AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Photos: కోహినూర్ ఒకప్పుడు ప్రపంచంలోనే అతిపెద్ద వజ్రం.. కానీ ఇప్పుడు ఎక్కడుందో తెలుసా..?

Viral Photos: ప్రపంచంలో వజ్రాలకు కొదవలేదు. అయితే కొన్ని వజ్రాలు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు సాధించాయి. వాటిలో ఒకటి కోహినూర్ వజ్రం. ఇది ఒకప్పుడు ప్రపంచంలోనే అతిపెద్ద వజ్రంగా పేరుగాంచింది.

uppula Raju
|

Updated on: Jan 26, 2022 | 1:20 PM

Share
ప్రపంచంలో వజ్రాలకు కొదవలేదు. అయితే కొన్ని వజ్రాలు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు సాధించాయి. వాటిలో ఒకటి కోహినూర్ వజ్రం. ఇది ఒకప్పుడు ప్రపంచంలోనే అతిపెద్ద వజ్రంగా పేరుగాంచింది. ఇది ఆంధ్రప్రదేశ్‌లోని గోల్కొండలో కనుగొన్నారు. అయితే దురదృష్టవశాత్తు ఈ వజ్రం భారతదేశంలో లేదు. ప్రస్తుతం ఈ వజ్రం ఇంగ్లండ్ రాణి కిరీటాన్ని అలంకరిస్తోంది. ఈ వజ్రాన్ని భారత్ ఎప్పటికప్పుడు డిమాండ్ చేస్తున్నప్పటికీ ఇంగ్లండ్ నుంచి మాత్రం ప్రతిసారీ నిరాశే ఎదురవుతోంది.

ప్రపంచంలో వజ్రాలకు కొదవలేదు. అయితే కొన్ని వజ్రాలు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు సాధించాయి. వాటిలో ఒకటి కోహినూర్ వజ్రం. ఇది ఒకప్పుడు ప్రపంచంలోనే అతిపెద్ద వజ్రంగా పేరుగాంచింది. ఇది ఆంధ్రప్రదేశ్‌లోని గోల్కొండలో కనుగొన్నారు. అయితే దురదృష్టవశాత్తు ఈ వజ్రం భారతదేశంలో లేదు. ప్రస్తుతం ఈ వజ్రం ఇంగ్లండ్ రాణి కిరీటాన్ని అలంకరిస్తోంది. ఈ వజ్రాన్ని భారత్ ఎప్పటికప్పుడు డిమాండ్ చేస్తున్నప్పటికీ ఇంగ్లండ్ నుంచి మాత్రం ప్రతిసారీ నిరాశే ఎదురవుతోంది.

1 / 5
వాస్తవానికి ఈ వజ్రం 793 క్యారెట్లు ఉండేదని ఇప్పుడు 105.6 క్యారెట్లు మాత్రమే మిగిలి ఉందని అంటున్నారు. ఈ వజ్రం బరువు 21.6 గ్రాములు.

వాస్తవానికి ఈ వజ్రం 793 క్యారెట్లు ఉండేదని ఇప్పుడు 105.6 క్యారెట్లు మాత్రమే మిగిలి ఉందని అంటున్నారు. ఈ వజ్రం బరువు 21.6 గ్రాములు.

2 / 5
ఇరాన్ పాలకుడు నాదిర్ షా ఈ వజ్రానికి కోహినూర్ అని పేరు పెట్టాడు. 1738లో అప్పటి ఢిల్లీ పాలకుడు మహమ్మద్ షాను ఓడించి బందీగా తీసుకెళ్లి ఖజానా మొత్తాన్ని కొల్లగొట్టాడు. అందులో కోహినూర్ వజ్రం కూడా ఉంది.

ఇరాన్ పాలకుడు నాదిర్ షా ఈ వజ్రానికి కోహినూర్ అని పేరు పెట్టాడు. 1738లో అప్పటి ఢిల్లీ పాలకుడు మహమ్మద్ షాను ఓడించి బందీగా తీసుకెళ్లి ఖజానా మొత్తాన్ని కొల్లగొట్టాడు. అందులో కోహినూర్ వజ్రం కూడా ఉంది.

3 / 5
కోహినూర్ గురించిన ఒక విషయం నేటికీ మిస్టరీగా మిగిలిపోయింది. ఈ వజ్రం సుమారు 5 వేల సంవత్సరాల క్రితం కనుగొన్నారని కొందరు అంటున్నారు. అయితే దీని మూలం ఇప్పటికీ స్పష్టంగా తెలియదు.

కోహినూర్ గురించిన ఒక విషయం నేటికీ మిస్టరీగా మిగిలిపోయింది. ఈ వజ్రం సుమారు 5 వేల సంవత్సరాల క్రితం కనుగొన్నారని కొందరు అంటున్నారు. అయితే దీని మూలం ఇప్పటికీ స్పష్టంగా తెలియదు.

4 / 5
1813 సంవత్సరంలో కోహినూర్ వజ్రం సిక్కు రాజు మహారాజా రంజిత్ సింగ్ వద్దకు వచ్చింది. దానిని అతను తన కిరీటంలో ధరించాడు. అతను 1839లో మరణించినప్పుడు ఈ వజ్రం అతని కుమారుడు దిలీప్ సింగ్ వద్దకు వచ్చింది. అయితే 1849లో బ్రిటన్ అతన్ని ఓడించి ఒప్పందం చేసుకుంది. దీని ప్రకారం కోహినూర్‌ను ఇంగ్లాండ్ రాణికి అప్పగించవలసి వచ్చింది అప్పటి నుంచి ఈ వజ్రం ఇంగ్లాండ్‌లోనే ఉంది.

1813 సంవత్సరంలో కోహినూర్ వజ్రం సిక్కు రాజు మహారాజా రంజిత్ సింగ్ వద్దకు వచ్చింది. దానిని అతను తన కిరీటంలో ధరించాడు. అతను 1839లో మరణించినప్పుడు ఈ వజ్రం అతని కుమారుడు దిలీప్ సింగ్ వద్దకు వచ్చింది. అయితే 1849లో బ్రిటన్ అతన్ని ఓడించి ఒప్పందం చేసుకుంది. దీని ప్రకారం కోహినూర్‌ను ఇంగ్లాండ్ రాణికి అప్పగించవలసి వచ్చింది అప్పటి నుంచి ఈ వజ్రం ఇంగ్లాండ్‌లోనే ఉంది.

5 / 5
Follow Us