AP News: ఆలయాల ఎదురుగా కుక్కల కళేబరాలు.. అసలు స్టోరీ వింటే కళ్లు తేలేస్తారు..
మూడు రోజుల కిందట ఆలయాలు ఎదురుగా ఉన్న వీధి కుక్కలు వరుసగా చనిపోయాయి. వాటి కళేబరాలు అక్కడ దర్శనమిచ్చాయ్. అసలేం జరిగిందో..? ఏంటో.? తెలియదు.. ఈలోగా అనూహ్యం సంఘటన ఎదురైంది. అసలేం జరిగిందంటే.. ఈ స్టోరీలో తెలుసుకుందామా.. ఓ సారి లుక్కేయండి.
కృష్ణాజిల్లా తోట్లవల్లూరు మండలం పెనమకూరు గ్రామంలోని దేవాలయాల్లో వరుసగా దొంగతనాలు జరిగాయి. స్థానిక గంగానమ్మ గుడి, వీరమ్మ గుడిలో దొంగతనాలు జరగ్గా.. రామాలయంలో దొంగతనానికి విఫలయత్నం చేశారు దుండగులు. గంగానమ్మ అమ్మవారి బంగారు సూత్రాలు అపహరించారు. అలాగే వీరమ్మ ఆలయంలో హుండీ దొంగతనం జరిగింది. పక్కా ప్రణాళికతో ఈ దొంగతనానికి స్కెచ్ వేశారు దుండగులు. ఈ దొంగతనాలతో.. మరో సంచలన విషయం బయటపడింది. దేవాలయాల వద్ద ఉంటున్న వీధి కుక్కలను మూడు రోజుల క్రితమే మందు పెట్టి చంపినట్టు గుర్తించారు. దీంతో గ్రామస్తులలో తీవ్ర భయాందోళన నెలకొంది.
Follow Us
వైరల్ వీడియోలు
ఉక్కపోతతో ఇళ్లలోకి నాగుల ఎంట్రీ.. నంద్యాలలో భారీ కోబ్రా కలకలం
భవనంపై చిక్కుకున్న శునకం.. దిక్కుతోచక విలవిల..
వ్యక్తి కడుపులో రాళ్లగుట్ట..స్కానింగ్ రిపోర్ట్ చూసి షాక్!
అంతరిక్ష అద్భుతాన్ని మన గ్రామస్తుడు ఫొటో తీసాడు!
టాయిలెట్ లేదని.. ప్రభుత్వ ఉద్యోగాన్ని వదిలేశాడు
మృత్యుంజయుడు.. పిడుగు పడినా బతికాడు
పాత ప్యాంటు జేబులో లాటరీ టికెట్.. చివరి నిమిషంలో అద్భుతం

