AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Modi: భారత రైల్వే చరిత్రలో సరికొత్త అధ్యాయం.. ఒకేసారి 508 స్టేషన్ల ఆధునీకరణకు ప్రధాని శంకుస్థాపన

భారతీయ రైల్వే ముఖ చిత్రం మార్చేలా కేంద్ర ప్రభుత్వం రైల్వే స్టేషన్ల పునరుద్ధరణ పనులకు శ్రీకారం చుట్టింది. అమృత్‌ భారత్ స్టేషన్‌ పథకంలో భాగంగా దేశంలో పలు రైల్వే స్టేషన్ల సుందరీకరణ పనులు చేపట్టనున్నారు. ఇందులో భాగంగానే ప్రధాని నరేంద్ర మోదీ దేశవ్యాప్తంగా 508 రైల్వే స్టేషన్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ఆగస్టు 6వ తేదీన ప్రధాని వర్చువల్ విధానంలో శంకుస్థాపన చేయనున్నారు. కేంద్ర ప్రభుత్వం ఈ పథకం కోసం ఏకంగా రూ. 24,470 కోట్లు ఖర్చు చేయనుంది. ఏయే రాష్ట్రాల్లో ఈ పనులు చేపట్టనున్నారు.? తెలుగు రాష్ట్రాల్లో ఎన్ని స్టేషన్స్‌ ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

Narender Vaitla
|

Updated on: Aug 04, 2023 | 3:39 PM

Share
 అమృత్‌ భారత్‌ స్టేషన్‌ పథకంలో భాగంగా 508 రైల్వే స్టేషన్స్‌ను పునరుద్ధరించనున్నారు. వీటిలో రాజస్థాన్‌, ఉత్తరప్రదేశ్‌లో 55 రైల్వే స్టేషన్లు ఉన్నాయి. అలాగే మధ్యప్రదేశ్‌లో 34, తెలంగాణలో 21, బిహార్‌లో 49, మహారాష్ట్రలో 44 రైల్వే స్టేషన్స్‌కు శంకుస్థాపన చేయనున్నరు. వీటితో పాటు మరికొన్ని రాష్ట్రాల్లో రైల్వే స్టేషన్స్‌కు ప్రధాని శంకుస్థాపన చేయనున్నారు.

అమృత్‌ భారత్‌ స్టేషన్‌ పథకంలో భాగంగా 508 రైల్వే స్టేషన్స్‌ను పునరుద్ధరించనున్నారు. వీటిలో రాజస్థాన్‌, ఉత్తరప్రదేశ్‌లో 55 రైల్వే స్టేషన్లు ఉన్నాయి. అలాగే మధ్యప్రదేశ్‌లో 34, తెలంగాణలో 21, బిహార్‌లో 49, మహారాష్ట్రలో 44 రైల్వే స్టేషన్స్‌కు శంకుస్థాపన చేయనున్నరు. వీటితో పాటు మరికొన్ని రాష్ట్రాల్లో రైల్వే స్టేషన్స్‌కు ప్రధాని శంకుస్థాపన చేయనున్నారు.

1 / 9
 ప్రధాని నరేంద్ర మోదీ ఆగస్టు 6వ తేదీన, ఉదయం 11 గంటలకు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా దేశవ్యాప్తంగా 508 రైల్వే స్టేషన్ల పునరుద్ధరణకు శంకుస్థాప చేస్తారు. రైల్వేలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపిన ప్రధాని, ఇందులో భాగంగానే రైల్వే స్టేషన్స్‌లో ప్రపంచ స్థాయి సౌకర్యాలను కల్పించే దిశగా అడుగులు వేస్తున్నట్లు గతంలో చాలా సార్లు తెలిపారు.

ప్రధాని నరేంద్ర మోదీ ఆగస్టు 6వ తేదీన, ఉదయం 11 గంటలకు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా దేశవ్యాప్తంగా 508 రైల్వే స్టేషన్ల పునరుద్ధరణకు శంకుస్థాప చేస్తారు. రైల్వేలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపిన ప్రధాని, ఇందులో భాగంగానే రైల్వే స్టేషన్స్‌లో ప్రపంచ స్థాయి సౌకర్యాలను కల్పించే దిశగా అడుగులు వేస్తున్నట్లు గతంలో చాలా సార్లు తెలిపారు.

2 / 9
 ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం రూ. 24,470 కోట్లను ఖర్చు చేయనున్నారు. ఇందులో భాగంగా రైల్వే స్టేషన్స్‌ను 'సిటీ సెంటర్స్‌'గా అభివృద్ధి చేయనున్నారు.

ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం రూ. 24,470 కోట్లను ఖర్చు చేయనున్నారు. ఇందులో భాగంగా రైల్వే స్టేషన్స్‌ను 'సిటీ సెంటర్స్‌'గా అభివృద్ధి చేయనున్నారు.

3 / 9
 రైల్వే స్టేషన్స్‌ను ఆధునీకరించడంలో భాగంగా ఇంటర్‌ మోడల్ ఇంటిగ్రేషన్‌, ట్రాఫిక్‌ సర్క్యూలేషన్‌ వంటి పనులు చేపట్టనున్నారు. అలాగే రైల్వే స్టేషన్స్‌ భవనాల రూపకల్పనలో స్థానిక సంస్కృతి, వారసత్వం, వాస్తు శిల్పం ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు.

రైల్వే స్టేషన్స్‌ను ఆధునీకరించడంలో భాగంగా ఇంటర్‌ మోడల్ ఇంటిగ్రేషన్‌, ట్రాఫిక్‌ సర్క్యూలేషన్‌ వంటి పనులు చేపట్టనున్నారు. అలాగే రైల్వే స్టేషన్స్‌ భవనాల రూపకల్పనలో స్థానిక సంస్కృతి, వారసత్వం, వాస్తు శిల్పం ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు.

4 / 9
ఖజుహో జంక్షన్‌, రైల్వే స్టేషన్‌ పునరుద్ధరణకు రూ. 260 కోట్లు ఖర్చు చేయనున్నారు. అలాగే రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌ రైల్వే స్టేషన్‌కు రూ. 494 కోట్లు, హైదరాబాద్‌ రైల్వే స్టేషన్‌కు రూ. 309 కోట్లు, ఉత్తర ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌ జంక్షన్‌ అభివృద్ధికి ఏకంగా రూ. 960 కోట్లు ఖర్చు చేయనున్నారు.

ఖజుహో జంక్షన్‌, రైల్వే స్టేషన్‌ పునరుద్ధరణకు రూ. 260 కోట్లు ఖర్చు చేయనున్నారు. అలాగే రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌ రైల్వే స్టేషన్‌కు రూ. 494 కోట్లు, హైదరాబాద్‌ రైల్వే స్టేషన్‌కు రూ. 309 కోట్లు, ఉత్తర ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌ జంక్షన్‌ అభివృద్ధికి ఏకంగా రూ. 960 కోట్లు ఖర్చు చేయనున్నారు.

5 / 9
ఆగస్టు 6వ తేదీన దేశ వ్యాప్తంగా వివిధ రైల్వే స్టేషన్స్‌లో జరగనున్న శంకుస్థాపన పనులకు ఆయా రాష్ట్రాలకు చెందిన కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులు, స్థానిక ఎంపీలు, ఎమ్మెల్యేలు హాజరుకానున్నారు.

ఆగస్టు 6వ తేదీన దేశ వ్యాప్తంగా వివిధ రైల్వే స్టేషన్స్‌లో జరగనున్న శంకుస్థాపన పనులకు ఆయా రాష్ట్రాలకు చెందిన కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులు, స్థానిక ఎంపీలు, ఎమ్మెల్యేలు హాజరుకానున్నారు.

6 / 9
ఇందులో భాగంగానే రైల్వే మంత్రిత్వ శాఖ ఆధ్వార్యంలో ఇప్పటికే దేశవ్యాప్తంగా విద్యార్థులకు పెయింటింగ్‌, వ్యాస రచనల్లో పోటీలు నిర్వహించారు. ఇందులో గెలుపొందిన వారికి ఆగస్టు 6వ తేదీ బహుమతులు ఇవ్వనున్నారు. ఈ కార్యక్రమానికి 2 లక్షల మంది విద్యార్థులు పాల్గొంటారని అంచనా.

ఇందులో భాగంగానే రైల్వే మంత్రిత్వ శాఖ ఆధ్వార్యంలో ఇప్పటికే దేశవ్యాప్తంగా విద్యార్థులకు పెయింటింగ్‌, వ్యాస రచనల్లో పోటీలు నిర్వహించారు. ఇందులో గెలుపొందిన వారికి ఆగస్టు 6వ తేదీ బహుమతులు ఇవ్వనున్నారు. ఈ కార్యక్రమానికి 2 లక్షల మంది విద్యార్థులు పాల్గొంటారని అంచనా.

7 / 9
తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే అమృత్‌ భారత్‌ స్టేషన్‌ పథకంలో భాగంగా తెలంగాణలో 21 రైల్వే స్టేషన్స్‌, ఆంధ్రప్రదేశ్‌లో 18 రైల్వే స్టేషన్ల రూపం మారనుంది.

తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే అమృత్‌ భారత్‌ స్టేషన్‌ పథకంలో భాగంగా తెలంగాణలో 21 రైల్వే స్టేషన్స్‌, ఆంధ్రప్రదేశ్‌లో 18 రైల్వే స్టేషన్ల రూపం మారనుంది.

8 / 9
దేశంలోని రైల్వే స్టేషన్స్‌లో ప్రపంచస్థాయి సౌకర్యాలను అందించాల్సి అవసరం ఉందని చెప్పిన ప్రధాని మోదీ సూచనల మేరకు.. దేశంలోని 1309 స్టేషన్‌లను ఆధునికీకరణ చేసేందుకు ‘‘అమృత్ భారత్ స్టేషన్ పథకం’’ చేపట్టారు.

దేశంలోని రైల్వే స్టేషన్స్‌లో ప్రపంచస్థాయి సౌకర్యాలను అందించాల్సి అవసరం ఉందని చెప్పిన ప్రధాని మోదీ సూచనల మేరకు.. దేశంలోని 1309 స్టేషన్‌లను ఆధునికీకరణ చేసేందుకు ‘‘అమృత్ భారత్ స్టేషన్ పథకం’’ చేపట్టారు.

9 / 9
Follow Us
ఆఫీస్ నుంచి అలసిపోయి వచ్చారా? 5 నిమిషాల్లో రెడీ అయ్యే రెసిపీ
ఆఫీస్ నుంచి అలసిపోయి వచ్చారా? 5 నిమిషాల్లో రెడీ అయ్యే రెసిపీ
ఆసీస్‌కే దడ పుట్టించినోడిపై కన్నేసిన 3 ఐపీఎల్ టీంలు..!
ఆసీస్‌కే దడ పుట్టించినోడిపై కన్నేసిన 3 ఐపీఎల్ టీంలు..!
నాటుకోడి కూర వివాదం.. తండ్రి ప్రాణాలు బలి, కొడుకు కటకటాల పాలు
నాటుకోడి కూర వివాదం.. తండ్రి ప్రాణాలు బలి, కొడుకు కటకటాల పాలు
భారత మామిడి పండ్ల దిగుమతిని నిషేధించిన నేపాల్‌..ఎందుకో తెలిస్తే..
భారత మామిడి పండ్ల దిగుమతిని నిషేధించిన నేపాల్‌..ఎందుకో తెలిస్తే..
నేరేడు పండ్లు తింటే మీ శరీరంలో జరిగేది ఇదే..
నేరేడు పండ్లు తింటే మీ శరీరంలో జరిగేది ఇదే..
ఈ చిన్న ట్రిక్‌తో మీ హోమ్‌ లోన్‌పై రూ.6.85 లక్షల వరకు వడ్డీ ఆదా!
ఈ చిన్న ట్రిక్‌తో మీ హోమ్‌ లోన్‌పై రూ.6.85 లక్షల వరకు వడ్డీ ఆదా!
చుక్క నూనె లేకుండా .. ఏడాది పాటు నిల్వ ఉండే మామిడికాయ పచ్చడి
చుక్క నూనె లేకుండా .. ఏడాది పాటు నిల్వ ఉండే మామిడికాయ పచ్చడి
10 ఏళ్ల కలకు ఆ ఒక్కటే అడ్డు.. మరో చరిత్రకు సిద్ధమైన లేడీ రోహిత్..
10 ఏళ్ల కలకు ఆ ఒక్కటే అడ్డు.. మరో చరిత్రకు సిద్ధమైన లేడీ రోహిత్..
దేశంలోనే నెం.1.. విద్యుత్ వినియోగంలో తెలంగాణ సరికొత్త రికార్డ్..
దేశంలోనే నెం.1.. విద్యుత్ వినియోగంలో తెలంగాణ సరికొత్త రికార్డ్..
స్టవ్ లేకుండా ఎంతో రుచిగా చిటికెలో చేసుకునే పొలం పచ్చడి
స్టవ్ లేకుండా ఎంతో రుచిగా చిటికెలో చేసుకునే పొలం పచ్చడి