వివాహబంధం చాలా పవిత్రమైనది.. భార్యాభర్తలు ఇద్దరి నమ్మకం మీద కొనసాగుతుంది.. అయితే.. సాధారణంగా కొంతమంది సంబంధంలోని (రిలేషన్షిప్) సమస్యలను స్నేహితులతో పంచుకుంటారు.. వారితో భర్త లేదా భార్య గురించి అన్ని చెప్పేసుకుని సలహాలను తీసుకుంటారు.. అయితే ఇలా చేయడం సరైనదేనా..? మూడో వ్యక్తితో పర్సనల్ విషయాలను పంచుకోవచ్చా..? మానసిక నిపుణులు ఏం చెబుతున్నారు.. వివరాలను తెలుసుకోండి.. వాస్తవానికి భార్యాభర్తలు ఇద్దరూ ప్రతి సమస్యను ఎదుర్కొనేదే విజయవంతమైన వివాహం బంధం అంటారు.. సంబంధంలో ఏదైనా మూడవ వ్యక్తికి ప్రవేశం కల్పిస్తే.. అది సంబంధంలో దూరాన్ని సృష్టిస్తుంది. అందుకే.. శ్రేయోభిలాషులు, స్నేహితుల నుంచి సలహాలు తీసుకోవడం మానేయాలి.. ప్రతి ఒక్కరికి సంబంధాలలో విభిన్న అనుభవాలు ఉంటాయి. అందువల్ల, మీ సంబంధ సమస్యలను మూడవ వ్యక్తి కోణం నుంచి పరిష్కరించాలనే తప్పును మీరు ఎప్పటికీ చేయకూడదు. రిలేషన్ లో మూడో వ్యక్తి ప్రమేయం ఏ విధంగా దూరాన్ని పెంచి.. సమస్యలను సృష్టిస్తుంది.. సంబంధాల చిట్కాలను తీసుకోవద్దడానికి 4 కారణాలు ప్రధాన కారణాలేంటో ఇప్పుడు తెలుసుకోండి..