AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నోముల పేద‌ల ప‌క్ష‌పాతి.. శాసనసభలో న‌ర్సింహ‌య్య‌ సంతాప తీర్మానంలో ఎర్రబెల్లి దయాకర్‌రావు ‌

‌మ్యూనిస్టుగా జీవితాన్ని ప్రారంభించి, తెలంగాణ ఉద్య‌మ స్ఫూర్తితో టిఆర్ఎస్ లో చేరి, త‌న జీవిత కాలం మొత్తం పేద‌ల కోసం ప‌ని చేసిన నేత‌గా నోముల న‌ర్సింహ‌య్య‌ను..

నోముల పేద‌ల ప‌క్ష‌పాతి.. శాసనసభలో న‌ర్సింహ‌య్య‌ సంతాప తీర్మానంలో ఎర్రబెల్లి దయాకర్‌రావు ‌
Errabelli
K Sammaiah
|

Updated on: Mar 16, 2021 | 1:30 PM

Share

నోముల న‌ర్సింహ‌య్య పేద‌ల ప‌క్ష‌పాతి. త‌న జీవితాంతం పేద ప్రజల కోసం పోరాటం చేసిన ప్ర‌జా నాయ‌కుడ‌ని రాష్ట్ర పంచాయ‌తీరాజ్, గ్రామీణాభి‌వృద్ధి, గ్రామీణ మంచినీటి స‌ర‌ఫ‌రాశాఖ‌ల మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు అన్నారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి త‌న రాజకీయ జీవితాన్ని అంకితమిచ్చిన నేతని ఆయన కొనియాడారు. మంగళవారం రాష్ట్ర శాసనసభ లో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశ పెట్టిన దివంగత నోముల నరసింహ్మయ్య సంతాప తీర్మానాన్ని బలపరుస్తూ మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు మాట్లాడారు.

క‌మ్యూనిస్టుగా జీవితాన్ని ప్రారంభించి, తెలంగాణ ఉద్య‌మ స్ఫూర్తితో టిఆర్ఎస్ లో చేరి, త‌న జీవిత కాలం మొత్తం పేద‌ల కోసం ప‌ని చేసిన నేత‌గా నోముల న‌ర్సింహ‌య్య‌ను ఎర్ర‌బెల్లి పేర్కొన్నారు. నాటి సీనియ‌ర్ ఎమ్మెల్యే న‌ర్రా రాఘ‌వ‌రెడ్డి శిష్యుడిగా, రాజ‌కీయ ప్ర‌వేశం చేసి, అనేక ప్ర‌జా ఉద్య‌మాల్లో పాల్గొన్నారు. లాయ‌ర్ గా కూడా పేద‌ల కేసుల‌ను వాదించి పేరు తెచ్చుకున్నారు. వ‌రంగ‌ల్ ఆడ బిడ్డ‌ను పెండ్లి చేసుకున్నారు. అని నోముల‌తో త‌న‌కున్న ప‌రిచ‌యాన్ని మంత్రి ఎర్ర‌బెల్లి నెమ‌రు వేసుకున్నారు.

అనేక విష‌యాల్లో తాను నోముల క‌లిసి ప‌ని చేశామ‌న్నారు. అసెంబ్లీలో నోముల త‌న గురువు లాగే అద్భుతంగా మాట్లాడేవార‌న్నారు. మంచ వాక్ప‌టిమ గ‌ల నేత‌గా చెప్పారు. అలాంటి నేత మ‌ర‌ణం అత్యంత బాధాక‌ర‌మ‌ని, వారి ఆత్మ‌కు శాంతి చేకూరాల‌ని, వారి కుటుంబ స‌భ్యుల‌కు త‌న ప్ర‌గాఢ సంతాపాన్ని, సానుభూతిని తెలిపారు.

కొత్త నేతలకు నోముల ఆదర్శం -మంత్రి వేముల నాగార్జున సాగర్ దివంగత ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య మృతి పట్ల మంగళవారం శాసనసభలో జరిగిన సంతాప తీర్మానంలో శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ప్రసంగించారు. కొత్తగా వచ్చిన రాజకీయ నాయకులు నోముల నర్సింహయ్యను ఆదర్శంగా తీసుకోవాలని మంత్రి సూచించారు.

ప్రభుత్వాన్ని విమర్శించడంలో కూడా హుందాతనం ఉండేది. తనదైన శైలిలో ప్రజా సమస్యలపై అప్పటి ప్రభుత్వాలను విమర్శించేవారని అన్నారు. చివరి శ్వాస వరకు పేద ప్రజల కోసం పనిచేసిన గొప్ప నాయకుడు.ఆయన మనమధ్య లేకపోవడం బాధాకరమని వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు.

రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
పులివెందులలో కనిపించిన అరుదైన పునుగుపిల్లి! దీని ప్రత్యేకత ఏంటంటే
పులివెందులలో కనిపించిన అరుదైన పునుగుపిల్లి! దీని ప్రత్యేకత ఏంటంటే
గుడ్‌న్యూస్‌..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
గుడ్‌న్యూస్‌..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్‌ ఇస్తారు వీడియో
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్‌ ఇస్తారు వీడియో
భక్తితో గుడికెళ్లారనుకుంటే.. ఈ భార్యాభర్తలు ఏకంగా దేవుడికే..
భక్తితో గుడికెళ్లారనుకుంటే.. ఈ భార్యాభర్తలు ఏకంగా దేవుడికే..
2025లో ఆంధ్రప్రదేశ్‌ను తీవ్ర విషాదంలోకి నెట్టిన ఘోర ప్రమాదాలు ఇవే
2025లో ఆంధ్రప్రదేశ్‌ను తీవ్ర విషాదంలోకి నెట్టిన ఘోర ప్రమాదాలు ఇవే
29 బంతుల్లోనే హాఫ్ సెంచరీ..ఫోర్లు, సిక్సర్లతోనే 50 కొట్టిన కోహ్లీ
29 బంతుల్లోనే హాఫ్ సెంచరీ..ఫోర్లు, సిక్సర్లతోనే 50 కొట్టిన కోహ్లీ
ఎంతకు తెగించార్రా.. 'అమ్మ' పేరుతో మంచి మనిషిని మోసం చేశారు కదరా!
ఎంతకు తెగించార్రా.. 'అమ్మ' పేరుతో మంచి మనిషిని మోసం చేశారు కదరా!
దేశ ప్రజలకు శుభవార్త.. తక్కువ ధరకే సేవలు.. జనవరి 1 నుంచే అమల్లోకి
దేశ ప్రజలకు శుభవార్త.. తక్కువ ధరకే సేవలు.. జనవరి 1 నుంచే అమల్లోకి
శుభలేఖ పంపండి.. శ్రీవారి ఆశీస్సులు పొందండి వీడియో
శుభలేఖ పంపండి.. శ్రీవారి ఆశీస్సులు పొందండి వీడియో