నాగకేసర పువ్వులతో ఆరోగ్యప్రయోజనాలు పుష్కలం..! ఇలా వాడితే అనేక సమస్యలకు దివ్యౌషధం..!!
నాగకేసర్ మొక్క, పువ్వు వివిధ భాగాలు మనకు అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. నాగకేసర్ చెట్టు ఆకులు, పువ్వులు, విత్తనాలను మూలికా ఔషధాలలో ఉపయోగిస్తారు. ఆయుర్వేదంలో ఈ మొక్క చాలా ప్రసిద్ధమైన మూలిక. ఇది జ్వరం, వాంతులు, మూత్ర నాళాల రుగ్మతలు, పార్శ్వపు నొప్పి వంటి అనేక ఆరోగ్య రుగ్మతలకు చికిత్స చేయడానికి ఉపయోగిస్తారు. ఇది కాకుండా ఇతర మసాలా దినుసులతో పాటు పొడి రూపంలో ఉపయోగిస్తారు. ఆయుర్వేదం ప్రకారం, నాగకేసర్ మొక్క వాత, పిత్తా, కఫ దోశాలను నయం చేయడానికి ఉపయోగించే అద్భుతమైన మూలిక.
Updated on: Mar 19, 2024 | 4:41 PM

సహజంగా వచ్చే సీజనల్ వ్యాధులను అరికట్టడంలో నాగకేసర్ అద్భుతంగా పనిచేస్తుంది. నాగకేసర పువ్వుతో జలుబును తగ్గించుకోవచ్చు. అందుకు గాను.. ఈ పువ్వును తీసుకుని బాగా నలిపి పేస్ట్లా చేసి ఆ మిశ్రమాన్ని నుదుటిపై రాసుకుంటే జలుబు తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు.

నేటి జీవనశైలిలో కడుపు సంబంధిత సమస్యలు సర్వసాధారణం. అజీర్ణం, అసిడిటీ, గుండెల్లో మంట, గ్యాస్, కడుపునొప్పి, వాపు వంటి సమస్యలను అధిగమించడానికి నాగకేసర్ వాడితే ఉపశమనం కలుగుతుంది. . దీని కోసం, మీరు ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో కొద్దిగా నాగకేసర పువ్వులతో తయారు చేసిన పొడి, తేనె కలిపి తీసుకుంటే, అజీర్ణం, అసిడిటీ, గ్యాస్, కడుపునొప్పి, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు తగ్గుతాయి.

చాలా మందికి వెక్కిళ్లు వచ్చాయంటే ఒక పట్టాన తగ్గవు. అటువంటి పరిస్థితిలో నాగకేసర పువ్వుల పొడితో వెక్కిళ్లను తగ్గించుకోవచ్చు. అందుకు గాను ఆ పువ్వుల పొడిని తేనెతో కలిపి తీసుకోవాలి. అదే పొడిని చెరుకు రసంతో కలిపి కూడా తీసుకోవచ్చు. దీంతో వెక్కిళ్లు తగ్గిపోతాయి.

ప్రస్తుత కాలంలో చాలా మందికి 40ఏళ్లు కూడా దాటకుండానే కీళ్ల నొప్పుల సమస్య కూడా సర్వసాధారణమైపోతోంది. ఈ సమస్య నుంచి బయటపడాలంటే నాగకేసర్ చక్కటి ఔషధంగా పనిచేస్తుంది. దీని కోసం, నాగకేసర గింజల నూనెను కీళ్లపై లేదా నొప్పి ఉన్న ప్రదేశాలపై నెమ్మదిగా మర్ధన చేయాలి.. ఇది నొప్పి నుండి ఉపశమనాన్ని కలిగిస్తుంది.దీంతో కీళ్ల నొప్పులు తగ్గుతాయి.

నాగకేసర పువ్వుల పొడిని తేనెతో కలిపి తీసుకుంటుంటే జ్వరం కూడా తగ్గుతుంది. పావు టీస్పూన్ తేనెను అర టీస్పూన్ పొడితో కలిపి తీసుకోవాలి. దీన్ని రోజుకు 2 సార్లు తీసుకోవాల్సి ఉంటుంది. నాగకేసర పువ్వుల పొడిని తేనెతో కలిపి తీసుకుంటుంటే పైల్స్, ఆస్తమా వంటి సమస్యలు తగ్గుతాయి. ఆ మిశ్రమాన్ని రోజుకు 1 లేదా 2 సార్లు తీసుకోవాలి. నాగకేసర నూనెను గాయాలు, పుండ్లపై రాస్తుంటే అవి త్వరగా మానుతాయి. ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో అర టీస్పూన్ నాగకేసర పువ్వుల పొడిని కలిపి తాగితే తలనొప్పి తగ్గుతుంది.

చాలా మంది మహిళలు బహిష్టు సమయంలో అధిక రక్తస్రావంతో ఇబ్బంది పడుతుంటారు. బహిష్టు రక్తస్రావం సాధారణమైనప్పటికీ, అధిక రక్తస్రావం అనారోగ్యకరం. మీరు ఈ సమస్యతో బాధపడుతున్నట్లయితే, నాగకేసరిని ఈ విధంగా ఉపయోగించండి. ఇందుకోసం 250-500 మి.గ్రా.నగకేసర్ పొడిని పాలవిరుగుడుతో కలిపి మూడు రోజులపాటు తినాలి. ఇది కాకుండా మీ రోజువారీ ఆహారంలో మజ్జిగ తీసుకోండి. ఇలా చేయడం వల్ల మెనోరేజియా సమస్య నుంచి త్వరగా ఉపశమనం లభిస్తుంది. (ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)




