- Telugu News Photo Gallery Political photos PM Modi Ditches Mic while Addressing Crowd at Abu Road to Avoid Using Loudspeaker
PM Narendra Modi: భారీ సభలో మైక్ లేకుండానే మాట్లాడిన ప్రధాని మోదీ.. ఎందుకంటే?
రెండవ రోజు ప్రయాణంలో గాంధీనగర్ నుంచి అహ్మదాబాద్, కలుపూర్ నుంచి అహ్మదాబాద్లోని థాల్తేజ్ మెట్రో స్టేషన్ వరకు వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలులో ప్రధాని ప్రయాణించారు.
Updated on: Oct 01, 2022 | 7:02 AM

రెండు రోజుల పాటు తన సొంత రాష్ట్రం గుజరాత్లో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అనేక ప్రాజెక్టులను కూడా ప్రధాని ప్రారంభించారు.

ఈ క్రమంలో ప్రధాన మంత్రి ఒక సభలో ప్రసంగించారు. అక్కడ మైక్ లేకుండానే పెద్ద సంఖ్యలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.

ప్రధాని మోదీ అంతకుముందు బనస్కాంత జిల్లాలోని అంబాజీ ఆలయాన్ని సందర్శించి అమ్మవారికి 'హారతి' నిర్వహించారు.

అంతకుముందు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సాధారణ ప్రజలకు ఉచిత రేషన్ పథకాన్ని పొడిగించారు. దీని వల్ల 80 కోట్ల మందికి పైగా ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుందని ఆయన తెలిపారు.

ప్రధాని తన గుజరాత్ పర్యటన సందర్భంగా అంబాజీలో రూ.7,200 కోట్ల విలువైన ప్రాజెక్టును ప్రకటించారు. ఈ కార్యక్రమానికి వేలాది మంది ప్రజలు హాజరయ్యారు.

గాంధీనగర్-ముంబై వందే భారత్ ఎక్స్ప్రెస్ సెమీ-హై స్పీడ్ రైలును ప్రధాని మోదీ మొదట జెండా ఊపి, అహ్మదాబాద్ మెట్రో రైలు మొదటి దశను ప్రారంభించారు.

రెండవ రోజు ప్రయాణంలో గాంధీనగర్ నుంచి అహ్మదాబాద్, కలుపూర్ నుంచి అహ్మదాబాద్లోని థాల్తేజ్ మెట్రో స్టేషన్ వరకు వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలులో ప్రధాని ప్రయాణించారు.




