బాబుకు ఓటేస్తే పాక్‌కు ఓటేసినట్లే

చంద్రబాబు నాయుడుకు ఓటేస్తే పాకిస్థాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌కు ఓటేసినట్లేనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం గుంటూరు జిల్లా పొన్నూరులో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 2017 సంవత్సరంలో జరిగిన ఓ అసెంబ్లీ సమావేశంలో మోదీపై బాబు ప్రశంసలు కురిపించారని.. మోదీలాంటి అవినీతి రహిత ప్రధానిని తాను చూడలేదని చంద్రబాబు స్వయంగా ప్రకటించారని కన్నా గుర్తుచేశారు. రాజకీయ లబ్ది కోసమే ఇప్పుడు బాబు నాటకాలు ఆడుతున్నారంటూ ఆయన విమర్శలు కురిపించారు.

బాబుకు ఓటేస్తే పాక్‌కు ఓటేసినట్లే
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: Apr 06, 2019 | 3:44 PM

చంద్రబాబు నాయుడుకు ఓటేస్తే పాకిస్థాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌కు ఓటేసినట్లేనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం గుంటూరు జిల్లా పొన్నూరులో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 2017 సంవత్సరంలో జరిగిన ఓ అసెంబ్లీ సమావేశంలో మోదీపై బాబు ప్రశంసలు కురిపించారని.. మోదీలాంటి అవినీతి రహిత ప్రధానిని తాను చూడలేదని చంద్రబాబు స్వయంగా ప్రకటించారని కన్నా గుర్తుచేశారు. రాజకీయ లబ్ది కోసమే ఇప్పుడు బాబు నాటకాలు ఆడుతున్నారంటూ ఆయన విమర్శలు కురిపించారు.