సింధూర్ నుండి బాలాకోట్ వరకు.. భారత్ సత్తాను నిరూపించిన అతి కీలక ఆపరేషన్స్ ఇవే..
ఆపరేషన్ సింధూర్ తర్వాత ఇది సరికొత్త ఆధునిక భారతదేశం అని మనదేశం మరోసారి నిరూపించింది. ఇప్పుడు దాడి జరిగితే సమాధానం నేరుగా, ఖచ్చితంగా ఉంటుందని ప్రపంచం ముందు నిరూపించింది. గత కొన్ని సంవత్సరాలలో భారతదేశం జరిపిన అతి ముఖ్యమైన ఆపరేషన్లను నిర్వహించింది. దీంతో భారతదేశం ఏం చేయగలదో శుత్రుదేశాలకు చూపించింది. భారత ఆర్మీ చరిత్రలో జరిగిన అతి ముఖ్యమైన ఐదు ఆపరేషన్లను ఓ సారి పరిశీలించనట్టయితే..
Updated on: May 07, 2025 | 1:40 PM

Operation Sindoor (2025): ఆపరేషన్ సింధూర్ అంటే శత్రువు మూలాలపై ప్రత్యక్ష దాడి. భారత సైన్యం ఒకేసారి పాకిస్తాన్, పీఓకేలోని 9 జైష్, లష్కర్ రహస్య స్థావరాలను ధ్వంసం చేసింది. అర్ధరాత్రి తర్వాత భారత వైమానిక దళం పాకిస్తాన్, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లలో వైమానిక దాడులు నిర్వహించింది. ఇందులో 7 నగరాల్లోని 9 ఉగ్రవాద స్థావరాల నుండి 100 మందికి పైగా ఉగ్రవాదులు హతమయ్యారు. పహల్గామ్ ఉగ్రవాద దాడి జరిగిన 15 రోజుల తర్వాత భారతదేశం చేసిన ఈ ప్రతీకార చర్య పాక్ను షాక్కు గురిచేసింది.. ఈ ఆపరేషన్ 2025 ఏప్రిల్ 22న పహల్గామ్లో ఉగ్రవాదుల చేతిలో భర్తలను కోల్పోయిన మహిళలకు అంకితం చేయబడింది.

2019 Balakot Air Strikes: బాలాకోట్ వైమానిక దాడి పాకిస్తాన్ కు గట్టి ఎదురుదెబ్బ. పుల్వామా దాడి జరిగిన 12 రోజుల తర్వాత, భారతదేశం పాకిస్తాన్ వైమానిక దళం (PAF) ముక్కు కింద ఉన్న బాలకోట్లోని జైష్-ఎ-మొహమ్మద్ ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసింది. ఇప్పుడు కళ్ళు ఎత్తడానికి ఎంత ధర ఉంటుందో అప్పుడు మిరాజ్ 2000 జెట్లు స్పష్టం చేశాయి.

2016 surgical strikes: 2016 సంవత్సరంలో భారతదేశం మొదటిసారిగా పాకిస్తాన్ సరిహద్దును దాటి దాడి చేసింది. ఉరీ దాడికి ప్రతిస్పందనగా, భారత సైన్యం ఎల్ఓసిని దాటి ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసింది. ఇది ఒక కోడ్ నేమ్ కాదు, కానీ మేము ఇకపై మౌనంగా కూర్చోబోమని బహిరంగంగానే గట్టి హెచ్చరిక చేసింది.

Operation Vijay (1999 Kargil conflict): ఆపరేషన్ విజయ్ ఇప్పటికీ అందరి మనసులలో గుర్తుండిపోయింది. భారత సైన్యం పాకిస్తాన్ను ఘోరంగా ఓడించినప్పుడు 1999లో, పాకిస్తాన్ సైన్యం కార్గిల్ కొండలపైకి చొరబడింది. దీనికి ప్రతిస్పందనగా భారతదేశం ఆపరేషన్ విజయ్ను ప్రారంభించింది. దాదాపు రెండు నెలల పోరాటం తర్వాత, భారతదేశం చేజార్చుకున్న అన్ని ప్రాంతాలను తిరిగి స్వాధీనం చేసుకుంది. ఈ ఆపరేషన్ భారత సైన్యం ధైర్యం, వ్యూహానికి ఒక గొప్ప ఉదాహరణగా నిలిచింది.

Operation Meghdoot 1984 (Siachen conflict): ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన యుద్ధభూమి అయిన సియాచిన్లోకి అడుగుపెట్టి దానిని స్వాధీనం చేసుకున్న మొదటి దేశం భారతదేశం. ఈ ఆపరేషన్ భారతదేశ వ్యూహం, ధైర్యానికి ఒక చిహ్నం. ఇది నేటికీ ఉంది. ఆపరేషన్ మేఘదూత్ అనేది సియాచిన్ హిమానీనదంపై నియంత్రణ సాధించడానికి భారత సైన్యం 1984 ఏప్రిల్ 13న ప్రారంభించిన సైనిక చర్య. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన యుద్ధభూమిపై జరిగిన మొదటి దాడి ఇది. దీనిలో భారత సైన్యం హిమానీనద శిఖరాలను స్వాధీనం చేసుకుని పాకిస్తానీయులకు మన బలం ఏమిటో చూపించింది.





























