- Telugu News Photo Gallery Cricket photos Will Hardik Pandya Remain Captain Of Mumbai Indians in IPL 2025
IPL 2025: హార్దిక్ పాండ్యాకు బిగ్ షాక్.. ముంబై కెప్టెన్గా ఔట్.. కొత్త సారథిగా ఎవరంటే?
IPL 2025: ఐపీఎల్ సీజన్-18 కోసం మెగా వేలం నిర్వహించనుంది. ఈ మెగా వేలానికి ముందు ప్రతి ఫ్రాంచైజీకి కేవలం నలుగురు ఆటగాళ్లను మాత్రమే ఉంచుకోవడానికి అనుమతి ఉంది. దీని ప్రకారం ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ ముగ్గురు భారతీయులను రిటైన్ చేయాలని నిర్ణయించుకుంటే, హార్దిక్ పాండ్యా జట్టుకు దూరమవడం ఖాయం.
Updated on: Jul 20, 2024 | 5:48 PM

టీమ్ ఇండియా కెప్టెన్ ఐపీఎల్ జట్టుకు నాయకత్వం వహించడం అనాదిగా వస్తోంది. అయితే, ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ ఈ సంప్రదాయాన్ని బ్రేక్ చేసింది. 2024లో ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ నుంచి టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మను తప్పించి హార్దిక్ పాండ్యాకు కెప్టెన్సీని అప్పగించారు. భారత జట్టు తాత్కాలిక కెప్టెన్గా హార్దిక్ పాండ్యా కనిపించడం గమనార్హం. కానీ, అంతా మారిపోయింది. రోహిత్ శర్మ తర్వాత టీమిండియా టీ20 కెప్టెన్గా సూర్యకుమార్ యాదవ్ ఎంపికయ్యాడు. వచ్చే సీజన్లో జట్టుకు ఎవరు కెప్టెన్గా వ్యవహరిస్తారనేది ప్రస్తుతం ముంబై ఇండియన్స్ను ఎదుర్కొంటున్న పెద్ద ప్రశ్నగా మారింది.

ఎందుకంటే, టీమిండియా టీ20 జట్టుకు సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్గా ఉండగా, వన్డే జట్టుకు రోహిత్ శర్మ కెప్టెన్గా ఉన్నాడు. వీరిద్దరూ హార్దిక్ పాండ్యా సారథ్యంలో ముంబై ఇండియన్స్కు ఆడబోతున్నారా అనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది. ఎందుకంటే రోహిత్ శర్మ తర్వాత ముంబై ఇండియన్స్ జట్టు కెప్టెన్సీపై సూర్యకుమార్ యాదవ్ కన్నేశాడు. అయితే, హార్దిక్ పాండ్యను కొత్త కెప్టెన్గా ప్రకటించగానే, సూర్యకుమార్ యాదవ్ ముంబై కొత్త కెప్టెన్ అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు మొదలయ్యాయి. అయితే, సూర్య ఐపీఎల్ సీజన్ 17లో ముంబై ఇండియన్స్ తరపున ఆడిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే, రాబోయే సీజన్ కోసం మెగా వేలం నిర్వహించనున్న సంగతి తెలిసిందే.

ఈ మెగా వేలానికి ముందు కేవలం నలుగురిని మాత్రమే రిటైన్ చేసుకునే అవకాశం ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి. దీని ప్రకారం ముగ్గురు భారతీయులు, ఒక విదేశీ ఆటగాడిని రిటైన్ చేసుకునే అవకాశం ఉంది. ఈ రూల్లో ముంబై ఇండియన్స్ ఎవరిని నిలబెట్టుకుంటుంది? ముగ్గురు భారతీయులను మాత్రమే రిటైన్ చేసుకునే అవకాశం వస్తే ముంబై ఇండియన్స్ జస్ప్రీత్ బుమ్రా, సూర్యకుమార్ యాదవ్, రోహిత్ శర్మలను తప్పకుండా రిటైన్ చేస్తుంది. ఇక్కడ సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్ అయితే రోహిత్ శర్మ ముంబై ఇండియన్స్ జట్టులో కొనసాగే అవకాశం ఉంది. లేకపోతే, మెగా వేలంలో హిట్మ్యాన్ కనిపించవచ్చు.

అందువల్ల ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ రోహిత్ శర్మను ఒప్పించాల్సి ఉంది. అదే సమయంలో సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రాలను భారీ మొత్తం చెల్లించి జట్టులో ఉంచుకోవాలి. కాకపోతే ఈ ఇద్దరిలో ఎవరో ఒకరు వేలంలో కనిపించడం ఖాయం.

దీని ప్రకారం, ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రాలను రిటైన్ చేసిన భారత ఆటగాళ్ల జాబితాలో ఉంచుకోబోతున్నట్లయితే, హార్దిక్ పాండ్యా జట్టుకు దూరంగా ఉండటం ఖాయం. అలాగే సూర్యకుమార్ యాదవ్ లేదా రోహిత్ శర్మకు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందని అంటున్నారు. అందుకే ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్-18 ప్రారంభానికి ముందే హార్దిక్ పాండ్యా ముంబై ఇండియన్స్ జట్టు నుంచి తప్పుకున్నా ఆశ్చర్యపోనవసరం లేదు.




