- Telugu News Photo Gallery Business photos These are the top selling electric cars in India, check list
Best Selling Electric Cars: విక్రయాల్లో టాప్ లేపిన ఎలక్ట్రిక్ కార్లు ఇవే.. టాటాకు మాత్రం ఎదురేలేదు..
దేశీయ ఆటో మార్కెట్లో ఎలక్ట్రిక్ ట్రెండ్ షురూ అయ్యింది. నెమ్మదిగా, స్థిరంగా ఎలక్ట్రిక్ కార్ల విక్రయాలు వేగం పుంజుకుంటున్నాయి. వినియోగదారులు ఎలక్ట్రిక్ కార్లనే కొనుగోలు చేసేందుకు మొగ్గుచూపుతున్నారు. ఈ శ్రేణి కార్లలో ముఖ్యంగా మనదేశంలో టాటా కంపెనీ ఆధిపత్యాన్ని చెలాయిస్తోంది. అధిక సంఖ్యలో కార్లను విద్యుత్శ్రేణిలో లాంచ్ చేస్తున్నది కూడా టాటా కంపెనీయే. దీంతో ఎక్కువ విక్రయాలు టాటా కార్లవే ఉంటున్నాయి. మిగిలిన కంపెనీల్లో ఎంజీ, మహీంద్రా వంటి కంపెనీలు కూడా తమ ముద్రను వేస్తున్నాయి. ఈ 2023 సంవత్సరం రెండో క్వార్టర్లో ఇప్పటి వరకూ అత్యధికంగా అమ్ముడైన కార్ల జాబితాను మీకు అందిస్తున్నాం. ఓ లుక్కేయండి..
Madhu |
Updated on: Aug 04, 2023 | 5:00 PM

టాటా టియాగో @ 10,695 యూనిట్లు.. ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉంది టాటా టియాగో. దీని ధర రూ. 9.19లక్షల నుంచి ప్రారంభమై రూ. 12.78లక్షల వరకూ ఉంది. దీనిలో 7.0-అంగుళాల ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, 8-స్పీకర్ హర్మాన్ సిస్టమ్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ వంటి అనేక ఫీచర్లు ఉన్నాయి. 19.2kWh, 24kWh బ్యాటరీ సామర్థ్యాలతో ఇది అందుబాటులో ఉంది. 2023రెండో క్వార్టర్లో ఇప్పటి వరకూ 10,695 యూనిట్లు అమ్ముడయ్యాయి.

టాటా నెక్సాన్ @ 5,072 యూనిట్లు.. రూ. 15లక్షల విలువతో మార్కెట్లోకి వచ్చిన కారు హాట్ కేకులా అమ్ముడవుతోంది. 2023రెండో క్వార్టర్లో 5,072 యూనిట్లు అమ్ముడయ్యాయి. దీనిలో అత్యాధునిక ఫీచర్లు ఉన్నాయి. దీనిలో ప్రైమ్ 312 కి.మీ, మాక్స్ మోడల్ 453 కి.మీ రేంజ్ ను సింగిల్ చార్జ్ పై అందిస్తుంది. నెక్సాన్ ప్రైమ్ ధర రూ. 15.48 లక్షల నుంచి రూ. 18.31 లక్షల వరకూ ఉంటుంది. నెక్సాన్ మ్యాక్స్ ధర రూ. 17.57 లక్షల నుంచి ప్రారంభమై రూ. 20.76 లక్షల వరకు ఉంది.

టాటా టిగోర్ @ 3,257 యూనిట్లు.. ఈవీ కార్ల విక్రయాల్లో టాప్ మూడు స్థానాలు టాటా కంపెనీ కార్లే ఉన్నాయి. మూడో స్థానంలో టిగోర్ఉంది. ఇది కూడా సింగిల్ చార్జ్ పై 315కిలోమీటర్ల రేంజ్ అందిస్తుందని కంపెనీ ప్రకటించినప్పటికీ వాస్తవంగా 220 కిలోమీటర్లు పరిధి వస్తుందని చెబుతున్నారు. ఈ 2023 రెండో క్వార్టర్లో టాటా 3,257 యూనిట్ల టిగోర్ ఈవీలను విక్రయించింది.

మహీంద్రా ఎక్స్యూవీ400 @ 2,234 యూనిట్లు.. టాటా కంపెనీ తర్వాత ఈవీ ప్లాట్ఫారంలో సత్తా చాటుతున్న బ్రాండ్ మహీంద్రా. దీని నుంచి ఎక్స్యూవీ400, ఎక్స్యూవీ300 కార్లు మార్కెట్లో లాంచ్ అయ్యాయి. వాటిల్లో ఎక్స్యూవీ 400 కార్లు అత్యధికంగా అమ్ముడయ్యాయి. 2023 రెండో క్వార్టర్లో 2,234 యూనిట్ల ఎక్స్యూవీ400 వాహనాలను మహీంద్రా లాంచ్ చేసింది. ఈ ఎక్స్యూవీ400 ధర రూ. 17.03 లక్షల నుంచి రూ. 20.21 లక్షల వరకూ ఉంది.

ఎంజీ కామెట్ @ 1,914 యూనిట్లు.. ఈ కారు మన దేశంలో గణనీయమైన ముద్రను వేసింది. కాంపాక్ట్ డిజైన్, మంచి రేంజ్, ఫీచర్లతో ఉన్న ఈ కారును ఎక్కువగానే కొనుగోలు చేశారు. 2023 రెండో క్వార్టర్లో 1,914 యూనిట్లను ఎంజీ విక్రయించింది. దీనిలో డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్తో కూడిన మరో 10.25-అంగుళాల స్క్రీన్ ఉంటుంది. ఇది సింగిల్ చార్జ్ పై 230 కిలోమీటర్లంటూ కంపెనీ క్లెయిమ్ చేయగా.. వాస్తవ పరిస్థితిలో 170 కిలోమీటర్ల వరకూ రేంజ్ ఇస్తుందని చెబుతున్నారు. దీని ధర రూ. 8.42 లక్షల నుంచి రూ. 10.50 లక్షల వరకూ ఉంది.

ఎంజీ జెడ్ఎస్ ఈవీ @ 1,747 యూనిట్లు.. ప్రీమియం ఇంటీరియర్ కూడిన ఈ కారు 461 కిలోమీటర్ల రేంజ్ ని క్లెయిమ్ చేస్తోంది.అయితే వాస్తవంగా 370కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది. 2023 రెండో క్వార్టర్ లో 1,747 ఎంజీ జెడ్ఎస్ ఈవీ యూనిట్లు అమ్ముడయ్యాయి. దీని ధర రూ. 24.85 లక్షల నుంచి రూ. 29.06 లక్షల వరకూ ఉంది.





























