AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఓరీ దేవుడో.. ఈ రెండు పండ్లు కలిపి తిన్నారంటే ఖతమే.. ఆరోగ్య నిపుణుల హెచ్చరిక!

పండ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని మనందరికీ తెలుసు. అయితే, కొన్ని పండ్ల కాంబినేషన్లు మాత్రం మన శరీరానికి మేలు చేయకపోగా తీవ్ర హాని కలిగిస్తాయి. అటువంటి విరుద్ధమైన కాంబినేషన్లలో అరటిపండు - బొప్పాయి ఒకటి. విడివిడిగా ఈ రెండు పండ్లు అద్భుతమైన పోషకాలను అందిస్తాయి. కానీ, వీటిని కలిపి తీసుకోవడం వల్ల అనేక సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అవేంటో పూర్తి వివరాల్లోకి వెళితే..

Jyothi Gadda
|

Updated on: Sep 16, 2026 | 6:59 PM

Share
పోషకాల గని – విడివిడిగా తింటే ఎంతో మేలు: అరటిపండులో శరీరానికి అవసరమైన పొటాషియం, క్యాల్షియం పుష్కలంగా ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడమే కాకుండా కండరాలను బలంగా మారుస్తాయి. మరోవైపు బొప్పాయి క్రమంగా తీసుకోవడం వల్ల శరీరంలో కొలెస్ట్రాల్ అదుపులో ఉంటుంది. జీర్ణక్రియ వేగవంతమవుతుంది.

పోషకాల గని – విడివిడిగా తింటే ఎంతో మేలు: అరటిపండులో శరీరానికి అవసరమైన పొటాషియం, క్యాల్షియం పుష్కలంగా ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడమే కాకుండా కండరాలను బలంగా మారుస్తాయి. మరోవైపు బొప్పాయి క్రమంగా తీసుకోవడం వల్ల శరీరంలో కొలెస్ట్రాల్ అదుపులో ఉంటుంది. జీర్ణక్రియ వేగవంతమవుతుంది.

1 / 5
కలిపి తింటే వచ్చే దుష్ప్రభావాలు: ఆయుర్వేదం ప్రకారం అరటిపండు శరీరాన్ని చల్లబరిచే తత్వం కలిగి ఉంటుంది. బొప్పాయి శరీరానికి వేడిని కలిగిస్తుంది. ఇలా విభిన్న స్వభావాలు కలిగిన పండ్లను ఒకేసారి తినడం వల్ల శరీరంలో రసాయన సమతుల్యత దెబ్బతింటుంది.

కలిపి తింటే వచ్చే దుష్ప్రభావాలు: ఆయుర్వేదం ప్రకారం అరటిపండు శరీరాన్ని చల్లబరిచే తత్వం కలిగి ఉంటుంది. బొప్పాయి శరీరానికి వేడిని కలిగిస్తుంది. ఇలా విభిన్న స్వభావాలు కలిగిన పండ్లను ఒకేసారి తినడం వల్ల శరీరంలో రసాయన సమతుల్యత దెబ్బతింటుంది.

2 / 5
జీర్ణక్రియ సమస్యలు: ఈ రెండు పండ్ల కలయిక వల్ల జీర్ణశక్తి మందగిస్తుంది. దీనివల్ల కడుపులో అజీర్ణం, ఉబ్బరం, వాంతులు, తల తిరగడం, తలనొప్పి వంటి ఇబ్బందులు ఎదురవుతాయి. అరటి, బొప్పాయి కలిపి తినడం వల్ల ఉబ్బసం, ఇతర శ్వాస సంబంధిత సమస్యలు తీవ్రమయ్యే ప్రమాదం ఉంది. అంతేకాకుండా చర్మంపై అలర్జీలు వచ్చే అవకాశం ఉంది.

జీర్ణక్రియ సమస్యలు: ఈ రెండు పండ్ల కలయిక వల్ల జీర్ణశక్తి మందగిస్తుంది. దీనివల్ల కడుపులో అజీర్ణం, ఉబ్బరం, వాంతులు, తల తిరగడం, తలనొప్పి వంటి ఇబ్బందులు ఎదురవుతాయి. అరటి, బొప్పాయి కలిపి తినడం వల్ల ఉబ్బసం, ఇతర శ్వాస సంబంధిత సమస్యలు తీవ్రమయ్యే ప్రమాదం ఉంది. అంతేకాకుండా చర్మంపై అలర్జీలు వచ్చే అవకాశం ఉంది.

3 / 5
ఎవరు ఏ పండు తినకూడదు?: కామెర్లతో బాధపడుతున్నవారు బొప్పాయిని అస్సలు తినకూడదు. బొప్పాయిలో ఉండే పపైన్, బీటా కెరోటిన్ అనే కాంపౌండ్లు కామెర్ల తీవ్రతను మరింత పెంచుతాయి. శరీరంలో ఇప్పటికే పొటాషియం స్థాయిలు అధికంగా ఉన్నవారు అరటిపండ్లను తీసుకోకపోవడం మంచిది.

ఎవరు ఏ పండు తినకూడదు?: కామెర్లతో బాధపడుతున్నవారు బొప్పాయిని అస్సలు తినకూడదు. బొప్పాయిలో ఉండే పపైన్, బీటా కెరోటిన్ అనే కాంపౌండ్లు కామెర్ల తీవ్రతను మరింత పెంచుతాయి. శరీరంలో ఇప్పటికే పొటాషియం స్థాయిలు అధికంగా ఉన్నవారు అరటిపండ్లను తీసుకోకపోవడం మంచిది.

4 / 5
ముందు నుంచే శ్వాసకోశ సమస్యలు ఉన్నవారు బొప్పాయికి దూరంగా ఉండాలి. కాబట్టి, ఈ రెండు పండ్ల వల్ల పూర్తి ఆరోగ్య ప్రయోజనాలు పొందాలంటే వీటిని ఒకేసారి కలిపి తినకుండా, వేర్వేరు సమయాల్లో మాత్రమే తీసుకోవాలని వైద్యులు సలహా ఇస్తున్నారు.

ముందు నుంచే శ్వాసకోశ సమస్యలు ఉన్నవారు బొప్పాయికి దూరంగా ఉండాలి. కాబట్టి, ఈ రెండు పండ్ల వల్ల పూర్తి ఆరోగ్య ప్రయోజనాలు పొందాలంటే వీటిని ఒకేసారి కలిపి తినకుండా, వేర్వేరు సమయాల్లో మాత్రమే తీసుకోవాలని వైద్యులు సలహా ఇస్తున్నారు.

5 / 5
Follow Us