Thumbura Theertham: ప్రకృతి అందాల నడుమ తుంబుర తీర్ధం.. రెండేళ్ల తర్వాత అనుమతి.. భారీగా పోటెత్తిన భక్తులు

Tumburu Theertham: మండు వేసవిలో పరవళ్లు తొక్కే నీటి అందాలు.. ప్రకృతి ప్రసాదించిన సుందర దృశ్యం.. తిరుమలలోని శేషాచల అడవుల్లో తుంబురు తీర్థం. కరోనా కారణంగా రెండేళ్ల తర్వాత టీటీడీ అనుమతివ్వడంతో భక్తులు పోటెత్తారు. స్వామివారిని దర్శించుకుని పులకించిపోయారు.

|

Updated on: Mar 19, 2022 | 3:23 PM

తుంబురు తీర్థం. శేషాచలం కొండల్లోని అద్భుతం శిలా సౌందర్యం ఉట్టిపడే ప్రాంతం. గోన తీర్థంగా పిలిచే ఈ తీర్టం లో తుంబురుడు తప్పస్సు చేసిన  ప్రముఖ తీర్థం. దట్టమైన అటవీప్రాంతంలో తుంబురు కోన కొండ రెండుగా చీలి దారి ఇచ్చినట్లు ప్రకృతి అందాలతో తుంబురు తీర్థం కనువిందు చేస్తోంది. ఏడాదికి ఒకరోజు మాత్రమే టీటీడీ భక్తులను  తీర్థముక్కోటికి అనుమతిసస్తుండటంతో తుంబుర తీర్థం భక్తులతో కిటకిట లాడింది

తుంబురు తీర్థం. శేషాచలం కొండల్లోని అద్భుతం శిలా సౌందర్యం ఉట్టిపడే ప్రాంతం. గోన తీర్థంగా పిలిచే ఈ తీర్టం లో తుంబురుడు తప్పస్సు చేసిన ప్రముఖ తీర్థం. దట్టమైన అటవీప్రాంతంలో తుంబురు కోన కొండ రెండుగా చీలి దారి ఇచ్చినట్లు ప్రకృతి అందాలతో తుంబురు తీర్థం కనువిందు చేస్తోంది. ఏడాదికి ఒకరోజు మాత్రమే టీటీడీ భక్తులను తీర్థముక్కోటికి అనుమతిసస్తుండటంతో తుంబుర తీర్థం భక్తులతో కిటకిట లాడింది

1 / 8
తిరుమల వెంకటేశ్వరుడు కొలువైన శేషాచలం కొండలు ఎన్నో తీర్థాలకు నిలయం. ఎన్నో విశేషాలకు విశిష్టతలకు నిలయాలు ఏడు కొండల్లోని తీర్థాలు. తూర్పు కనుమల్లోని అంతర్భాగంగా ఉన్న శేషాచలం అడవుల్లోని తీర్థాల్లో తుంబుర తీర్థానిదో ప్రత్యేకత. తిరుమలకి ఉత్తరం వైపున ఉంది. పాపవినాశనం నుంచి నాలుగు కిలోమీటర్లు కొండలు, కోనలు, రాళ్లు, రప్పలు దాటి వెళ్లాలి. తిరుమల నుంచి  పాపవినాశనం వరకు బస్సుల్లో ప్రయాణం చేసేందుకు ఆవకాశం ఉంది. పాపవినాశనం నుంచి  కొండల మధ్య నడక ప్రయాణం చేయాల్సిన భక్తులు ప్ర‌తి ఏడాది ఫాల్గుణ మాసంలో ఉత్తర ఫల్గుణి నక్షత్రంతో కూడిన పౌర్ణమిరోజన మాత్రమే తీర్థ ముక్కోటి దర్శనానికి అనుమతి ఉంటోంది. రెండుగా చీలిన కొండ తుంబురు తీర్థానికి దారిని ఇస్తుండగా మధ్యలో ప్రవహించే జలపాతం భక్తులను పరవశింప చేస్తోంది.

తిరుమల వెంకటేశ్వరుడు కొలువైన శేషాచలం కొండలు ఎన్నో తీర్థాలకు నిలయం. ఎన్నో విశేషాలకు విశిష్టతలకు నిలయాలు ఏడు కొండల్లోని తీర్థాలు. తూర్పు కనుమల్లోని అంతర్భాగంగా ఉన్న శేషాచలం అడవుల్లోని తీర్థాల్లో తుంబుర తీర్థానిదో ప్రత్యేకత. తిరుమలకి ఉత్తరం వైపున ఉంది. పాపవినాశనం నుంచి నాలుగు కిలోమీటర్లు కొండలు, కోనలు, రాళ్లు, రప్పలు దాటి వెళ్లాలి. తిరుమల నుంచి పాపవినాశనం వరకు బస్సుల్లో ప్రయాణం చేసేందుకు ఆవకాశం ఉంది. పాపవినాశనం నుంచి కొండల మధ్య నడక ప్రయాణం చేయాల్సిన భక్తులు ప్ర‌తి ఏడాది ఫాల్గుణ మాసంలో ఉత్తర ఫల్గుణి నక్షత్రంతో కూడిన పౌర్ణమిరోజన మాత్రమే తీర్థ ముక్కోటి దర్శనానికి అనుమతి ఉంటోంది. రెండుగా చీలిన కొండ తుంబురు తీర్థానికి దారిని ఇస్తుండగా మధ్యలో ప్రవహించే జలపాతం భక్తులను పరవశింప చేస్తోంది.

2 / 8
నారదుడు స్వామివారిపై అనర్గళంగా గీతాలు పాడడంతో తుంబురుడు వెనక్కి తగ్గి ఆ తీర్థంలోనే కూర్చుండి పోతారు. అప్పుడు వేంకటేశ్వర స్వామి అక్కడికి వెళ్లి తుంబురుడిని బుజ్జగిస్తారు. దీంతో ఆ తీర్థానికి తుంబురు తీర్థం అనే పేరు వచ్చింది. మరోవైపు తరిగొండ వెంగమాంబకు తుంబురు తీర్థంలో స్వామివారు సాక్షాత్కరించారని ప్రసిద్ధి.

నారదుడు స్వామివారిపై అనర్గళంగా గీతాలు పాడడంతో తుంబురుడు వెనక్కి తగ్గి ఆ తీర్థంలోనే కూర్చుండి పోతారు. అప్పుడు వేంకటేశ్వర స్వామి అక్కడికి వెళ్లి తుంబురుడిని బుజ్జగిస్తారు. దీంతో ఆ తీర్థానికి తుంబురు తీర్థం అనే పేరు వచ్చింది. మరోవైపు తరిగొండ వెంగమాంబకు తుంబురు తీర్థంలో స్వామివారు సాక్షాత్కరించారని ప్రసిద్ధి.

3 / 8
క్రూర మృగాలు, అరుదైన వన్యప్రాణులు, జంతువులు సంచరించే తుంబురు తీర్థానికి నిన్న భక్తులను నిన్న టీటీడీ అనుమతించింది. నిన్న ఉదయం 6 నుంచి సాయంత్రం 4 గంట‌ల వ‌ర‌కు తిరిగి ఈరోజు ఉద‌యం 6 నుండి ఉద‌యం 10 గంట‌ల వరకు మాత్రమే భ‌క్తుల‌ను అనుమ‌తించడంతో వేలాది మంది భక్తులు తుంబురు తీర్థానికి చేరుకుని మొక్కులు తీర్చుకున్నారు.

క్రూర మృగాలు, అరుదైన వన్యప్రాణులు, జంతువులు సంచరించే తుంబురు తీర్థానికి నిన్న భక్తులను నిన్న టీటీడీ అనుమతించింది. నిన్న ఉదయం 6 నుంచి సాయంత్రం 4 గంట‌ల వ‌ర‌కు తిరిగి ఈరోజు ఉద‌యం 6 నుండి ఉద‌యం 10 గంట‌ల వరకు మాత్రమే భ‌క్తుల‌ను అనుమ‌తించడంతో వేలాది మంది భక్తులు తుంబురు తీర్థానికి చేరుకుని మొక్కులు తీర్చుకున్నారు.

4 / 8
తిరుమల గిరుల్లో ఉన్న  108 తీర్థాల్లో ప్రతి పౌర్ణమికి ఒక్కో తీర్థంలో ప్రత్యేక పూజలు చేస్తున్న టీటీడీ ప్రధానంగా సప్త తీర్థాలకు భక్తులను అనుమతిస్తోంది. తీర్థాలు ధర్మ, జ్ఞాన, భక్తి, వైరాగ్య, ముక్తిని కలిగించేవిగా భావించే భక్తులు ఆయా తీర్థాలను సందర్శిస్తే సర్వపాపాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం.

తిరుమల గిరుల్లో ఉన్న 108 తీర్థాల్లో ప్రతి పౌర్ణమికి ఒక్కో తీర్థంలో ప్రత్యేక పూజలు చేస్తున్న టీటీడీ ప్రధానంగా సప్త తీర్థాలకు భక్తులను అనుమతిస్తోంది. తీర్థాలు ధర్మ, జ్ఞాన, భక్తి, వైరాగ్య, ముక్తిని కలిగించేవిగా భావించే భక్తులు ఆయా తీర్థాలను సందర్శిస్తే సర్వపాపాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం.

5 / 8
పాల్గుణ మాసం ఉత్తర ఫల్గుణీ నక్షత్రముతో కూడిన పౌర్ణమినాడు తుంబురు తీర్థ ముక్కోటి నిర్వహించడం టీటీడీ ఆనవాయితీగా నిర్వహిస్తోంది. ప్రకృతి అందాల మధ్య అద్భుత శిలా సౌదర్యం దాగివున్న తుంబురు తీర్థం లో స్నానమాచరించి తుంబురుడిని దర్శించి మొక్కులు తీర్చుకునే  భక్తుల్లో ఏటా మరువురాని అనుభూతి పొందుతున్నారు.

పాల్గుణ మాసం ఉత్తర ఫల్గుణీ నక్షత్రముతో కూడిన పౌర్ణమినాడు తుంబురు తీర్థ ముక్కోటి నిర్వహించడం టీటీడీ ఆనవాయితీగా నిర్వహిస్తోంది. ప్రకృతి అందాల మధ్య అద్భుత శిలా సౌదర్యం దాగివున్న తుంబురు తీర్థం లో స్నానమాచరించి తుంబురుడిని దర్శించి మొక్కులు తీర్చుకునే భక్తుల్లో ఏటా మరువురాని అనుభూతి పొందుతున్నారు.

6 / 8
ఏడాదికో రోజు  తుంబుర తీర్థం ను సందర్శించే భక్తుల కోసం టిటిడి విస్తృత ఏర్పాట్లు చేస్తూ వస్తోంది. కోవిడ్ తో రెండేళ్లపాటు తుంబురు తీర్థానికి భక్తులను అనుమతించని టీటీడీ ఏడాదిగా తుంబుర తీర్థంకు భక్తులను అనుమతించిన టీటీడీ తుంబుర తీర్థంతో పాటు సప్తగిరిరుల్లోని  కుమారధార, ఆకాశ గంగ, రామకృష్ణ తీర్థం, పాపవినాశనం, పాండవ తీర్తాలు ప్రముఖ తీర్థాలుకాగా శేష తీర్థం, దేవతీర్థం, యుద్ధగళ తీర్థం, తాంత్రిక తీర్థం, వైకుంఠ తీర్థం, అస్థితీర్థం, విశ్వక్సేన తీర్థం, గరుడ తీర్థం, సీతమ్మ తీర్థం, నాగ తీర్థం, మార్కండేయ తీర్థాలు ఇలా 108 తీర్థాలు తిరుమల గిరుల్లో ఉన్నాయి. అయితే తుంబురు తీర్థంలో స్నానమాచరిస్తే మోక్షం కలుగుతుందని స్థల పురాణం చెబుతోంది

ఏడాదికో రోజు తుంబుర తీర్థం ను సందర్శించే భక్తుల కోసం టిటిడి విస్తృత ఏర్పాట్లు చేస్తూ వస్తోంది. కోవిడ్ తో రెండేళ్లపాటు తుంబురు తీర్థానికి భక్తులను అనుమతించని టీటీడీ ఏడాదిగా తుంబుర తీర్థంకు భక్తులను అనుమతించిన టీటీడీ తుంబుర తీర్థంతో పాటు సప్తగిరిరుల్లోని కుమారధార, ఆకాశ గంగ, రామకృష్ణ తీర్థం, పాపవినాశనం, పాండవ తీర్తాలు ప్రముఖ తీర్థాలుకాగా శేష తీర్థం, దేవతీర్థం, యుద్ధగళ తీర్థం, తాంత్రిక తీర్థం, వైకుంఠ తీర్థం, అస్థితీర్థం, విశ్వక్సేన తీర్థం, గరుడ తీర్థం, సీతమ్మ తీర్థం, నాగ తీర్థం, మార్కండేయ తీర్థాలు ఇలా 108 తీర్థాలు తిరుమల గిరుల్లో ఉన్నాయి. అయితే తుంబురు తీర్థంలో స్నానమాచరిస్తే మోక్షం కలుగుతుందని స్థల పురాణం చెబుతోంది

7 / 8
ప్రకృతి అందాల మధ్య.. అద్భుత శిలా సౌందర్యం దాగివున్న తీర్థంలో స్నానమాచరించి తుంబురుడిని దర్శించుకున్నారు. వీటిలో సప్త తీర్థాల్లో మాత్రమే ప్రతి పౌర్ణమికి ఒక్కో తీర్థంలో ప్రత్యేక పూజలు చేసి భక్తులను అనుమతిస్తోంది టీటీడీ.

ప్రకృతి అందాల మధ్య.. అద్భుత శిలా సౌందర్యం దాగివున్న తీర్థంలో స్నానమాచరించి తుంబురుడిని దర్శించుకున్నారు. వీటిలో సప్త తీర్థాల్లో మాత్రమే ప్రతి పౌర్ణమికి ఒక్కో తీర్థంలో ప్రత్యేక పూజలు చేసి భక్తులను అనుమతిస్తోంది టీటీడీ.

8 / 8
Follow us
Latest Articles
ప్రయాణంలో వికారమా.. ఈ స్మార్ట్ ఫీచర్‌తో సమస్యకు పరిష్కారం..
ప్రయాణంలో వికారమా.. ఈ స్మార్ట్ ఫీచర్‌తో సమస్యకు పరిష్కారం..
నాన్‌స్టిక్ పాత్రల్లో వంట ఈజీనే.. ఆరోగ్యానికే ప్రమాదం
నాన్‌స్టిక్ పాత్రల్లో వంట ఈజీనే.. ఆరోగ్యానికే ప్రమాదం
మన ప్రొడక్షన్‌ హౌస్‌లకు తమిళ తంబిల కాల్షీట్‌.. వారు ఎవరంటే.?
మన ప్రొడక్షన్‌ హౌస్‌లకు తమిళ తంబిల కాల్షీట్‌.. వారు ఎవరంటే.?
సాంప్రదాయినీ సుప్పినీ సుద్దపూసనీ..!
సాంప్రదాయినీ సుప్పినీ సుద్దపూసనీ..!
పిక్చర్‌ ఆఫ్‌ది డే..! ఆనంద్‌ మహీంద్రా షేర్‌ చేసిన ఫోటోకు నెటిజన్ల
పిక్చర్‌ ఆఫ్‌ది డే..! ఆనంద్‌ మహీంద్రా షేర్‌ చేసిన ఫోటోకు నెటిజన్ల
అమ్మాయిలూ ఇది మీకు తెలుసా.! మగవారి గురించి 10 సీక్రెట్స్ ఇవే..
అమ్మాయిలూ ఇది మీకు తెలుసా.! మగవారి గురించి 10 సీక్రెట్స్ ఇవే..
డయాబెటిక్ పేషెంట్లకు అలర్ట్.. కొబ్బరి నీళ్లు తాగొచ్చా..? లేదా..?
డయాబెటిక్ పేషెంట్లకు అలర్ట్.. కొబ్బరి నీళ్లు తాగొచ్చా..? లేదా..?
'ఓవర్ ఛార్జింగ్' వల్ల ఫోన్ పేలిపోతుందా? ఈ తప్పులు చేయకండి..!
'ఓవర్ ఛార్జింగ్' వల్ల ఫోన్ పేలిపోతుందా? ఈ తప్పులు చేయకండి..!
రైలు జనరల్‌ టికెట్లు ఇంటి నుంచే బుక్‌ చేసుకోవచ్చు. అదెలా?
రైలు జనరల్‌ టికెట్లు ఇంటి నుంచే బుక్‌ చేసుకోవచ్చు. అదెలా?
చార్‌ధామ్ యాత్ర భక్తులకు అలెర్ట్ మే 31వరకు రిజిస్ట్రేషన్ నిలుపుదల
చార్‌ధామ్ యాత్ర భక్తులకు అలెర్ట్ మే 31వరకు రిజిస్ట్రేషన్ నిలుపుదల