AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చిదంబరానికి సుప్రీం ఊరట..!

ఐఎన్‌ఎక్స్ మీడియా కేసులో జైలుకెళ్లిన కాంగ్రెస్ నేత చిదంబరానికి సుప్రీం కోర్టు స్వల్ప ఊరటనిచ్చింది. చిదంబరాన్ని కస్టడీ కోరుతూ.. దాఖలైన పిటిషన్‌పై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. పిటిషన్‌పై సమాధానం ఇవ్వాలంటూ.. సీబీఐకి నోటీసులు ఇచ్చింది సుప్రీం. కాగా.. చిదంబరానికి మధ్యంతర రక్షణ కల్పించాలని.. సుప్రీంని కోరిన చిదంబరం తరపు న్యాయవాది కపిల్ సిబాల్. బెయిల్ కోసం ట్రయల్ కోర్టును ఆశ్రయించాలని చిదంబరం తరపు న్యాయవాదికి సుప్రీం కోర్టు సూచించింది. అలాగే.. చిదంబరం పిటిషన్ వేస్తే పరిశీలించాలని […]

చిదంబరానికి సుప్రీం ఊరట..!
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Sep 02, 2019 | 3:04 PM

Share

ఐఎన్‌ఎక్స్ మీడియా కేసులో జైలుకెళ్లిన కాంగ్రెస్ నేత చిదంబరానికి సుప్రీం కోర్టు స్వల్ప ఊరటనిచ్చింది. చిదంబరాన్ని కస్టడీ కోరుతూ.. దాఖలైన పిటిషన్‌పై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. పిటిషన్‌పై సమాధానం ఇవ్వాలంటూ.. సీబీఐకి నోటీసులు ఇచ్చింది సుప్రీం. కాగా.. చిదంబరానికి మధ్యంతర రక్షణ కల్పించాలని.. సుప్రీంని కోరిన చిదంబరం తరపు న్యాయవాది కపిల్ సిబాల్. బెయిల్ కోసం ట్రయల్ కోర్టును ఆశ్రయించాలని చిదంబరం తరపు న్యాయవాదికి సుప్రీం కోర్టు సూచించింది. అలాగే.. చిదంబరం పిటిషన్ వేస్తే పరిశీలించాలని ట్రయల్ కోర్టును ఆదేశించిన సుప్రీంకోర్టు. ట్రయల్ కోర్టు.. బెయిల్‌ను తిరస్కరిస్తే చిదంబరాన్ని తీహార్ జైలుకు పంపవద్దని సుప్రీం సూచన.