1/5

రేపు రక్షా బంధన్ పవిత్ర పర్వదినాన్ని పురస్కరించుకుని వైసీపీ ఎమ్మెల్యే విడదల రజని సీఎం జగన్ కు ముందుగానే రాఖీ కట్టారు.
2/5

సీఎం క్యాంపు కార్యాలయానికి విచ్చేసిన రజని తాను సోదరుడిగా భావించే జగన్ కు రాఖీ కట్టి మురిసిపోయారు.
3/5

ఈ సందర్భంగా ఆయన విడదల రజనిని ఆశీర్వదించారు. కాగా, విజయవాడ నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి కూడా ముఖ్యమంత్రికి రాఖీ కట్టారు.
4/5

సీఎం జగన్ ఇవాళ విజయవాడలో ఐఏఎస్ అధికారులు కె.ప్రవీణ్ కుమార్, సునీత దంపతుల కుమారుడు పృథ్వి వివాహ రిసెప్షన్ కు హాజరయ్యారు.
5/5

ఈ కార్యక్రమానికి వచ్చిన సీఎం జగన్ నూతన వధూవరులకు ఆశీస్సులు అందజేశారు.