తిరుపతి గంగమ్మ జాతరలో తుది ఘట్టం అదే.. వేల సంఖ్యలో తరలివస్తున్న భక్తులు..
తిరుపతి గ్రామ దేవత అయిన తాతయ్య గుంట గంగమ్మ జాతర ఉత్సవాలు అంబరాన్ని అంటుతున్నాయి. జాతరలో 5వ రోజు మాతంగి వేషంలో అమ్మవారికి భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. అనంత వీధి నుంచి గంగమ్మ గుడి వరకు శోభాయాత్ర జరిగింది. అందులో టిటిడి చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డితో పాటు తిరుపతి మేయర్ శిరీష, డిప్యూటీ మేయర్, తిరుపతి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి భూమన అభినయ్ పాల్గొన్నారు. వివిధ రూపాలు, వేషధారణలు, కళారూపాల ప్రదర్శనలతో తిరుపతి పురవీధుల్లో శోభాయాత్ర అంగరంగ వైభవంగా సాగింది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
