AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రోహిత్‌నే తప్పిద్దామనుకున్నాడు.. కట్‌చేస్తే.. అగార్కర్ పోస్ట్‌కే చెక్ పెట్టేసిన హిట్‌మ్యాన్.. నెక్ట్స్ బాస్‌గా తెలుగోడే..?

Ajit Agarkar Job Under Threat Rohit Sharma: వన్డే ప్రపంచకప్ 2027 కోసం అన్ని జట్లు తమ సన్నాహాలను ముమ్మరం చేశాయి. పలు కీలక సిరీస్‌లతో ఆటగాళ్లను ఫైనల్ చేసేందుకు కసరత్తులు ప్రారంభించాయి. అయితే, బీసీసీఐలో మాత్రం ఆధిపత్య పోరుతో కొన్ని వివాదాలు నెలకొన్నాయి. ముఖ్యంగా అజిత్ అగార్కర్, రోహిత్ శర్మ విషయం హాట్ టాపిక్‌గా మారింది.

Venkata Chari
|

Updated on: Aug 05, 2026 | 8:36 AM

Share
Ajit Agarkar Job Under Threat Rohit Sharma: భారత క్రికెట్ బోర్డులో తీవ్ర సంచలనం రేగుతోంది. టీమిండియా వన్డే జట్టు భవిష్యత్తు, రోహిత్ శర్మ నిష్క్రమణ విషయంలో చోటుచేసుకున్న హైడ్రామా చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ ఉద్యోగానికే ఎసరు తెచ్చింది. వచ్చే నెలలోనే అగార్కర్‌ను తప్పించి, ఆయన స్థానంలో హైదరాబాద్ సొగసరి బ్యాటర్ వీవీఎస్ లక్ష్మణ్‌ను అపాయింట్ చేసేందుకు బోర్డు పెద్దలు కసరత్తు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

Ajit Agarkar Job Under Threat Rohit Sharma: భారత క్రికెట్ బోర్డులో తీవ్ర సంచలనం రేగుతోంది. టీమిండియా వన్డే జట్టు భవిష్యత్తు, రోహిత్ శర్మ నిష్క్రమణ విషయంలో చోటుచేసుకున్న హైడ్రామా చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ ఉద్యోగానికే ఎసరు తెచ్చింది. వచ్చే నెలలోనే అగార్కర్‌ను తప్పించి, ఆయన స్థానంలో హైదరాబాద్ సొగసరి బ్యాటర్ వీవీఎస్ లక్ష్మణ్‌ను అపాయింట్ చేసేందుకు బోర్డు పెద్దలు కసరత్తు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

1 / 5
భారత పురుషుల క్రికెట్ జట్టు చీఫ్ సెలెక్టర్‌గా అజిత్ అగార్కర్ కాంట్రాక్ట్ వాస్తవానికి ఈ ఏడాది జూన్‌తోనే ముగిసింది. ఆ సమయంలో బీసీసీఐ మరో 3 నెలల పాటు పదవీకాలాన్ని పొడిగించింది. 2027 వన్డే ప్రపంచ కప్ ముగిసే వరకు అగార్కరే ఈ పదవిలో ఉంటారని ప్రతి ఒక్కరూ భావించారు. అయితే ఇటీవల జరిగిన కొన్ని వివాదాస్పద పరిణామాలు అంతా తలకిందులు చేశాయి. ముఖ్యంగా రోహిత్ శర్మ వన్డే భవిష్యత్తుపై నడిచిన వివాదం బీసీసీఐ పెద్దలకు తీవ్ర ఆగ్రహం తెప్పించినట్లు సమాచారం.

భారత పురుషుల క్రికెట్ జట్టు చీఫ్ సెలెక్టర్‌గా అజిత్ అగార్కర్ కాంట్రాక్ట్ వాస్తవానికి ఈ ఏడాది జూన్‌తోనే ముగిసింది. ఆ సమయంలో బీసీసీఐ మరో 3 నెలల పాటు పదవీకాలాన్ని పొడిగించింది. 2027 వన్డే ప్రపంచ కప్ ముగిసే వరకు అగార్కరే ఈ పదవిలో ఉంటారని ప్రతి ఒక్కరూ భావించారు. అయితే ఇటీవల జరిగిన కొన్ని వివాదాస్పద పరిణామాలు అంతా తలకిందులు చేశాయి. ముఖ్యంగా రోహిత్ శర్మ వన్డే భవిష్యత్తుపై నడిచిన వివాదం బీసీసీఐ పెద్దలకు తీవ్ర ఆగ్రహం తెప్పించినట్లు సమాచారం.

2 / 5
లార్డ్స్ మ్యాచ్ డ్రామా.. అగార్కర్ ప్లాన్‌కు రోహిత్ చెక్..: ఇంగ్లాండ్‌తో జరిగిన మూడు వన్డేల సిరీస్ రోహిత్ శర్మకు చివరిదని, ఆ తర్వాత అతనిని తప్పించాలని గౌతమ్ గంభీర్ నేతృత్వంలోని టీమ్ మేనేజ్‌మెంట్‌తో అగార్కర్ కమిటీ చర్చించినట్లు సమాచారం బయటకు వచ్చింది. లార్డ్స్‌లో జరిగిన మూడో వన్డేనే హిట్ మ్యాన్ ఆఖరి మ్యాచ్ అంటూ వార్తలు లీక్ అయ్యాయి. కానీ, మైదానంలో రోహిత్ శర్మ అద్భుతమైన సెంచరీ బాది సెలెక్టర్ల నోళ్లు మూయించాడు. లార్డ్స్ మైదానంలో సెంచరీ చేసిన తొలి భారత వన్డే ఓపెనర్‌గా చరిత్ర సృష్టించి, తానెంత విలువైన ఆటగాడో చాటిచెప్పాడు.

లార్డ్స్ మ్యాచ్ డ్రామా.. అగార్కర్ ప్లాన్‌కు రోహిత్ చెక్..: ఇంగ్లాండ్‌తో జరిగిన మూడు వన్డేల సిరీస్ రోహిత్ శర్మకు చివరిదని, ఆ తర్వాత అతనిని తప్పించాలని గౌతమ్ గంభీర్ నేతృత్వంలోని టీమ్ మేనేజ్‌మెంట్‌తో అగార్కర్ కమిటీ చర్చించినట్లు సమాచారం బయటకు వచ్చింది. లార్డ్స్‌లో జరిగిన మూడో వన్డేనే హిట్ మ్యాన్ ఆఖరి మ్యాచ్ అంటూ వార్తలు లీక్ అయ్యాయి. కానీ, మైదానంలో రోహిత్ శర్మ అద్భుతమైన సెంచరీ బాది సెలెక్టర్ల నోళ్లు మూయించాడు. లార్డ్స్ మైదానంలో సెంచరీ చేసిన తొలి భారత వన్డే ఓపెనర్‌గా చరిత్ర సృష్టించి, తానెంత విలువైన ఆటగాడో చాటిచెప్పాడు.

3 / 5
చీఫ్ సెలెక్టర్‌కు షాకిచ్చిన బోర్డు సెక్రటరీ..: అగార్కర్ ప్లాన్స్ లీక్ కావడం, రోహిత్ సెంచరీతో చెలరేగడంతో బీసీసీఐ సెక్రటరీ దేవాజిత్ సైకియా నేరుగా రంగంలోకి దిగారు. అగార్కర్‌తో చర్చించకుండానే ఆయన కీలక ప్రకటన విడుదల చేశారు. రోహిత్ శర్మ రెగ్యులర్ సభ్యుడని, జట్టు ప్రణాళికల్లో ఉన్నంత కాలం అతడు ఆడతాడని స్పష్టం చేశారు. లార్డ్స్ వన్డే అతనికి ఆఖరిది కాదని బహిరంగంగా చెప్పడం ద్వారా చీఫ్ సెలెక్టర్ నిర్ణయానికి బీసీసీఐ చెక్ పెట్టినట్లయింది. 2027 వన్డే ప్రపంచ కప్‌లో రోహిత్ ఉండకూడదని మేనేజ్‌మెంట్ కోరుకుంటున్నట్లు వార్తలు వచ్చినప్పటికీ, ఈ వ్యవహారం నడిచిన తీరు బోర్డు ప్రతిష్టను దెబ్బతీసిందనే భావన వ్యక్తమవుతోంది.

చీఫ్ సెలెక్టర్‌కు షాకిచ్చిన బోర్డు సెక్రటరీ..: అగార్కర్ ప్లాన్స్ లీక్ కావడం, రోహిత్ సెంచరీతో చెలరేగడంతో బీసీసీఐ సెక్రటరీ దేవాజిత్ సైకియా నేరుగా రంగంలోకి దిగారు. అగార్కర్‌తో చర్చించకుండానే ఆయన కీలక ప్రకటన విడుదల చేశారు. రోహిత్ శర్మ రెగ్యులర్ సభ్యుడని, జట్టు ప్రణాళికల్లో ఉన్నంత కాలం అతడు ఆడతాడని స్పష్టం చేశారు. లార్డ్స్ వన్డే అతనికి ఆఖరిది కాదని బహిరంగంగా చెప్పడం ద్వారా చీఫ్ సెలెక్టర్ నిర్ణయానికి బీసీసీఐ చెక్ పెట్టినట్లయింది. 2027 వన్డే ప్రపంచ కప్‌లో రోహిత్ ఉండకూడదని మేనేజ్‌మెంట్ కోరుకుంటున్నట్లు వార్తలు వచ్చినప్పటికీ, ఈ వ్యవహారం నడిచిన తీరు బోర్డు ప్రతిష్టను దెబ్బతీసిందనే భావన వ్యక్తమవుతోంది.

4 / 5
లక్ష్మణ్ వైపు మొగ్గు చూపుతున్న బీసీసీఐ..: ఐర్లాండ్, ఇంగ్లాండ్ పర్యటనల్లో భారత జట్టు ఓటములపై సమీక్షా సమావేశం నిర్వహించాల్సి ఉన్నప్పటికీ, అది ఇప్పటివరకు జరగలేదు. జట్టు ఇప్పటికే శ్రీలంక పర్యటనకు బయలుదేరింది. ఈ పరిణామాల నేపథ్యంలో సెలెక్షన్ కమిటీలో ప్రక్షాళన తప్పదని తెలుస్తోంది. ప్రస్తుతం బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ హెడ్‌గా ఉన్న వీవీఎస్ లక్ష్మణ్ పేరును కొత్త చీఫ్ సెలెక్టర్ పదవికి బీసీసీఐ తీవ్రంగా పరిశీలిస్తోంది. లక్ష్మణ్‌కు ఉన్న అనుభవం, వివాదరహిత శైలి జట్టును సరిగ్గా నడిపించగలవని భావిస్తున్నారు. రోహిత్ శర్మ విషయంలో అనవసర తొందరపాటు, సమాచార లోపం అగార్కర్ పదవికి ముప్పుగా పరిణమించాయి. క్రికెట్ బోర్డు నిర్ణయం అధికారికంగా వెలువడితే, వీవీఎస్ లక్ష్మణ్ సారథ్యంలో భారత సెలెక్షన్ కమిటీ కొత్త రూపు సంతరించుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.

లక్ష్మణ్ వైపు మొగ్గు చూపుతున్న బీసీసీఐ..: ఐర్లాండ్, ఇంగ్లాండ్ పర్యటనల్లో భారత జట్టు ఓటములపై సమీక్షా సమావేశం నిర్వహించాల్సి ఉన్నప్పటికీ, అది ఇప్పటివరకు జరగలేదు. జట్టు ఇప్పటికే శ్రీలంక పర్యటనకు బయలుదేరింది. ఈ పరిణామాల నేపథ్యంలో సెలెక్షన్ కమిటీలో ప్రక్షాళన తప్పదని తెలుస్తోంది. ప్రస్తుతం బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ హెడ్‌గా ఉన్న వీవీఎస్ లక్ష్మణ్ పేరును కొత్త చీఫ్ సెలెక్టర్ పదవికి బీసీసీఐ తీవ్రంగా పరిశీలిస్తోంది. లక్ష్మణ్‌కు ఉన్న అనుభవం, వివాదరహిత శైలి జట్టును సరిగ్గా నడిపించగలవని భావిస్తున్నారు. రోహిత్ శర్మ విషయంలో అనవసర తొందరపాటు, సమాచార లోపం అగార్కర్ పదవికి ముప్పుగా పరిణమించాయి. క్రికెట్ బోర్డు నిర్ణయం అధికారికంగా వెలువడితే, వీవీఎస్ లక్ష్మణ్ సారథ్యంలో భారత సెలెక్షన్ కమిటీ కొత్త రూపు సంతరించుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.

5 / 5
Follow Us