- Telugu News Photo Gallery Cinema photos Tollywood upcoming Movies Update on 28 10 2023 Telugu Entertainment Photos
Entertainment: థియేటర్స్ లో భయపెట్టనున్న మా ఊరి పొలిమేర 2.. | కమల్, మణిరత్నం షురూ..
రెండేళ్ల కిందట నేరుగా ఓటీటీలో విడుదలై మంచి విజయం అందుకున్న ‘మా ఊరి పొలిమేర’. చేతబడి నేపథ్యంలో వచ్చిన ఈ చిత్రానికి ఇప్పుడు సీక్వెల్ చేసారు దర్శక నిర్మాతలు. కమెడియన్గా మెప్పించిన సత్యం రాజేష్ ఈ సినిమాతో ప్రతినాయకుడిగా మారారు. నవంబర్ 3న పొలిమేర 2 విడుదల కానుంది. తాజాగా ఇందులో కారెక్టర్ ఇంట్రోస్ టీజర్స్ రిలీజ్ చేసారు మేకర్స్. | డీజే టిల్లు.. ఈ సినిమాతో సిద్ధూ జొన్నలగడ్డ రేంజ్ రాత్రికి రాత్రే పెరిగిపోయింది.
Updated on: Oct 28, 2023 | 7:06 PM

రెండేళ్ల కిందట నేరుగా ఓటీటీలో విడుదలై మంచి విజయం అందుకున్న ‘మా ఊరి పొలిమేర’. చేతబడి నేపథ్యంలో వచ్చిన ఈ చిత్రానికి ఇప్పుడు సీక్వెల్ చేసారు దర్శక నిర్మాతలు. కమెడియన్గా మెప్పించిన సత్యం రాజేష్ ఈ సినిమాతో ప్రతినాయకుడిగా మారారు. నవంబర్ 3న పొలిమేర 2 విడుదల కానుంది. తాజాగా ఇందులో కారెక్టర్ ఇంట్రోస్ టీజర్స్ రిలీజ్ చేసారు మేకర్స్.

డీజే టిల్లు.. ఈ సినిమాతో సిద్ధూ జొన్నలగడ్డ రేంజ్ రాత్రికి రాత్రే పెరిగిపోయింది. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద బాగా కలెక్ట్ చేయడంతో ప్రస్తుతం దానికి సీక్వెల్ తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాకు టిల్లు స్క్వేర్ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. టిల్లు స్వ్కేర్లో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్. తాజాగా ఈ చిత్ర రిలీజ్ డేట్ కన్ఫర్మ్ చేసారు. ఫిబ్రవరి 9న విడుదల కానుంది ఈ చిత్రం.

రణ్బీర్ కపూర్, రష్మిక మందన్న జంటగా సందీప్ రెడ్డి వంగా తెరకెక్కిస్తున్న సినిమా యానిమల్. డిసెంబర్ 1న విడుదల కానుంది ఈ సినిమా. తాజాగా ఇందులోని రెండో పాటను విడుదల చేసారు మేకర్స్. నే వేరే అంటూ సాగే పాటకు మంచి రెస్పాన్స్ వస్తుంది.

కమల్ హాసన్, మణిరత్నం కాంబినేషన్లో 33 ఏళ్ళ తర్వాత వస్తున్న సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు జరిగాయి. పొన్నియన్ సెల్వన్ సినిమాతో ఫామ్లోకి వచ్చారు మణిరత్నం. అలాగే విక్రమ్తో కమల్ కూడా సూపర్ ఫామ్లో ఉన్నారు. ఈయన ప్రస్తుతం వినోద్ దర్శకత్వంలో నటిస్తున్నారు. ఇది సెట్స్పై ఉండగానే మరో సినిమాను ప్రకటించారు కమల్ హాసన్.

కమెడియన్ ధన్రాజ్, సునీల్ హీరోలుగా గరుడవేగ అంజి తెరకెక్కించిన సినిమా బుజ్జి ఇలా రా. సైకలాజికల్ థ్రిల్లర్గా వచ్చిన ఈ చిత్రానికి మంచి రెస్పాన్స్ రావడంతో.. తాజాగా దీనికి సీక్వెల్ మొదలు పెట్టారు దర్శక నిర్మాతలు. తాజాగా ఈ చిత్ర సీక్వెల్ పూజా కార్యక్రమాలతో మొదలైంది.




