Diwali 2023: బ్రిటన్లో పర్యటిస్తున్న జైశంకర్ దంపతులు.. దీపావళి కానుకగా ప్రధాని రిషికి స్పెషల్ గిఫ్ట్ ఇచ్చిన జైశంకర్
దీపావళి పండగను దేశ విదేశాలోని హిందువులు అత్యంత ఘనంగా జరుపుకున్నారు. పండగ సందర్భంగా తమ బంధు మిత్రులకు, సన్నిహితులకు బహుమతులను ఇచ్చి పుచ్చుకున్నారు. ఇదే సంప్రదాయాన్ని పాటిస్తూ బ్రిటన్ ప్రధాని రిషి సునక్ కు భారత కేంద్ర మంత్రి జైశంకర్ ప్రత్యేక బహుమతిని అందించారు. భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ఆయన భార్య క్యోకో జైశంకర్ బ్రిటన్లో పర్యటిస్తున్నారు. బ్రిటన్ ప్రధాని రిషి సునక్ తన భార్య అక్షతా మూర్తితో కలిసి జై శంకర్ దంపతులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రిషి సునక్కి జైశంకర్ ప్రత్యేక బహుమతిని అందించారు.
Most Read Stories