AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tirupati: చక్రస్నానంతో ముగిసిన అమ్మవారి బ్రహ్మోత్సవాలు.. దేవేరికి 825 గ్రాములు బంగారు పతాకాన్ని బహుమతిగా ఇచ్చిన శ్రీవారు

Tirupati:తిరుచానూరు పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు బుధవారం ముగిశాయి. కరోనా నిబంధనలను పాటిస్తూ.. అధికారులు అమ్మవారి బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. బ్రహ్మోత్సవాల్లో చివరి రోజున ఆనవాయితీని అనుసరిస్తూ.. శ్రీవారి ఆలయం నుంచి దేవేరికి సారెను తీసుకుని వెళ్లారు. శాస్త్రోక్తంగా శ్రీ పద్మావతి అమ్మవారి పంచమీ తీర్థం నిర్వహించారు. ఇక ఈరోజు అమ్మవారి ఆలయంలో పుష్పయాగం జరుగుతుంది.

Surya Kala

|

Updated on: Dec 09, 2021 | 4:01 PM

సిరుల‌త‌ల్లి శ్రీ పద్మావతి అమ్మవారు అవతరించిన పంచమి తిథిని పురస్కరించుకుని కార్తీక బ్రహ్మోత్సవాల్లో చివరి రోజైన బుధవారం పంచమీ తీర్థం శాస్త్రోక్తంగా జరిగింది. ఆల‌యం వ‌ద్దగ‌ల వాహ‌న మండ‌పంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన చిన్న  పుష్కరిణిలో ఉద‌యం 11.52 గంటలకు కుంభ లగ్నంలోచక్రస్నానం ఘట్టం శాస్త్రోక్తంగా నిర్వహించారు.

సిరుల‌త‌ల్లి శ్రీ పద్మావతి అమ్మవారు అవతరించిన పంచమి తిథిని పురస్కరించుకుని కార్తీక బ్రహ్మోత్సవాల్లో చివరి రోజైన బుధవారం పంచమీ తీర్థం శాస్త్రోక్తంగా జరిగింది. ఆల‌యం వ‌ద్దగ‌ల వాహ‌న మండ‌పంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన చిన్న పుష్కరిణిలో ఉద‌యం 11.52 గంటలకు కుంభ లగ్నంలోచక్రస్నానం ఘట్టం శాస్త్రోక్తంగా నిర్వహించారు.

1 / 10
ఉదయం శ్రీ పద్మావతి అమ్మవారి  పల్లకీ ఉత్సవం నిర్వహించారు. అనంతరం అమ్మవారికి  ఆస్థానం నిర్వహించి ఉత్సవర్లను ఊరేగింపుగా వాహన మండపానికి వేంచేపు చేశారు.

ఉదయం శ్రీ పద్మావతి అమ్మవారి పల్లకీ ఉత్సవం నిర్వహించారు. అనంతరం అమ్మవారికి ఆస్థానం నిర్వహించి ఉత్సవర్లను ఊరేగింపుగా వాహన మండపానికి వేంచేపు చేశారు.

2 / 10
తిరుమల శ్రీవారి ఆలయం నుంచి బుధవారం తెల్లవారుజామున పసుపు, కుంకుమ, ప్రసాదాలు, తులసి, వస్త్రాలు, ఆభరణంతో కూడిన సారె బయల్దేరి ఉదయం 10 గంటలకు తిరుచానూరు అమ్మవారి ఆలయానికి చేరుకుంది. సారెను  అమ్మవారికి సమర్పించి శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు.

తిరుమల శ్రీవారి ఆలయం నుంచి బుధవారం తెల్లవారుజామున పసుపు, కుంకుమ, ప్రసాదాలు, తులసి, వస్త్రాలు, ఆభరణంతో కూడిన సారె బయల్దేరి ఉదయం 10 గంటలకు తిరుచానూరు అమ్మవారి ఆలయానికి చేరుకుంది. సారెను అమ్మవారికి సమర్పించి శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు.

3 / 10

825 గ్రాములు బ‌రువుగ‌ల కెంపులు, పచ్చలు, నీలము, ముత్యాలు పొదిగిన బంగారు పతకము, రెండు బాజీ బందులు శ్రీ ప‌ద్మావ‌తి అమ్మవారికి కానుక‌గా స‌మ‌ర్పించారు. ప్రతి ఏటా పంచమితీర్థం రోజున తిరుమల నుంచి సారె తీసుకెళ్లడం ఆనవాయితీగా వస్తోంది.

825 గ్రాములు బ‌రువుగ‌ల కెంపులు, పచ్చలు, నీలము, ముత్యాలు పొదిగిన బంగారు పతకము, రెండు బాజీ బందులు శ్రీ ప‌ద్మావ‌తి అమ్మవారికి కానుక‌గా స‌మ‌ర్పించారు. ప్రతి ఏటా పంచమితీర్థం రోజున తిరుమల నుంచి సారె తీసుకెళ్లడం ఆనవాయితీగా వస్తోంది.

4 / 10
ఆభ‌ర‌ణంతో కూడిన శ్రీ‌వారి సారెను అలిపిరి వ‌ద్ద అద‌న‌పు ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి తిరుప‌తి జెఈవో శ్రీ వీరబ్రహ్మంకు అంద‌జేశారు. అక్కడి నుండి తీసుకొచ్చిన సారెను శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం వ‌ద్ద ఈవో డాక్టర్ కె.ఎస్.జవహర్ రెడ్డికి జెఈవో అందించారు.

ఆభ‌ర‌ణంతో కూడిన శ్రీ‌వారి సారెను అలిపిరి వ‌ద్ద అద‌న‌పు ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి తిరుప‌తి జెఈవో శ్రీ వీరబ్రహ్మంకు అంద‌జేశారు. అక్కడి నుండి తీసుకొచ్చిన సారెను శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం వ‌ద్ద ఈవో డాక్టర్ కె.ఎస్.జవహర్ రెడ్డికి జెఈవో అందించారు.

5 / 10

వాహన మండపంలో అమ్మవారికి, చక్రత్తాళ్వార్‌కు ఉదయం 10 గంటల నుండి 11.30 గంటల వరకు వేడుకగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, పసుపు, చందనం, కొబ్బరినీళ్లతో విశేషంగా అభిషేకం చేశారు.

వాహన మండపంలో అమ్మవారికి, చక్రత్తాళ్వార్‌కు ఉదయం 10 గంటల నుండి 11.30 గంటల వరకు వేడుకగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, పసుపు, చందనం, కొబ్బరినీళ్లతో విశేషంగా అభిషేకం చేశారు.

6 / 10
కుంకుమ పూవు, యాలకులు, ఆప్రికాట్, గ్రేప్స్, నెమలి ఈకలు, కొబ్బరి ఆకు, రోజా పూలు, తులసి మాలలు, కిరీటాలు ప్రత్యేక ఆక‌ర్షణ‌గా నిలిచాయి.

కుంకుమ పూవు, యాలకులు, ఆప్రికాట్, గ్రేప్స్, నెమలి ఈకలు, కొబ్బరి ఆకు, రోజా పూలు, తులసి మాలలు, కిరీటాలు ప్రత్యేక ఆక‌ర్షణ‌గా నిలిచాయి.

7 / 10
టీటీడీ గార్డెన్ విభాగం ఆధ్వర్యంలో తామరపువ్వులు, ఆపిల్, గ్రీన్ ఆపిల్, ద్రాక్ష, పైనాపిల్, రోజా, సంపంగి, కట్ ఫ్లవర్స్ తో వాహన మండ పాన్ని ప్రత్యేకంగా అలంకరించారు.

టీటీడీ గార్డెన్ విభాగం ఆధ్వర్యంలో తామరపువ్వులు, ఆపిల్, గ్రీన్ ఆపిల్, ద్రాక్ష, పైనాపిల్, రోజా, సంపంగి, కట్ ఫ్లవర్స్ తో వాహన మండ పాన్ని ప్రత్యేకంగా అలంకరించారు.

8 / 10
 రాత్రి బంగారు తిరుచ్చి వాహనంలో అమ్మవారి ఉత్సవర్లను ఆలయంలో  ఊరేగించారు. అనంతరం శాస్త్రోక్తంగా ధ్వజావరోహణం జరిగింది.

రాత్రి బంగారు తిరుచ్చి వాహనంలో అమ్మవారి ఉత్సవర్లను ఆలయంలో ఊరేగించారు. అనంతరం శాస్త్రోక్తంగా ధ్వజావరోహణం జరిగింది.

9 / 10
ఈ కార్యక్రమంలో శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్ స్వామి, టిటిడి ఈవో   శ్రీ కె.ఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి‌ దంపతులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్ స్వామి, టిటిడి ఈవో శ్రీ కె.ఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి‌ దంపతులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

10 / 10
Follow us
చార్ ధామ్ యాత్ర ప్రారంభం.. తెరుచుకున్న యమునోత్రి ఆలయ ద్వారాలు..
చార్ ధామ్ యాత్ర ప్రారంభం.. తెరుచుకున్న యమునోత్రి ఆలయ ద్వారాలు..
తెలంగాణ టెన్త్ 2025 ఫలితాలు మరింత ఆలస్యం! రిజల్ట్స్ ఎన్నింటికంటే
తెలంగాణ టెన్త్ 2025 ఫలితాలు మరింత ఆలస్యం! రిజల్ట్స్ ఎన్నింటికంటే
ఢిల్లీ, కోల్‌కతా టీంలకు షాకింగ్ న్యూస్.. గాయాలతో దూరమైన ఇద్దరు
ఢిల్లీ, కోల్‌కతా టీంలకు షాకింగ్ న్యూస్.. గాయాలతో దూరమైన ఇద్దరు
తిరుపతి వెళ్లేందుకు ప్లాన్‌ చేస్తున్నారా..? మీకో బంపర్‌ న్యూస్‌..
తిరుపతి వెళ్లేందుకు ప్లాన్‌ చేస్తున్నారా..? మీకో బంపర్‌ న్యూస్‌..
జక్కన్న మహాభారతంపై మరోసారి చర్చ.. ఆ హీరో కూడా పక్కా అని క్లారిటీ.
జక్కన్న మహాభారతంపై మరోసారి చర్చ.. ఆ హీరో కూడా పక్కా అని క్లారిటీ.
34 ఏళ్లలో 57 సార్లు బదిలీ.. IAS అశోక్‌ ఖేమ్కా పదవీ విరమణ నేడే
34 ఏళ్లలో 57 సార్లు బదిలీ.. IAS అశోక్‌ ఖేమ్కా పదవీ విరమణ నేడే
ఫోక్సో కేసులో కోర్టు సినిమా స్టైల్ లో వాదోపవాదనలు.. క్లైమాక్స్‌లో
ఫోక్సో కేసులో కోర్టు సినిమా స్టైల్ లో వాదోపవాదనలు.. క్లైమాక్స్‌లో
ఈ ముగ్గురు హీరోయిన్స్ చాలా బిజీ.. చేతిలో ఎన్ని సినిమాలు ఉన్నాయంటే
ఈ ముగ్గురు హీరోయిన్స్ చాలా బిజీ.. చేతిలో ఎన్ని సినిమాలు ఉన్నాయంటే
మొటిమలతో ఇబ్బంది పడుతున్నారా..?
మొటిమలతో ఇబ్బంది పడుతున్నారా..?
Video: లైవ్ మ్యాచ్‌లో రింకూపై కుల్దీప్ షడన్ ఎటాక్.. కట్‌చేస్తే
Video: లైవ్ మ్యాచ్‌లో రింకూపై కుల్దీప్ షడన్ ఎటాక్.. కట్‌చేస్తే