Mobile Phone: ఫోన్ అతిగా వాడుతున్నారా ? అయితే ఈ ప్రమాదంలో పడ్డట్లే
ఇప్పుడు ప్రతిఒక్కరి చేతిలోకి స్మార్ట్ఫోన్ వచ్చేసింది. ఫోన్ లేకుండా ఒక్కరోజు కూడా ఉండలేకపోతున్నారు నెటీజన్లు. ఇంటర్నెట్, స్మార్ట్ఫోన్ లేనిరోజుల్లో ప్రజలు అప్పట్లో ఉన్న మాములు ఫోన్లకు ఇంతలా అడిక్ట్ కాలేదు. కానీ ఇప్పుడు మాత్రం పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఫోన్ లేకుండా అసలు ఏ పనులు కూడా చేసుకోలేని పరిస్థితి ఉంది.
Updated on: Jul 17, 2023 | 10:19 AM

ఇప్పుడు ప్రతిఒక్కరి చేతిలోకి స్మార్ట్ఫోన్ వచ్చేసింది. ఫోన్ లేకుండా ఒక్కరోజు కూడా ఉండలేకపోతున్నారు నెటీజన్లు. ఇంటర్నెట్, స్మార్ట్ఫోన్ లేనిరోజుల్లో ప్రజలు అప్పట్లో ఉన్న మాములు ఫోన్లకు ఇంతలా అడిక్ట్ కాలేదు. కానీ ఇప్పుడు మాత్రం పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఫోన్ లేకుండా అసలు ఏ పనులు కూడా చేసుకోలేని పరిస్థితి ఉంది.

ప్రొద్దున లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే దాకా సగం పనులు ఫోన్లతోనే జరుగుతున్నాయి. కొందరైతే గంటల కొద్ది ఫోన్ చూడటంలోనే మునిగిపోతున్నారు. కానీ ఆరోగ్య నిపుణులు మాత్రం ఈ అలవాటును హెచ్చరిస్తున్నారు. అతిగా వాడితే ఆరోగ్యానికి మంచిది కాదంటున్నారు.

మాములుగా ఉదయం ఫోన్లో వచ్చే నోటిఫికేషన్లు, ఈ-మెయిల్ల్లను చాలా మంది చెక్ చేసుకుంటాయి. అలాగే సోషల్ మీడియాలో వచ్చే అప్డేట్లను చూస్తుంటారు. అయితే ఈ సందేశాల వల్ల అనవసరంగా ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉందని అంటున్నారు. వీటివల్ల మనసులో ప్రతికూలతలు పెరుగుతాయని దీంతో ఆ రోజంతా దాని ప్రభావం కనిపించే అవకాశం ఉంటుందని చెబుతున్నారు.

ఉదయం నిద్ర లేచిన దగ్గర నుంచి అనేక రకాల సమాచారం కోసం వెతుకుతుంటారు. వాట్సాప్, ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్లో వచ్చే మెసేజ్లు రీల్స్ చూస్తూ ఉండిపోతారు. అయితే వీటి ప్రభావం మానసిక స్థితిపై ప్రతికూల ప్రభావం చూపుతుందని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. అలాగే కంటి ఆరోగ్యము కూడా దెబ్బతింటుందని నిపుణులు హెచ్చరిస్తు్న్నారు.

మనిషికి ప్రతిరోజూ మంచి నిద్ర అవసరం. కానీ రాత్రి చాలాసేపటి వరకు చాలామంది ఫోన్లోనే మునిగిపోతారు. వాస్తవానికి మొబైల్ స్క్రీన్ నుంచి వచ్చే బ్లూ లైట్ మెలటోనిన్ అనే హర్మోన్ ఉత్పత్తికి అడ్డుతగులుతుంది. ఆ హర్మోన్ మనిషికి నిద్ర రావడంలో సహయపడుతుంది. ఎక్కువ సేపు ఫోన్ చూస్తే కాంతి చాలాసేపటి వరకు కళ్లపై ఉండటం వల్ల నిద్రలేమి సమస్యకు కూడా దారితీస్తుంది.





























