AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

దేశానికిక కొత్త ప్రధాని, చంద్రబాబు జోస్యం

ఈ నెల 23తరువాత దేశం కొత్త ప్రధానిని చూడబోతోందని ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీతో సమావేశమైన అనంతరం చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. బీజేపీకి ఈసారి తీవ్ర పరాభవం తప్పదని, సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వచ్చాక అందరూ కూర్చొని చర్చించి ప్రధాని అభ్యర్థి గురించి నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు. ‘‘భారత ప్రజాస్వామ్యం గొప్పతనం ఇదే. ప్రధాని ఎవరు అన్నది మీరు, నేను డిసైడ్ చేయలేం. […]

దేశానికిక కొత్త ప్రధాని, చంద్రబాబు జోస్యం
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: May 08, 2019 | 11:55 AM

Share

ఈ నెల 23తరువాత దేశం కొత్త ప్రధానిని చూడబోతోందని ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీతో సమావేశమైన అనంతరం చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. బీజేపీకి ఈసారి తీవ్ర పరాభవం తప్పదని, సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వచ్చాక అందరూ కూర్చొని చర్చించి ప్రధాని అభ్యర్థి గురించి నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు.

‘‘భారత ప్రజాస్వామ్యం గొప్పతనం ఇదే. ప్రధాని ఎవరు అన్నది మీరు, నేను డిసైడ్ చేయలేం. మెజారిటీ ప్రజలు ఇప్పటికే తమ తీర్పును ఇచ్చేశారు. ఫలితాల తరువాత దేశానికి ఎవరు ప్రధాని అయితే మంచిదన్న విషయమై ఏకాభిప్రాయానికి వస్తాం. ఈ నెల 21న సమీక్షా సమావేశం జరుగుతుంది. మే 23 తర్వాత సమావేశమై తుది నిర్ణయం తీసుకుంటాం’’ అని చంద్రబాబు పేర్కొన్నారు. ఇక రాహుల్‌తో భేటీ అనంతరం చంద్రబాబు కోల్‌కతాకు బయలుదేరారు. అక్కడ మమతా బెనర్జీ తరఫున ఇవాళ, రేపు ఆయన ప్రచారం నిర్వహించనున్నారు.