- Telugu News Photo Gallery Spiritual photos Navratri 2022: visit these famous temples of goddess durga during dussehra festival 2022
Navratri 2022: నవరాత్రుల్లో దుర్గ దేవి అమ్మవారి అనుగ్రహం కోసం ఈ ఆలయాల సందర్శనం బెస్ట్ ఎంపిక
దేశంలో అనేక ప్రసిద్ధ దుర్గాదేవి ఆలయాలు ఉన్నాయి. మీరు నవరాత్రి సమయంలో ఈ ఆలయాలను సందర్శించడానికి కూడా ప్లాన్ చేసుకోవచ్చు. ఈ ఆలయాలను సందర్శించిన భక్తుల కోరిన కోర్కెలను దుర్గాదేవి తీరుస్తుందని నమ్మకం.
Updated on: Sep 19, 2022 | 5:33 PM

ఈ ఏడాది దసరా నవరాత్రులు సెప్టెంబర్ 26 నుంచి ప్రారంభమవుతున్నాయి. ఈ సమయంలో అమ్మవారిని భక్తులు దుర్గా దేవి రూపాలను పూజిస్తారు. చాలా మంది నవరాత్రుల్లో అమ్మవారి ఆలయాలను సందర్శించడానికి ఆసక్తిని చూపిస్తారు. నవరాత్రుల్లో ఏ ఏ ఆలయాలను సందర్శించ వచ్చునో తెలుసుకుందాం.

వైష్ణో దేవి ఆలయం, కత్రా: వైష్ణో దేవి ఆలయం దేశంలోని అత్యంత ప్రసిద్ధ దేవాలయాలలో ఒకటి. వైష్ణో దేవిని దర్శించుకోవడానికి ప్రతి సంవత్సరం భారీ సంఖ్యలో ప్రజలు ఇక్కడికి వస్తుంటారు. ఇక్కడ అమ్మవారు గుహల లోపల రాళ్ల రూపంలో ఇక్కడ కొలువై ఉంటుంది.

కామాఖ్య ఆలయం, గౌహతి: ఈ ఆలయం గావతిలోని నీలాచల్ కొండలపై ఉంది. ఇక్కడ నవరాత్రి ఉత్సవాలు చాలా ఘనంగా జరుగుతాయి. దేశంలోని పురాతన దేవాలయాలలో ఇది ఒకటి. అంబుబాచి జాతర ప్రసిద్ధిగాంచింది.

నైనా దేవి ఆలయం: ఈ ఆలయం హిమాచల్ ప్రదేశ్లోని బిలాస్పూర్లో ఉంది. మీరు నవరాత్రి సమయంలో ఈ ఆలయాన్ని సందర్శించవచ్చు. సతీదేవి కన్నులు పడిన ప్రదేశం ఇదేనని ప్రతీతి. ఈ ఆలయాన్ని సందర్శించేందుకు ప్రపంచం నలుమూలల నుంచి ప్రజలు వస్తుంటారు.

మానస దేవి ఆలయం : ఈ ఆలయం ఉత్తరాఖండ్లో ఉంది. ఇక్కడ అమ్మవారిని దర్శించుకోవడానికి సుదూర ప్రాంతాల నుంచి భక్తులు చేరుకుంటారు. ఈ ఆలయంలో అమ్మవారిని దర్శించుకోవడం ద్వారా కోరిన కోరికలు నెరవేరుతాయని ప్రతీతి. నవరాత్రులను ఇక్కడ ఘనంగా నిర్వహిస్తారు.




