- Telugu News Photo Gallery Technology photos World class railway stations like airports in India will wonders you
Railway Stations: ప్రపంచంలోనే అత్యాధునికంగా.. ఎయిర్పోర్టుల్లాంటి భారతీయ రైల్వే స్టేషన్లు.. వీటి గురించి తెలిస్తే వావ్ అనకుండా ఉండలేరు!
భోపాల్లో ప్రపంచ స్థాయి కొత్త రైల్వే స్టేషన్ను ప్రధాని నరేంద్ర మోదీ నేడు ప్రారంభించనున్నారు. దీనికి రాణి కమలాపతి (గతంలో హబీబ్గంజ్) స్టేషన్ అని పేరు పెట్టారు. దీనితో పాటు దేశంలోని 110 రైల్వే స్టేషన్ల పునర్ అభివృద్ధికి ప్రభుత్వ ప్రణాళిక సిద్ధమైంది. వీటిలో టాప్ 10 ప్రపంచ స్థాయి రైల్వే స్టేషన్ల గురించి చూద్దాం.
Updated on: Nov 15, 2021 | 11:49 AM

రాణి కమలాపతి స్టేషన్ పర్యావరణ అనుకూల భవనంగా రూపొందించారు. ఇక్కడ 1100 మంది కలిసి కూర్చోవచ్చు. స్టేషన్లో ఎయిర్ కండిషన్ వెయిటింగ్ రూమ్ ఉంది. సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. హోటళ్లు, ఆసుపత్రులు, షాపింగ్ మాల్స్, ఫుడ్ కోర్టులతో ఇక్కడ అనేక సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయి.

గుజరాత్ రాజధాని గాంధీనగర్లో విమానాశ్రయం తరహాలో రైల్వే స్టేషన్ను నిర్మించారు. పైన 318 గదులతో ఫైవ్ స్టార్ హోటల్ కూడా ఉంది. దేశంలోనే మొదటి రైల్వే స్టేషన్ ఇదే. ఇక్కడ ప్రత్యేక ప్రార్థన గది, శిశువులకు ఆహారం ఇచ్చే గది ఏర్పాటు చేశారు. ప్రవేశ ద్వారం, బుకింగ్, లిఫ్ట్-ఎస్కలేటర్, బుక్ స్టాల్, ఫుడ్ స్టాల్ సహా అన్ని సౌకర్యాలతో పాటు, ప్రథమ చికిత్స కోసం ఒక చిన్న ఆసుపత్రిని కూడా నిర్మిస్తున్నారు. స్టేషన్ మొత్తం సీసీ కెమెరాల నిఘాలో ఉంటుంది.

దేశ రాజధానిలోని న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ (ఎన్డిఎల్ఎస్)ను పిపిపి విధానంలో ఆర్ఎల్డిఎ ప్రపంచ స్థాయి రైల్వే స్టేషన్గా అభివృద్ధి చేస్తుంది. ఈ ప్రాజెక్టుకు రూ.8,500 కోట్లు ఖర్చవుతుందని అంచనా. ఈ స్టేషన్లోకి ప్రవేశించడానికి.. బయటికి వెళ్లడానికి వివిధ మార్గాలు ఉంటాయి. ఎలివేటెడ్ కాన్కోర్స్లను కూడా అభివృద్ధి చేస్తారు. ఇక్కడ ఇప్పటికే ఉన్న మొత్తం 16 ప్లాట్ఫారమ్లు మళ్లీ అభివృద్ధి చేస్తారు.

చండీగఢ్ స్టేషన్ను ప్రపంచ స్థాయి రైల్వే స్టేషన్గా మార్చేందుకు రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ (RFP) ఇప్పటికే ఆహ్వానించారు. ఈ స్టేషన్ను సిద్ధం చేసేందుకు రూ.131.40 కోట్లు వెచ్చించనున్నారు. విమానాశ్రయం మాదిరిగానే రైల్వే ప్రయాణికులు కూడా ఇక్కడికి రావాలంటే నామమాత్రపు రుసుము చెల్లించాల్సి ఉంటుంది. దీని ఛార్జీ ప్రయాణీకుల రైల్వే టిక్కెట్కు జోడిస్తారు. ఈ స్టేషన్ను సిద్ధం చేయడంలో గ్రీనరీ కూడా ప్రధానంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

ఢిల్లీలోని ఆనంద్ విహార్ స్టేషన్ను ఐఆర్ఎస్డీసీ(IRSDC) తిరిగి అభివృద్ధి చేస్తుంది. ఇంజినీరింగ్, ప్రొక్యూర్మెంట్, కన్స్ట్రక్షన్ (EPC) మోడ్లో స్టేషన్ను మంజూరు చేస్తున్నట్లు గతంలో చెప్పారు. ఇతర స్టేషన్లతో పోలిస్తే ఇది మరింత ఓపెన్గా ఉంటుంది. ఇక్కడ ప్రయాణికులు రాకపోకలు సాగించేందుకు వివిధ మార్గాలను ఏర్పాటు చేసి ఎలాంటి ఇబ్బందులు లేకుండా సులభంగా తిరగాలిగేలా చేస్తారు.

గ్వాలియర్ రైల్వే స్టేషన్ను ఐఆర్ఎస్డీసీ తిరిగి అభివృద్ధి చేస్తుంది. స్టేషన్ రీ డెవలప్ మెంట్ కు రూ.240 కోట్లు వెచ్చిస్తారు. 2,30,425 చదరపు మీటర్ల విస్తీర్ణంలో స్టేషన్ను తిరిగి అభివృద్ధి చేయనున్నారు. ఈ ప్రాజెక్ట్ కింద, వారసత్వ భవనాన్ని హైలైట్ చేస్తూ కొత్త ఎంట్రీ, ఎగ్జిట్ బ్లాక్లు ఏర్పాటు చేస్తారు.

గుజరాత్లోని సూరత్ రైల్వే స్టేషన్ను ఐఆర్ఎస్డిసి విలాసవంతమైన మల్టీ మోడల్ ట్రాన్స్పోర్ట్ హబ్గా మారుస్తుంది. ఇది విశాలమైన స్టేషన్ లాబీ, బస్ టెర్మినల్, పెద్ద టిక్కెట్ హాల్, మాడ్యులర్ ప్యాసింజర్-ఫ్రెండ్లీ కాన్కోర్స్, కొత్త ప్లాట్ఫారమ్తో పాటు బోర్డింగ్ ఏరియాను వంతెనలు, ఎయిర్పోర్ట్ స్టైల్ ఫుడ్ ప్లాజా, రిటైల్ ఏరియాతో అనుసంధానించే సౌకర్యాలతో కూడిన ఆధునిక స్టేషన్ భవనం.

ఐఆర్ఎస్డీసీ(IRSDC) నేతృత్వంలో, అమృత్సర్ రైల్వే స్టేషన్లో రీ-డెవలప్మెంట్ పని పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్షిప్ (PPP) మోడల్ ద్వారా జరుగుతుంది. రూ.300 కోట్లతో ప్రపంచ స్థాయి రైల్వే స్టేషన్గా మార్చనున్నారు. పూర్తిగా పునరుద్ధరించిన తర్వాత, స్టేషన్లో రద్దీని సులభంగా నిర్వహించవచ్చు. ఇక్కడ ప్రయాణికులు కూర్చునేందుకు స్థలం ఉంటుంది. వెళ్లే ప్రయాణికుల కోసం పూర్తి స్థాయిలో లైటింగ్ ఏర్పాటు చేయనున్నారు.

ఢిల్లీలోని బిజ్వాసన్ రైల్వే స్టేషన్ను IRSDC EPC మోడ్ని ఉపయోగించి తిరిగి అభివృద్ధి చేస్తుంది. 270.82 కోట్లు ఈ స్టేషన్ పునర్ అభివృద్ధి కోసం వెచ్చించనున్నారు. అదే సమయంలో, ఇది రాబోయే మూడేళ్లలో పూర్తిగా సిద్ధంగా ఉంటుంది. రీ-డెవలప్మెంట్ స్టేషన్లో ప్రత్యేక ఎంట్రీ-ఎగ్జిట్ జోన్లు ఉంటాయి. ఏదైనా విమానాశ్రయం వలె అరైవల్/డిపార్చర్ జోన్లు ఉంటాయి. స్టేషన్లో విమానాశ్రయ దుకాణం, ఫుడ్ స్టాల్, ఆధునిక వెయిటింగ్ ఏరియా వంటి అనేక సౌకర్యాలు ఉంటాయి.

మహాత్మా గాంధీ నేతృత్వంలోని దండి మార్చ్ (ఉప్పు ఉద్యమం) థీమ్తో స్టేషన్ను తిరిగి అభివృద్ధి చేస్తారు. ప్రస్తుతం ఉన్న సబర్మతి స్టేషన్-మీటర్ గేజ్, సబర్మతి జంక్షన్ స్టేషన్-బ్రాడ్ గేజ్ స్టేషన్లో ప్రయాణీకుల కదలికను సులభతరం చేయడానికి తిరిగి కనెక్ట్ చేస్తారు. దేశంలోనే తొలి ముంబై-అహ్మదాబాద్ బుల్లెట్ రైలు ఈ రెండు స్టేషన్ల మధ్యే వెళ్లనుంది.





























