AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నోముల పేద‌ల ప‌క్ష‌పాతి.. శాసనసభలో న‌ర్సింహ‌య్య‌ సంతాప తీర్మానంలో ఎర్రబెల్లి దయాకర్‌రావు ‌

‌మ్యూనిస్టుగా జీవితాన్ని ప్రారంభించి, తెలంగాణ ఉద్య‌మ స్ఫూర్తితో టిఆర్ఎస్ లో చేరి, త‌న జీవిత కాలం మొత్తం పేద‌ల కోసం ప‌ని చేసిన నేత‌గా నోముల న‌ర్సింహ‌య్య‌ను..

నోముల పేద‌ల ప‌క్ష‌పాతి.. శాసనసభలో న‌ర్సింహ‌య్య‌ సంతాప తీర్మానంలో ఎర్రబెల్లి దయాకర్‌రావు ‌
Errabelli
K Sammaiah
|

Updated on: Mar 16, 2021 | 1:30 PM

Share

నోముల న‌ర్సింహ‌య్య పేద‌ల ప‌క్ష‌పాతి. త‌న జీవితాంతం పేద ప్రజల కోసం పోరాటం చేసిన ప్ర‌జా నాయ‌కుడ‌ని రాష్ట్ర పంచాయ‌తీరాజ్, గ్రామీణాభి‌వృద్ధి, గ్రామీణ మంచినీటి స‌ర‌ఫ‌రాశాఖ‌ల మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు అన్నారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి త‌న రాజకీయ జీవితాన్ని అంకితమిచ్చిన నేతని ఆయన కొనియాడారు. మంగళవారం రాష్ట్ర శాసనసభ లో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశ పెట్టిన దివంగత నోముల నరసింహ్మయ్య సంతాప తీర్మానాన్ని బలపరుస్తూ మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు మాట్లాడారు.

క‌మ్యూనిస్టుగా జీవితాన్ని ప్రారంభించి, తెలంగాణ ఉద్య‌మ స్ఫూర్తితో టిఆర్ఎస్ లో చేరి, త‌న జీవిత కాలం మొత్తం పేద‌ల కోసం ప‌ని చేసిన నేత‌గా నోముల న‌ర్సింహ‌య్య‌ను ఎర్ర‌బెల్లి పేర్కొన్నారు. నాటి సీనియ‌ర్ ఎమ్మెల్యే న‌ర్రా రాఘ‌వ‌రెడ్డి శిష్యుడిగా, రాజ‌కీయ ప్ర‌వేశం చేసి, అనేక ప్ర‌జా ఉద్య‌మాల్లో పాల్గొన్నారు. లాయ‌ర్ గా కూడా పేద‌ల కేసుల‌ను వాదించి పేరు తెచ్చుకున్నారు. వ‌రంగ‌ల్ ఆడ బిడ్డ‌ను పెండ్లి చేసుకున్నారు. అని నోముల‌తో త‌న‌కున్న ప‌రిచ‌యాన్ని మంత్రి ఎర్ర‌బెల్లి నెమ‌రు వేసుకున్నారు.

అనేక విష‌యాల్లో తాను నోముల క‌లిసి ప‌ని చేశామ‌న్నారు. అసెంబ్లీలో నోముల త‌న గురువు లాగే అద్భుతంగా మాట్లాడేవార‌న్నారు. మంచ వాక్ప‌టిమ గ‌ల నేత‌గా చెప్పారు. అలాంటి నేత మ‌ర‌ణం అత్యంత బాధాక‌ర‌మ‌ని, వారి ఆత్మ‌కు శాంతి చేకూరాల‌ని, వారి కుటుంబ స‌భ్యుల‌కు త‌న ప్ర‌గాఢ సంతాపాన్ని, సానుభూతిని తెలిపారు.

కొత్త నేతలకు నోముల ఆదర్శం -మంత్రి వేముల నాగార్జున సాగర్ దివంగత ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య మృతి పట్ల మంగళవారం శాసనసభలో జరిగిన సంతాప తీర్మానంలో శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ప్రసంగించారు. కొత్తగా వచ్చిన రాజకీయ నాయకులు నోముల నర్సింహయ్యను ఆదర్శంగా తీసుకోవాలని మంత్రి సూచించారు.

ప్రభుత్వాన్ని విమర్శించడంలో కూడా హుందాతనం ఉండేది. తనదైన శైలిలో ప్రజా సమస్యలపై అప్పటి ప్రభుత్వాలను విమర్శించేవారని అన్నారు. చివరి శ్వాస వరకు పేద ప్రజల కోసం పనిచేసిన గొప్ప నాయకుడు.ఆయన మనమధ్య లేకపోవడం బాధాకరమని వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు.

Follow Us
రోజూ ఒక నారింజ తింటే ఇన్ని లాభాలా..? ఏయే రోగాలను నయం చేస్తుందంటే
రోజూ ఒక నారింజ తింటే ఇన్ని లాభాలా..? ఏయే రోగాలను నయం చేస్తుందంటే
IND vs WI మ్యాచ్ కాదు భయ్యో.. 10 ఏళ్ల నాటి పగ..!
IND vs WI మ్యాచ్ కాదు భయ్యో.. 10 ఏళ్ల నాటి పగ..!
వీరిని పెళ్ళి చేసుకుంటే రోజూ గొడవలు జరుగుతాయి.. ఏయే రాశులంటే?
వీరిని పెళ్ళి చేసుకుంటే రోజూ గొడవలు జరుగుతాయి.. ఏయే రాశులంటే?
రెండు పీపీఎఫ్ అకౌంట్లు తెరవొచ్చా..? కేంద్రం కొత్త రూల్ ఇదే..
రెండు పీపీఎఫ్ అకౌంట్లు తెరవొచ్చా..? కేంద్రం కొత్త రూల్ ఇదే..
జింబాబ్వేపై విజయం.. టీమిండియా డ్రెస్సింగ్ రూమ్‌లో అరుదైన సీన్..
జింబాబ్వేపై విజయం.. టీమిండియా డ్రెస్సింగ్ రూమ్‌లో అరుదైన సీన్..
స్వర్గం నిజంగా ఉందా.. ఏకంగా అడ్రస్ చెబుతున్న సైంటిస్ట్..
స్వర్గం నిజంగా ఉందా.. ఏకంగా అడ్రస్ చెబుతున్న సైంటిస్ట్..
రాత్రి పడుకునేముందు ఈ నేచురల్‌ మిల్క్ ఫేస్ ప్యాక్స్ ట్రై చేశారంటే
రాత్రి పడుకునేముందు ఈ నేచురల్‌ మిల్క్ ఫేస్ ప్యాక్స్ ట్రై చేశారంటే
శ్రీ విష్ణు మరోసారి నవ్వించాడా లేదా..?
శ్రీ విష్ణు మరోసారి నవ్వించాడా లేదా..?
మీ చెవుల ఆకారాన్ని బట్టి మీరు ఎలాంటి వారో తెలుసుకోవచ్చు
మీ చెవుల ఆకారాన్ని బట్టి మీరు ఎలాంటి వారో తెలుసుకోవచ్చు
వీరికి మామిడి డేంజర్.. తింటే హాస్పిటల్స్ చుట్టూ తిరగాల్సిందే
వీరికి మామిడి డేంజర్.. తింటే హాస్పిటల్స్ చుట్టూ తిరగాల్సిందే