Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: రైల్వే ప్రయాణికులకు ముఖ్య గమనిక.. వారం రోజుల పాటు ఆ రైళ్లు రద్దు..

MMTS Hyderabad: హైదరాబాద్ ఎంఎంటీఎస్ ప్రయాణికులు గమనిక. సోమవారం నుంచి వారం రోజుల పాటు లోకల్ ట్రైన్స్‌ని రద్దు చేసినట్లుగా దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ఫలితంగా ఏయే మార్గాల్లో ఎంఎంటీఎస్ సేవలు నిలిచిపోయాయంటే..

శివలీల గోపి తుల్వా

|

Updated on: Jul 09, 2023 | 12:13 PM

భాగ్యనగరవాసులకు ముఖ్య సూచన. ఎంఎంటీఎస్ రైల్వే ప్రయాణికుల కోసం దక్షిణ మధ్య రైల్వే కీలక ప్రకటన చేసింది.

భాగ్యనగరవాసులకు ముఖ్య సూచన. ఎంఎంటీఎస్ రైల్వే ప్రయాణికుల కోసం దక్షిణ మధ్య రైల్వే కీలక ప్రకటన చేసింది.

1 / 5
మహానగరంలోని 17 లోకల్ ట్రైన్స్(MMTS) సేవలను వారం రోజుల పాటు రద్దు చేసినట్లు వెల్లడించింది.

మహానగరంలోని 17 లోకల్ ట్రైన్స్(MMTS) సేవలను వారం రోజుల పాటు రద్దు చేసినట్లు వెల్లడించింది.

2 / 5
రైల్వే ట్రాకుల మరమ్మతులు, ఇతర నిర్వహణ పనుల కారణంగా హైదరాబాద్‌ లోకల్‌ రైలు సర్వీసులను రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు ప్రకటించారు.

రైల్వే ట్రాకుల మరమ్మతులు, ఇతర నిర్వహణ పనుల కారణంగా హైదరాబాద్‌ లోకల్‌ రైలు సర్వీసులను రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు ప్రకటించారు.

3 / 5
హైరదాబాద్‌తో పాటు సికింద్రాబాద్‌ సబర్బన్‌కు చెందిన మొత్తం 17 ఎంఎంటీఎస్‌ రైళ్లను ఈ నెల 10 నుంచి 16 వరకు రద్దు చేశారు.

హైరదాబాద్‌తో పాటు సికింద్రాబాద్‌ సబర్బన్‌కు చెందిన మొత్తం 17 ఎంఎంటీఎస్‌ రైళ్లను ఈ నెల 10 నుంచి 16 వరకు రద్దు చేశారు.

4 / 5
రద్దయినవాటిలో లింగంపల్లి-హైదరాబాద్‌, లింగంపల్లి-ఫలక్‌నుమా, ఉందానగర్‌-ఫలక్‌నుమా, రామచంద్రాపురం-ఫలక్‌నుమా స్టేషన్ల మధ్య నడిచే లోకల్‌ రైళ్లు ఉన్నట్లు రైల్వే అధికారులు తెలిపారు.

రద్దయినవాటిలో లింగంపల్లి-హైదరాబాద్‌, లింగంపల్లి-ఫలక్‌నుమా, ఉందానగర్‌-ఫలక్‌నుమా, రామచంద్రాపురం-ఫలక్‌నుమా స్టేషన్ల మధ్య నడిచే లోకల్‌ రైళ్లు ఉన్నట్లు రైల్వే అధికారులు తెలిపారు.

5 / 5
Follow us