శ్రీ క్షీరారామలింగేశ్వరునికి తలపాగా ఎలా తయారు చేస్తారో తెలుసా?
ఏలూరు: మహా శివరాత్రి సమీపిస్తుంది. ఈ సందర్భంగా పంచారామ క్షేత్రమైన పాలకొల్లు క్షీరారామలింగేశ్వరుని ఆలయంలో స్వామివారికి మల్లన్న పాగా ఏర్పాటు చేస్తారు. కార్తికమాసంలోనే పాగా నేసె కార్యక్రమం ప్రతి ఏటా మొదలవుతుంది . అయితే ఈ ఆచారం ఎపుడు మొదలైంది ..మల్లన్న పాగా విసిస్టత ఏంటో తెలుసుకుంటే ఆశ్చర్యమేస్తుంది. మహా శివరాత్రి రోజు అర్ధరాత్రి లింగోద్భవం సమయంలో పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు లో పంచారామ క్షేత్రం శ్రీ క్షీరా రామలింగేశ్వరస్వామి ఆలయంలో స్వామివారికి మల్లన్న పాగా కడతారు. ఈ పాగాను శ్రీశైలం శ్రీ భ్రమరాంబికా మల్లికార్జునస్వామి ఆలయంలోను , పంచారా క్షేత్రాల్లో ఒకటైన శ్రీ క్షీరా రామలింగేశ్వరస్వామి వారికి మాత్రమే మహా శివ రాత్రి పర్వదినం నాడు లింగోద్భవం సమయంలో మల్లన్న పాగాను సమర్పిస్తారు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5