- Telugu News Photo Gallery Spiritual photos Lord ganesh idol made from 7 kg soybean grains cost only 900 rupees washim tsts national news
Soybean Ganesh Idol: గణపతి మండపంలో కొలువుదీరిన సోయాబీన్ గణేశుడు.. కేవలం రూ. 1000 లతో తయారీ.. ఎక్కడంటే..
Soybean Ganesh Idol: దేశవ్యాప్తంగా వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలను కరోనా నిబంధనలు పాటిస్తూ. ఘనంగా జరుపుకుంటున్నారు. అయితే చవితికి పూజించే గణపతి విగ్రహాలను విభిన్న రూపాయలతోనే కాదు.. చాకోలెట్స్ , డ్రైఫ్రూట్స్, డబ్బులు, వ్యాక్సిన్ వినాయకుడు వంటి అనేక రకాల గణపతిలను మండపాల్లో ప్రతిష్టించి పూజిస్తున్నారు. తాజాగా మహారాష్ట్రలో సోయాబీన్స్ తో తయారు చేసిన గణపతి అందరి దృష్టిని ఆకర్షించింది.
Updated on: Sep 11, 2021 | 5:07 PM

మహారాష్ట్రలో గణపతి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. వాషిమ్ జిల్లాలోని కమర్గావ్లో జై భవాని-జై శివాజీ పబ్లిక్ గణేష్ మండల్ వారు ఈ గణేష్ విగ్రహాన్ని స్థాపించారు. అయితే ఈ విగ్రకహం థర్మోకాల్తో లేదా ప్లాస్ట్ ఆప్ పారిస్ తోగానీ తయారు చేయలేదు. సోయాబీన్ ధాన్యాన్ని ఉపయోగించి గణపతి విగ్రహాన్ని తయారు చేసి.. మండపంలో ప్రతిష్టించారు.

ఈ విగ్రహాన్ని 16 రోజుల్లో తయారు చేశారు. దీనికి 7 కిలోల సోయాబీన్ గింజలు పట్టాయి. గ్రామంలోని ఏడుగురు రైతులు వారి ఇంటి నుండి ఒకొక్క ఇంటి నుంచి ఒకొక్క కిలో సోయాబీన్ విత్తనాలు సేకరించి.. ఈ విగ్రహాన్ని తయారు చేశారు.

పర్యావరణానికి హాని చేయని ఈ విగ్రహం తయారీకి ఖర్చు కూడా తక్కువే అయ్యిందని రైతులు తెలిపారు. 400 రూపాయల సోయాబీన్, 100 రూపాయల ఫెవికోల్ , ఇతర వస్తవులు అన్నీ కలిపి విగ్రహం తయారీకి దాదాపు రూ. 1000లు అయ్యాయని రైతు తెలిపారు.

ఈ విగ్రహం బరువు 30 నుండి 35 కిలోలు మాత్రమే అని డివిజన్ అధికారులు చెప్పారు. కేవలం 1 వేల రూపాయలతో చేసిన ఈ విగ్రహం చాలా ఆకర్షణీయంగా కనిపిస్తూ భక్తులకు కనువిందు చేస్తోంది.





























