PM Modi In Uttarakhand: పార్వతీ కుండ్ వద్ద పరమశివుడికి ప్రత్యేక పూజలు.. ఆది కైలాశ్ పర్వతాన్ని దర్శించుకున్న తొలి ప్రధాని మోదీ..
ప్రధాని నరేంద్ర మోదీ ఒకరోజు పర్యటన నిమిత్తం గురువారం ఉత్తరాఖండ్ చేరుకున్నారు. పితౌరాగఢ్ జిల్లాలోని పార్వతీ కుండ్ దగ్గర పరమశివుడి దేవాలయాన్ని ప్రధాని సందర్శించారు. స్థానిక సంప్రదాయ దుస్తుల్లో మోదీ అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఢమరుకం, శంఖానాదాలతో పరమేశ్వరుడిని అర్చించారు. అనంతరం పరమశివుడు కొలువైన ఆది కైలాశ్ పర్వతాన్ని ప్రధాని మోదీ సందర్శించారు. జగదేశ్వర్ ధామ్, సరిహద్దున ఉన్న గుంజీ గ్రామానికి కూడా వెళ్లారు.
Most Read Stories