AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

KTR in Telangana Investment Meet: పెట్టుబడులతో రండి.. రెడ్‌ కార్పెట్‌తో వెలకమ్‌ చెబుతాం.. ఇన్వెస్ట్‌మెంట్‌ మీట్‌లో మంత్రి కేటీఆర్‌

ప్రపంచ దేశాల‌ు పెట్టుబడులు పెట్టేందుకు తెలంగాణ ఒక ఆకర్షణీయమైన గమ్యస్థానం అని రాష్ట్ర మున్సిపల్, ఐటీ, ప‌రిశ్రమ‌ల శాఖ మంత్రి కేటీ రామారావు స్పష్టం చేశారు.

KTR in Telangana Investment Meet: పెట్టుబడులతో రండి.. రెడ్‌ కార్పెట్‌తో వెలకమ్‌ చెబుతాం.. ఇన్వెస్ట్‌మెంట్‌ మీట్‌లో మంత్రి కేటీఆర్‌
Ktr Inaugural Address At The Telangana Investment Meet
Balaraju Goud
|

Updated on: Jun 14, 2021 | 8:42 PM

Share

Minister KTR in Telangana Investment Meet: ప్రపంచ దేశాల‌ు పెట్టుబడులు పెట్టేందుకు తెలంగాణ ఒక ఆకర్షణీయమైన గమ్యస్థానం అని రాష్ట్ర మున్సిపల్, ఐటీ, ప‌రిశ్రమ‌ల శాఖ మంత్రి కేటీ రామారావు స్పష్టం చేశారు. సౌదీ భారత రాయబార కార్యాలయం ఏర్పాటు చేసిన రెండు రోజులు జరిగే తెలంగాణ ఇన్వెస్టిమెంట్ మీట్ లో కేటీఆర్ పాల్గొని ప్రారంభ ఉప‌న్యాసం చేశారు.

ప్రపంచ దేశాలు పెట్టుబడులు పెట్టేందుకు తెలంగాణ అనువైన ప్రాంతమని మంత్రి కేటీఆర్‌. సౌదీ, భారత ఎంబసీ ఏర్పాటు చేసిన తెలంగాణ ఇన్వెస్టిమెంట్ మీట్‌లో పాల్గొన్న కేటీఆర్.. ఏడేళ్లలో జరిగిన రాష్ట్ర ప్రగతిని వివరించారు. ప్రపంచ అగ్రశ్రేణి సంస్థల పెట్టుబడులను తెలంగాణ ఆకర్షించగలిగిందని మంత్రి కేటీఆర్ గుర్తు చేశారు. సౌదీలోని భారత రాయబార కార్యాలయం తెలంగాణ ఇన్వెస్టిమెంట్ మీట్ పేరిట 2 రోజుల సదస్సు ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా సౌదీకి చెందిన ప్రముఖ పారిశ్రామిక వేత్తలు, ఇన్వెస్టర్లు పాల్గొన్నారు. సౌదీ కంపెనీలతోపాటు సౌదీఇండియా బిజినెస్ కౌన్సిల్ పాల్గొంది.

టీఎస్-ఐపాస్‌తో ద్వారా పరిశ్రమల ఏర్పాటు సరళీకృతం చేశామన్న కేటీఆర్.. ఇప్పటివరకు సుమారు 22బిలియన్ డాలర్ల పెట్టుబడులు ఆకర్షించామన్నారు. దాదాపు1.5 మిలియన్ల ప్రత్యక్ష ఉద్యోగాలు కల్పించిందన్నారు. ఐటీ, ఫార్మా, లైఫ్ సైన్సెస్, ఏరోస్పేస్, డిఫెన్స్, రెనెవబుల్ ఎనర్జీ, ఫుడ్ ప్రాసెసింగ్ వంటి పలు రంగాలను ఎంచుకుని పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తోందని మంత్రి తెలిపారు. ఈ రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు వచ్చే సౌదీ కంపెనీలకు సహకారం అందిస్తామన్నారు. అరబ్ దేశాలతో అవినాభావ సంబంధం ఉందని.. లక్షల మంది అక్కడ ఉపాధి పొందుతున్నారని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఈ మీట్‌ను ఏర్పాటు చేసిన సౌదీ రాయబారి అసఫ్ సయీద్‌కు మంత్రి కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు.

దేశంలోనే నూతన రాష్ట్రమైనప్పటికీ గత ఐదేళ్లుగా తెలంగాణ అద్భుతమైన పారిశ్రామిక ప్రగతి సాధిస్తుందని భారత రాయబారి అశోక్ సయూద్ తెలిపారు. తెలంగాణ ఇన్వెస్టిమెంట్ మీట్ ద్వారా పెట్టుబడులు వస్తాయన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఈ ప్రారంభ సెషన్ కార్యక్రమంలో సౌదీ ఇండియా బిజినెస్ కౌన్సిల్ చైర్మన్ అబ్దుల్ అజీజ్ అల్ ఖతానీ, సౌదీ ప్రభుత్వానికి చెందిన మహమ్మద్ అల్ హస్నా, తెలంగాణ పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, నీతి అయోగ్‌కి చెందిన అడిషనల్ సెక్రటరీ రాకేష్ సర్వాల్ పాల్గొన్నారు.

Read Also…  Police Busted Red Sandalwood Dump: తీగ లాగితే ఎర్ర చందనం డంక కదిలింది.. 27 దుంగలు స్వాధీనం.. నలుగురు అరెస్ట్!

Follow Us
ఐటీ ఉద్యోగులకు సూపర్ గుడ్‌న్యూస్.. ఏప్రిల్ 1 నుంచి జీతాలు పెంపు
ఐటీ ఉద్యోగులకు సూపర్ గుడ్‌న్యూస్.. ఏప్రిల్ 1 నుంచి జీతాలు పెంపు
మాటలు కరువయ్యాయి.. వైభవ్ విధ్యంసం పై ఎంపీ కామెంట్
మాటలు కరువయ్యాయి.. వైభవ్ విధ్యంసం పై ఎంపీ కామెంట్
వామ్మో.. ఈ కూరగాయ మొక్క వల్లే భార్యాభర్తలు విడిపోతున్నారా?
వామ్మో.. ఈ కూరగాయ మొక్క వల్లే భార్యాభర్తలు విడిపోతున్నారా?
పొట్ట ఉబ్బి.. మేత మేయని ఆవు.. వెటర్నరీ డాక్టర్లు పరీక్షించగా..
పొట్ట ఉబ్బి.. మేత మేయని ఆవు.. వెటర్నరీ డాక్టర్లు పరీక్షించగా..
శ్రీమంతం ముచ్చట తీరకముందే.. మృత్యువును ఆశ్రయించింది..
శ్రీమంతం ముచ్చట తీరకముందే.. మృత్యువును ఆశ్రయించింది..
సముద్రం మీద ఇల్లు.. నీటి అడుగున వింత లోకం..వీళ్లు మనుషులు కాదు..
సముద్రం మీద ఇల్లు.. నీటి అడుగున వింత లోకం..వీళ్లు మనుషులు కాదు..
అందంలో హీరోయిన్లను మించిపోయింది.. ఒక్క ప్రమాదంతో కెరీర్ నాశనమైంది
అందంలో హీరోయిన్లను మించిపోయింది.. ఒక్క ప్రమాదంతో కెరీర్ నాశనమైంది
ఒక్కసారిగా పెరిగిన బంగారం ధరలు.. ఎంతంటే..?
ఒక్కసారిగా పెరిగిన బంగారం ధరలు.. ఎంతంటే..?
పనస పండు వీరికి యమడేంజర్.. తింటే ఏం జరుగుతుందో తెలిస్తే..
పనస పండు వీరికి యమడేంజర్.. తింటే ఏం జరుగుతుందో తెలిస్తే..
ఎవర్‌గ్రీన్.. ఆంధ్రా స్టైల్ స్పెషల్ చేపల పులుసు.. ఇలా చేసుకోండి
ఎవర్‌గ్రీన్.. ఆంధ్రా స్టైల్ స్పెషల్ చేపల పులుసు.. ఇలా చేసుకోండి