షుగర్ పేషెంట్స్ వీటిని తింటే చాలా మంచిదట..బ్లడ్షుగర్ కంట్రోల్లోకి..
మధుమేహం ఇప్పుడు చిన్నా పెద్ద తేడా లేకుండా అందరినీ ఎటాక్ చేస్తుంది. ఇది భయంకరమైన వ్యాధి కానప్పటికీ, అదుపులో ఉంచుకోకపోతే, గుండె, కళ్ళు, మూత్రపిండాలు, కాలేయం వంటి ఇతర అవయవాలు ప్రమాదంలో పడతాయి. అందుకోసం షుగర్ కంట్రోల్ టిప్స్ తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది. మీ బ్లడ్షుగర్ కంట్రోల్లో ఉండాలంటే, ముందుగా స్వీట్లకు దూరంగా ఉండాల్సి వస్తుంది. అలాగే నూనె, మసాలాలు, నెయ్యి వంటివి ఎక్కువగా ఉన్న ఆహారాన్ని కూడా తినకూడదు. బదులుగా, మీ ఆహారంలో కొన్ని ఆరోగ్యకరమైన పండ్లను తీసుకోవచ్చు. అది మీ ఆరోగ్యానికి మేలు చేస్తుంది. మధుమేహంతో బాధపడుతున్న వారు సహజ సిద్ధమైన పండ్లు తినే విషయంలో కొందరిలో అనేక అపోహలు, అనుమానాలు ఉన్నాయి. పండ్లలో వేటిని తినాలి, వేటిని తినకూడదో అన్న సందేహ ఉంటుంది. చాలా సందర్భాల్లో మధుమేహంతో బాధపడేవారికి పండ్లు తినాలని ఉన్నా తినకుండా మౌనంగా ఉండిపోతుంటారు. ఏం తినాలన్నా ఆచితూచి తింటుంటారు. అయితే, మధుమేహం ఉన్నవారు సైతం కొన్ని రకాల పండ్లు తినవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5




