AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kohli – Rohit: పొమ్మనకుండా పొగెట్టేశారుగా.. ‘రో-కో’ రిటైర్మెంట్‌కు అసలు కారణం ఇదేనంట.. ఇది పెద్ద ప్లానే భయ్యో..

Virat Kohli - Rohit Sharma: విరాట్ కోహ్లి టీమ్ ఇండియా కోసం 125 మ్యాచ్‌లు ఆడగా, రోహిత్ శర్మ 159 మ్యాచ్‌లు ఆడాడు. ఇప్పుడు భారత జట్టులోని ఇద్దరు సీనియర్ ఆటగాళ్లు ఒకేసారి టీ20 అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైరయ్యారు. హఠాత్తుగా రిటైర్మెంట్ ప్రకటించడానికి కారణం ఏంటో చూస్తే ఇప్పుడు తెలుసుకుందాం..

Venkata Chari
|

Updated on: Jul 01, 2024 | 10:21 AM

Share
Virat Kohli and Rohit Sharma: టీ20 ప్రపంచకప్ గెలిచిన తర్వాత టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ ప్రకటించారు. ప్రపంచకప్ గెలిచిన ఆనందంలో ఇద్దరు దిగ్గజాలు ఈ నిర్ణయం తీసుకున్నారని అనుకుంటే పొరపాటే. ఎందుకంటే టీ20 ప్రపంచకప్ ప్రారంభానికి ముందే బీసీసీఐ వారిద్దరికీ నోటీసులు ఇచ్చిందంట.

Virat Kohli and Rohit Sharma: టీ20 ప్రపంచకప్ గెలిచిన తర్వాత టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ ప్రకటించారు. ప్రపంచకప్ గెలిచిన ఆనందంలో ఇద్దరు దిగ్గజాలు ఈ నిర్ణయం తీసుకున్నారని అనుకుంటే పొరపాటే. ఎందుకంటే టీ20 ప్రపంచకప్ ప్రారంభానికి ముందే బీసీసీఐ వారిద్దరికీ నోటీసులు ఇచ్చిందంట.

1 / 8
అవును, ఈ టీ20 ప్రపంచకప్‌నకు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలను ఎంపిక చేసే ఉద్దేశ్యం BCCIకి లేదు. అందుకే వన్డే ప్రపంచకప్ కారణంగా గత ఏడాదిగా ఇద్దరు సీనియర్ ఆటగాళ్లు టీ20 జట్టుకు దూరమయ్యారు.

అవును, ఈ టీ20 ప్రపంచకప్‌నకు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలను ఎంపిక చేసే ఉద్దేశ్యం BCCIకి లేదు. అందుకే వన్డే ప్రపంచకప్ కారణంగా గత ఏడాదిగా ఇద్దరు సీనియర్ ఆటగాళ్లు టీ20 జట్టుకు దూరమయ్యారు.

2 / 8
అయితే, టీ20 ప్రపంచకప్ ప్రారంభానికి ముందే రోహిత్ శర్మకు కెప్టెన్సీ ఇవ్వాలని బీసీసీఐ నిర్ణయించింది. వన్డే ప్రపంచకప్‌లో భారత జట్టు అద్భుత ప్రదర్శన చేయడమే ఇందుకు కారణం. రోహిత్ శర్మకు మళ్లీ టీ20 టీమ్‌లో అవకాశం ఇవ్వనున్న నేపథ్యంలో.. విరాట్ కోహ్లీని తప్పించే చర్చలు తెరపైకి వచ్చాయి.

అయితే, టీ20 ప్రపంచకప్ ప్రారంభానికి ముందే రోహిత్ శర్మకు కెప్టెన్సీ ఇవ్వాలని బీసీసీఐ నిర్ణయించింది. వన్డే ప్రపంచకప్‌లో భారత జట్టు అద్భుత ప్రదర్శన చేయడమే ఇందుకు కారణం. రోహిత్ శర్మకు మళ్లీ టీ20 టీమ్‌లో అవకాశం ఇవ్వనున్న నేపథ్యంలో.. విరాట్ కోహ్లీని తప్పించే చర్చలు తెరపైకి వచ్చాయి.

3 / 8
దీంతో బీసీసీఐ డైలమాలో పడింది. విరాట్ కోహ్లీని టీ20 ప్రపంచకప్ నుంచి తప్పించే బాధ్యతను సెలక్షన్ కమిటీ, రోహిత్ శర్మ భుజానకెత్తుకున్నారు. కానీ, కింగ్ కోహ్లిని వదిలి ప్రపంచకప్ జట్టును ఏర్పాటు చేసేందుకు హిట్ మ్యాన్ అస్సలు సిద్ధంగా లేడు. అలాగే 15 మంది సభ్యులతో కూడిన జట్టులో విరాట్ కోహ్లీని ఎంపిక చేయాలని రోహిత్ శర్మ పట్టుబట్టాడు.

దీంతో బీసీసీఐ డైలమాలో పడింది. విరాట్ కోహ్లీని టీ20 ప్రపంచకప్ నుంచి తప్పించే బాధ్యతను సెలక్షన్ కమిటీ, రోహిత్ శర్మ భుజానకెత్తుకున్నారు. కానీ, కింగ్ కోహ్లిని వదిలి ప్రపంచకప్ జట్టును ఏర్పాటు చేసేందుకు హిట్ మ్యాన్ అస్సలు సిద్ధంగా లేడు. అలాగే 15 మంది సభ్యులతో కూడిన జట్టులో విరాట్ కోహ్లీని ఎంపిక చేయాలని రోహిత్ శర్మ పట్టుబట్టాడు.

4 / 8
కెప్టెన్ పట్టుబట్టడంతో అఫ్గానిస్థాన్‌తో జరిగే టీ20 సిరీస్‌కు విరాట్ కోహ్లి ఎంపికయ్యాడు. ఈ సిరీస్‌లో తన తుఫాన్ బ్యాటింగ్‌తో దృష్టిని ఆకర్షించిన కోహ్లి.. ఆ తర్వాత ఐపీఎల్‌లో సందడి చేశాడు. దీంతో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలను కూడా టీ20 ప్రపంచకప్‌నకు ఎంపిక చేయాల్సి వచ్చింది.

కెప్టెన్ పట్టుబట్టడంతో అఫ్గానిస్థాన్‌తో జరిగే టీ20 సిరీస్‌కు విరాట్ కోహ్లి ఎంపికయ్యాడు. ఈ సిరీస్‌లో తన తుఫాన్ బ్యాటింగ్‌తో దృష్టిని ఆకర్షించిన కోహ్లి.. ఆ తర్వాత ఐపీఎల్‌లో సందడి చేశాడు. దీంతో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలను కూడా టీ20 ప్రపంచకప్‌నకు ఎంపిక చేయాల్సి వచ్చింది.

5 / 8
అయితే, ఈ ఎంపికకు ముందే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీకి ఇదే చివరి టీ20 ప్రపంచకప్ అని సమాచారం. అలాగే, 2026 టీ20 ప్రపంచకప్‌కు ముందు కొత్త జట్టును ఏర్పాటు చేయబోతున్నాం. టీ20 జట్టులో సీనియర్ ఆటగాళ్లకు చోటు దక్కదని రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలకు బీసీసీఐ సెలక్షన్ కమిటీ తెలిపింది.

అయితే, ఈ ఎంపికకు ముందే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీకి ఇదే చివరి టీ20 ప్రపంచకప్ అని సమాచారం. అలాగే, 2026 టీ20 ప్రపంచకప్‌కు ముందు కొత్త జట్టును ఏర్పాటు చేయబోతున్నాం. టీ20 జట్టులో సీనియర్ ఆటగాళ్లకు చోటు దక్కదని రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలకు బీసీసీఐ సెలక్షన్ కమిటీ తెలిపింది.

6 / 8
దీని తర్వాత, టీమిండియా కొత్త కోచ్‌గా నియమితులైన గౌతమ్ గంభీర్ కూడా తన డిమాండ్‌లో టీ20 జట్టులోని సీనియర్ ఆటగాళ్లను విడిచిపెట్టాలని బీసీసీఐకి చెప్పాడంట. బీసీసీఐ నోటీసు, కొత్త కోచ్ డిమాండ్‌ను రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీకి తెలియజేసినట్లు తెలిసింది.

దీని తర్వాత, టీమిండియా కొత్త కోచ్‌గా నియమితులైన గౌతమ్ గంభీర్ కూడా తన డిమాండ్‌లో టీ20 జట్టులోని సీనియర్ ఆటగాళ్లను విడిచిపెట్టాలని బీసీసీఐకి చెప్పాడంట. బీసీసీఐ నోటీసు, కొత్త కోచ్ డిమాండ్‌ను రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీకి తెలియజేసినట్లు తెలిసింది.

7 / 8
అలాగే, ఈ టీ20 ప్రపంచకప్ ద్వారా రిటైర్మెంట్ ప్రకటించాలని ఇద్దరు ఆటగాళ్లకు సూచించారు. అందుకు తగ్గట్టుగానే చివరిసారిగా టీ20 ప్రపంచకప్‌లో కనిపించిన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ప్రపంచకప్ విజయంతో వీడ్కోలు పలికారు. దీంతో రోహిత్, కోహ్లీలు ఇద్దరు భారత్ విజయం తర్వాత రిటైర్మెంట్ నిర్ణయం ప్రకటించారు. ప్రపంచ ఛాంపియన్‌గా నిలవడం కూడా ప్రత్యేకమే.

అలాగే, ఈ టీ20 ప్రపంచకప్ ద్వారా రిటైర్మెంట్ ప్రకటించాలని ఇద్దరు ఆటగాళ్లకు సూచించారు. అందుకు తగ్గట్టుగానే చివరిసారిగా టీ20 ప్రపంచకప్‌లో కనిపించిన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ప్రపంచకప్ విజయంతో వీడ్కోలు పలికారు. దీంతో రోహిత్, కోహ్లీలు ఇద్దరు భారత్ విజయం తర్వాత రిటైర్మెంట్ నిర్ణయం ప్రకటించారు. ప్రపంచ ఛాంపియన్‌గా నిలవడం కూడా ప్రత్యేకమే.

8 / 8