Acidity Problem: ఎసిడిటీతో బాధపడేవారు రోజూ పరగడుపున వాముతో తయారు చేసిన ఈ ద్రవాన్ని తాగారంటే..
Srilakshmi C |
Updated on: Aug 26, 2022 | 1:12 PM
ప్రస్తుత జీవనశైలి ప్రతి ఒక్కరినీ వేధించే ఆరోగ్య సమస్యల్లో ఎసిడిటీ ఒకటి. జీర్ణశక్తి సన్నగిల్లడమే ఇందుకు ప్రధాన కారణం. 50 సీట్లను ఒకేసారి ఆంఫట్ చేసేవారు ఈరోజుల్లో లేరనేచెప్పాలి. ఏ కొంచెం ఆహారం తీసుకున్నా గ్యాస్, గుండెల్లో మంట వేదిస్తుంటుంది..
Aug 26, 2022 | 1:12 PM
ప్రస్తుత జీవనశైలి ప్రతి ఒక్కరినీ వేధించే ఆరోగ్య సమస్యల్లో ఎసిడిటీ ఒకటి. జీర్ణశక్తి సన్నగిల్లడమే ఇందుకు ప్రధాన కారణం. 50 సీట్లను ఒకేసారి ఆంఫట్ చేసేవారు ఈరోజుల్లో లేరనేచెప్పాలి. ఏ కొంచెం ఆహారం తీసుకున్నా గ్యాస్, గుండెల్లో మంట వేదిస్తుంటుంది.
1 / 5
రోజువారీ జీవనయానంలో ఒత్తిడి గతంలో కంటే ఎక్కువ. దీనిని అధిగమించేందుకు చిన్నపాటి వ్యాయామం చేసేందుకు కూడా ఎవరికీ సమయం ఉండటం లేదు. ఒకే చోట కూర్చోవడం, పని చేయడం, తినడం, ఫాస్ట్ ఫుడ్ ఎక్కువగా తినడం వల్ల సమస్య జటిలమవుతోంది. దీనికి విరుగుడుగా ప్రతిరోజూ యాంటాసిడ్ తీసుకోవడం సరికాదు.
2 / 5
పోషకాహార నిపుణుల సలహా.. వాముతో ఎసిడిటీతోపాటు జీర్ణసంబంధిత సమస్యలన్నింటినీ తరిమేయవచ్చు. వాములో ప్రోటీన్, ఫైబర్, కాల్షియం, ఐరన్ వంటి బహుళ పోషకాలు ఉంటాయి.
3 / 5
ఆయుర్వేదం ప్రకారం.. గ్యాస్ వల్ల గుండెల్లో మంటతో బాధపడేవారు రోజుకు 2 చెంచాల వామును నీటిలో వేసి మరిగించి ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో తాగితే ఉపశమనం పొందవచ్చు. జీర్ణ సమస్యలతోపాటు పొట్టలోని కొవ్వును కూడా ఇది కరిగిస్తుంది.
4 / 5
రాత్రి భోజనం తర్వాత కొద్దిగా వాము తిని ఒక గ్లాసు గోరువెచ్చని నీళ్లు తాగితే నిద్ర బాగా పడుతుంది. జీర్ణక్రియ కూడా సక్రమంగా జరుగుతుంది. అలాగే పీరియడ్ సమస్యలతో బాధపడేవారు మధ్యాహ్నం అన్నం తిన్నాక ఉప్పు, నిమ్మకాయ రసంతో వాము కలిపి తింటే మంచి ఫలితం ఉంటుంది.