జనసేన పార్టీ అసెంబ్లీ అభ్యర్థుల ఆరో జాబితా

ఒక‌వైపు నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతుండగా.. జనసేన పార్టీ మరో జాబితాను ప్రకటించింది. 16 అసెంబ్లీ స్థానాలకు పవన్ అభ్యర్థులను ఖరారు చేశారు. ఈ జాబితాలో అనంతపురం జిల్లా నుంచి అత్యధికంగా ఐదు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. నంద్యాల నుంచి ఎస్పీవై రెడ్డి అల్లుడు సజ్జల శ్రీధర్ రెడ్డి పోటీ చేయనున్నారు. టీడీపీలో టికెట్ రాకపోవడంతో ఎస్పీవై రెడ్డి, ఆయన అల్లుడు ఇటీవలే పార్టీ నుంచి బయటకు రాగా.. వారికి జనసేన నుంచి ఆహ్వానం అందింది. టీడీపీ సిట్టింగ్ […]

జనసేన పార్టీ అసెంబ్లీ అభ్యర్థుల ఆరో జాబితా
Follow us

| Edited By:

Updated on: Mar 23, 2019 | 11:53 AM

ఒక‌వైపు నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతుండగా.. జనసేన పార్టీ మరో జాబితాను ప్రకటించింది. 16 అసెంబ్లీ స్థానాలకు పవన్ అభ్యర్థులను ఖరారు చేశారు. ఈ జాబితాలో అనంతపురం జిల్లా నుంచి అత్యధికంగా ఐదు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. నంద్యాల నుంచి ఎస్పీవై రెడ్డి అల్లుడు సజ్జల శ్రీధర్ రెడ్డి పోటీ చేయనున్నారు. టీడీపీలో టికెట్ రాకపోవడంతో ఎస్పీవై రెడ్డి, ఆయన అల్లుడు ఇటీవలే పార్టీ నుంచి బయటకు రాగా.. వారికి జనసేన నుంచి ఆహ్వానం అందింది.

టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే బాలకృష్ణకు పోటీగా హిందూపురం నుంచి ఆకుల ఉమేష్‌కు జనసేన టికెట్ కేటాయించింది. వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్‌కు పోటీగా పులివెందులలో తుపాకుల చంద్రశేఖర్ పొటీ చేయనున్నారు. పరిటాల శ్రీరామ్ పోటీ చేస్తున్న రాప్తాడు నుంచి జనసేన తరఫున పాక పవన్ కుమార్‍కు అవకాశం కల్పించారు.