Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Team India: చరిత్ర సృష్టించిన లేడీ కోహ్లీ.. ఆ ప్లేయర్ రికార్డ్ బద్దలు.. స్పెషల్ లిస్ట్‌లో అగ్రస్థానం..

Smriti Mandhana Most runs for India in WT20I: మహిళల ఆసియా కప్ 2024 లో భారత్ తరపున స్మృతి మంధాన అత్యధిక పరుగులు చేసింది. దీంతో టోర్నీ తొలిరోజే భారత్‌-పాకిస్థాన్‌ల మధ్య జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో భారత ఓపెనర్ స్మృతి మంధాన ధీటుగా బ్యాటింగ్ చేసి తుఫాను ఇన్నింగ్స్ ఆడింది. తన బలమైన ఇన్నింగ్స్‌లో, స్మృతి తన పేరిట ప్రత్యేక రికార్డును కూడా సృష్టించింది.

Venkata Chari

|

Updated on: Jul 20, 2024 | 7:53 PM

Smriti Mandhana Most runs for India in WT20I: మహిళల ఆసియా కప్ 2024 లో భారత్ తరపున స్మృతి మంధాన అత్యధిక పరుగులు చేసింది. దీంతో టోర్నీ తొలిరోజే భారత్‌-పాకిస్థాన్‌ల మధ్య జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో భారత ఓపెనర్ స్మృతి మంధాన ధీటుగా బ్యాటింగ్ చేసి తుఫాను ఇన్నింగ్స్ ఆడింది. తన బలమైన ఇన్నింగ్స్‌లో, స్మృతి తన పేరిట ప్రత్యేక రికార్డును కూడా సృష్టించింది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్‌ను వెనుక్కు నెట్టేసింది.

Smriti Mandhana Most runs for India in WT20I: మహిళల ఆసియా కప్ 2024 లో భారత్ తరపున స్మృతి మంధాన అత్యధిక పరుగులు చేసింది. దీంతో టోర్నీ తొలిరోజే భారత్‌-పాకిస్థాన్‌ల మధ్య జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో భారత ఓపెనర్ స్మృతి మంధాన ధీటుగా బ్యాటింగ్ చేసి తుఫాను ఇన్నింగ్స్ ఆడింది. తన బలమైన ఇన్నింగ్స్‌లో, స్మృతి తన పేరిట ప్రత్యేక రికార్డును కూడా సృష్టించింది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్‌ను వెనుక్కు నెట్టేసింది.

1 / 5
నిజానికి, టీమ్ ఇండియా తరపున మహిళల T20 ఇంటర్నేషనల్‌లో అత్యధిక పరుగుల రికార్డు ఇప్పటి వరకు హర్మన్‌ప్రీత్ కౌర్ పేరిట ఉంది. అయితే స్మృతి మంధాన పాకిస్తాన్‌పై 31 బంతుల్లో 45 పరుగుల ఇన్నింగ్స్‌తో దానిని అధిగమించగలిగింది. మంధాన 137 మ్యాచ్‌ల్లో 3365 పరుగులు చేయగా, హర్మన్‌ప్రీత్ 170 మ్యాచ్‌ల్లో 3349 పరుగులు చేసింది.

నిజానికి, టీమ్ ఇండియా తరపున మహిళల T20 ఇంటర్నేషనల్‌లో అత్యధిక పరుగుల రికార్డు ఇప్పటి వరకు హర్మన్‌ప్రీత్ కౌర్ పేరిట ఉంది. అయితే స్మృతి మంధాన పాకిస్తాన్‌పై 31 బంతుల్లో 45 పరుగుల ఇన్నింగ్స్‌తో దానిని అధిగమించగలిగింది. మంధాన 137 మ్యాచ్‌ల్లో 3365 పరుగులు చేయగా, హర్మన్‌ప్రీత్ 170 మ్యాచ్‌ల్లో 3349 పరుగులు చేసింది.

2 / 5
భారత మహిళల జట్టు తరపున టీ20 ఇంటర్నేషనల్‌లో అత్యధిక పరుగులు చేసిన మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ మూడో స్థానంలో ఉంది. మిథాలీ 89 మ్యాచ్‌ల్లో 2364 పరుగులు చేసింది. అదే సమయంలో, జెమిమా రోడ్రిగ్స్ 96 మ్యాచ్‌ల్లో 2000 పరుగులతో నాలుగో స్థానంలో ఉంది. పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లోనే జెమీమా రెండు వేల పరుగుల స్కోరును సాధించింది. 77 మ్యాచ్‌ల్లో 1788 పరుగులు చేసిన షెఫాలీ వర్మ ఐదో స్థానంలో ఉంది.

భారత మహిళల జట్టు తరపున టీ20 ఇంటర్నేషనల్‌లో అత్యధిక పరుగులు చేసిన మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ మూడో స్థానంలో ఉంది. మిథాలీ 89 మ్యాచ్‌ల్లో 2364 పరుగులు చేసింది. అదే సమయంలో, జెమిమా రోడ్రిగ్స్ 96 మ్యాచ్‌ల్లో 2000 పరుగులతో నాలుగో స్థానంలో ఉంది. పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లోనే జెమీమా రెండు వేల పరుగుల స్కోరును సాధించింది. 77 మ్యాచ్‌ల్లో 1788 పరుగులు చేసిన షెఫాలీ వర్మ ఐదో స్థానంలో ఉంది.

3 / 5
7 సార్లు ఛాంపియన్ అయిన భారత జట్టు మహిళల ఆసియా కప్ 2024ను కూడా అట్టహాసంగా ప్రారంభించింది. మొదటి మ్యాచ్‌లోనే చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌ను 7 వికెట్ల తేడాతో ఓడించింది. టాస్ గెలిచిన పాకిస్తాన్ మొదట బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకుంది. అది సరైనది కాదని తేలింది. పాక్‌ ఇన్నింగ్స్‌ ఆరంభం నుంచి తడబడింది. ఏ బ్యాటర్ కూడా భారీ స్కోరు చేయలేకపోయారు. ఈ కారణంగా ఆ జట్టు మొత్తం ఓవర్లు ఆడకుండానే 19.2 ఓవర్లలో 108 పరుగులకే పరిమితమైంది.

7 సార్లు ఛాంపియన్ అయిన భారత జట్టు మహిళల ఆసియా కప్ 2024ను కూడా అట్టహాసంగా ప్రారంభించింది. మొదటి మ్యాచ్‌లోనే చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌ను 7 వికెట్ల తేడాతో ఓడించింది. టాస్ గెలిచిన పాకిస్తాన్ మొదట బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకుంది. అది సరైనది కాదని తేలింది. పాక్‌ ఇన్నింగ్స్‌ ఆరంభం నుంచి తడబడింది. ఏ బ్యాటర్ కూడా భారీ స్కోరు చేయలేకపోయారు. ఈ కారణంగా ఆ జట్టు మొత్తం ఓవర్లు ఆడకుండానే 19.2 ఓవర్లలో 108 పరుగులకే పరిమితమైంది.

4 / 5
లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో టీమిండియా 14.1 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 109 పరుగులు చేసి విజయం సాధించింది. స్మృతి మంధాన అత్యధిక స్కోరు 45 పరుగులు చేయగా, షెఫాలీ కూడా 40 పరుగులు చేసింది.

లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో టీమిండియా 14.1 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 109 పరుగులు చేసి విజయం సాధించింది. స్మృతి మంధాన అత్యధిక స్కోరు 45 పరుగులు చేయగా, షెఫాలీ కూడా 40 పరుగులు చేసింది.

5 / 5
Follow us