పవన్కు కేటీఆర్ ఘాటు సమాధానం
జనసేన అధినేత పవన్ కల్యాణ్కు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఘాటు సమాధానం ఇచ్చారు. తెలంగాణ నేతలు ఆంధ్రావాళ్లను అడ్డగోలుగా తిడుతున్నారంటూ పవన్ చేసిన వ్యాఖ్యలపై కేటీఆర్ స్పందించారు. ‘‘డియర్ పవన్ కల్యాణ్ గారు, ఈ విషయంలో మీ ఆలోచన తప్పు. విభజన జరిగినప్పటి నుంచి 29 రాష్ట్రాల ప్రజలు ఇక్కడ సుఖంగా జీవిస్తున్నారు. ఈ విషయం మీకు కూడా తెలుసు. దీనిపై మీరు కూడా నాతో అంగీకరిస్తారని భావిస్తున్నా. ఇలాంటి మాటలు నెగిటివీటిని పెంచుతాయి’’ అంటూ […]
జనసేన అధినేత పవన్ కల్యాణ్కు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఘాటు సమాధానం ఇచ్చారు. తెలంగాణ నేతలు ఆంధ్రావాళ్లను అడ్డగోలుగా తిడుతున్నారంటూ పవన్ చేసిన వ్యాఖ్యలపై కేటీఆర్ స్పందించారు.
‘‘డియర్ పవన్ కల్యాణ్ గారు, ఈ విషయంలో మీ ఆలోచన తప్పు. విభజన జరిగినప్పటి నుంచి 29 రాష్ట్రాల ప్రజలు ఇక్కడ సుఖంగా జీవిస్తున్నారు. ఈ విషయం మీకు కూడా తెలుసు. దీనిపై మీరు కూడా నాతో అంగీకరిస్తారని భావిస్తున్నా. ఇలాంటి మాటలు నెగిటివీటిని పెంచుతాయి’’ అంటూ సోషల్ మీడియా వేదికగా కేటీఆర్ సమాధానం ఇచ్చారు.
Dear @PawanKalyan Garu, I hope this was misrepresentation of your thoughts. As you’re aware, Telangana is home to people from 29 states who are living harmoniously since formation of the state
I am sure you agree with me that this sort of rhetoric creates undesirable negativity https://t.co/1ApH2Y64Ov
— KTR (@KTRTRS) March 22, 2019
అయితే భీమవరంలో జరిగిన సమావేశంలో తెలంగాణ ప్రభుత్వంపై పవన్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఏపీ రాజకీయాల్లో తెలంగాణ ముఖ్యమంత్రి జోక్యం చేసుకుంటున్నారని ఆరోపించిన పవన్.. తెలంగాణ నాయకులు ఆంధ్రావాళ్లను అడ్డగోలుగా తిడుతున్నా.. హైదరాబాద్లో ఉన్న మన ఎమ్మెల్యేలకు మాట్లాడటానికి ధైర్యం లేకుండా పోయిందని పవన్ వ్యాఖ్యలు చేశారు.