AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఖమ్మం కాంగ్రెస్ లోక్‌సభ అభ్యర్థిగా రేణుకా చౌదరి

తెలంగాణ కాంగ్రెస్ ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థిని ఏఐసీసీ ఖరారు చేసింది. ఖమ్మం లోక్‌సభ కాంగ్రెస్ అభ్యర్థిగా మాజీ కేంద్ర మంత్రి గారపాటి రేణుకా చౌదరికి టికెట్ కేటాయించారు. రెండు విడతలుగా తెలంగాణ అభ్యర్థుల జాబితాను ప్రకటించిన కాంగ్రెస్.. ఖమ్మం సీటును పెండింగ్‌లో పెట్టిన సంగతి తెలిసిందే. రేణుకా చౌదరితో పాటు పోట్ల నాగేశ్వరరావు, గాయత్రి రవిల పేర్లను కూడా కాంగ్రెస్ హైకమాండ్ పరిశీలిస్తున్నట్టు కథనాలు రావడంతో ఖమ్మం సీటును కాంగ్రెస్ ఎవరికి దక్కుతుందా? అన్న ఆసక్తి నెలకొంది. […]

ఖమ్మం  కాంగ్రెస్ లోక్‌సభ అభ్యర్థిగా రేణుకా చౌదరి
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Mar 23, 2019 | 11:02 AM

Share

తెలంగాణ కాంగ్రెస్ ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థిని ఏఐసీసీ ఖరారు చేసింది. ఖమ్మం లోక్‌సభ కాంగ్రెస్ అభ్యర్థిగా మాజీ కేంద్ర మంత్రి గారపాటి రేణుకా చౌదరికి టికెట్ కేటాయించారు. రెండు విడతలుగా తెలంగాణ అభ్యర్థుల జాబితాను ప్రకటించిన కాంగ్రెస్.. ఖమ్మం సీటును పెండింగ్‌లో పెట్టిన సంగతి తెలిసిందే. రేణుకా చౌదరితో పాటు పోట్ల నాగేశ్వరరావు, గాయత్రి రవిల పేర్లను కూడా కాంగ్రెస్ హైకమాండ్ పరిశీలిస్తున్నట్టు కథనాలు రావడంతో ఖమ్మం సీటును కాంగ్రెస్ ఎవరికి దక్కుతుందా? అన్న ఆసక్తి నెలకొంది. ప్రస్తుత రాజకీయ పరిణామాల్లో రేణుకా చౌదరి ఖమ్మం లో పోటీకి తగిన నాయకురాలు అని భావించిన యూపీఏ ఛైర్పర్సన్ సోనియాగాంధీ , ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆమెను ఖరారు చేసి ప్రకటించారు. ఈ 25 న రేణుకా చౌదరి ఖమ్మం పార్లమెంటు కాంగ్రెస్ అభ్యర్థిగా నామినేషన్ వేయనున్నారు.

కాగా 1994,2004 లోక్‌సభ ఎన్నికల్లో రేణుకా చౌదరి ఖమ్మం నుంచి విజయం సాధించారు. 2009 ఎన్నికల్లో అప్పటి టీడీపీ అభ్యర్థి నామా నాగేశ్వరరావు చేతిలో ఓటమిపాలయ్యారు. ఒకే సామాజిక వర్గానికి చెందిన ఈ ఇద్దరు ఖమ్మం బరిలో మరోసారి తలపడబోతున్నారు. అయితే గతంలో లాగే ఈసారి కూడా రేణుకా చౌదరి కాంగ్రెస్ నుంచి బరిలో దిగుతుండగా.. నామా మాత్రం ఈసారి టీఆర్ఎస్ నుంచి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఖమ్మం లోక్‌సభ సెగ్మెంట్‌ను ఇంతవరకు కైవసం చేసుకోని టీఆర్ఎస్.. ఈసారి ఎలాగైనా గెలవాలన్న పట్టుదలతో ఉంది. మరోవైపు రేణుకా చౌదరి కూడా గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తుండటంతో.. ఖమ్మంలో గెలుపెవరిది అన్న దానిపై ప్రత్యేక ఆసక్తి నెలకొంది.