్‌చేస్తే.. టీ20 ప్రపంచకప్‌లో చోటు?
వన్‌ప్లస్‌ 11పై మరోసారి డిస్కౌంట్‌.. ప్రీమియం ఫోన్‌ ధర ఎంతంటే
వన్‌ప్లస్‌ 11పై మరోసారి డిస్కౌంట్‌.. ప్రీమియం ఫోన్‌ ధర ఎంతంటే
జుట్టుకు హెన్నా పెడుతున్నారా? పెరుగు, నిమ్మ రసం అస్సలు కలపొద్దు
జుట్టుకు హెన్నా పెడుతున్నారా? పెరుగు, నిమ్మ రసం అస్సలు కలపొద్దు
బీజేపీ అభ్యర్థి ఖరారు.. సికింద్రాబాద్ కంటోన్మెంట్‌లో త్రిముఖ పోటీ
బీజేపీ అభ్యర్థి ఖరారు.. సికింద్రాబాద్ కంటోన్మెంట్‌లో త్రిముఖ పోటీ
డ్యూయల్ రోల్స్‌తో అదరగొట్టనున్న స్టార్ హీరోలు..
డ్యూయల్ రోల్స్‌తో అదరగొట్టనున్న స్టార్ హీరోలు..
బిజినెస్‌ చేసే ఆలోచనలో ఉన్నారా.? ఎప్పుడూ డిమాండ్ ఉండే ప్లాన్‌ ఇది
బిజినెస్‌ చేసే ఆలోచనలో ఉన్నారా.? ఎప్పుడూ డిమాండ్ ఉండే ప్లాన్‌ ఇది
టెన్షన్‌లో తెలియకుండానే తెగ గోళ్లు కొరికేస్తున్నారా.?ఇది మీ కోసమే
టెన్షన్‌లో తెలియకుండానే తెగ గోళ్లు కొరికేస్తున్నారా.?ఇది మీ కోసమే
KKR vs RR Preview: టేబుల్ టాపర్‌పై కన్నేసిన కోల్‌కతా, రాజస్థాన్..
KKR vs RR Preview: టేబుల్ టాపర్‌పై కన్నేసిన కోల్‌కతా, రాజస్థాన్..
టీఎస్‌ఆర్‌జేసీ 2024ప్రవేశ పరీక్ష హాల్‌టికెట్లు విడుదల
టీఎస్‌ఆర్‌జేసీ 2024ప్రవేశ పరీక్ష హాల్‌టికెట్లు విడుదల