Tollywood News: ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ తో రానున్న శ్రీవిష్ణు | యానిమల్ సినిమా పై విద్యాబాలన్ సంచలన కామెంట్స్
శ్రీవిష్ణు హీరోగా లైట్ బాక్స్ మీడియా, పిక్చర్ పర్ఫెక్ట్ ఎంటర్టైన్మెంట్ సంస్థలు ఓ సినిమాను తెరకెక్కిస్తున్నాయి. హుస్సేన్ షా కిరణ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్గా తెరకెక్కిస్తున్నారు మేకర్స్. 60 శాతం చిత్రీకరణ పూర్తయిందని చెప్పారు. వీలైనంత త్వరగా పూర్తి చేసి సినిమాను విడుదల చేస్తామని ప్రకటించారు. మహిళలకు సమాన అవకాశాలు కల్పించి వారిని అన్ని విధాలా అభివృద్ధి పథంలో నడపాలనే లక్ష్యంతో ఆదిశక్తి సంస్థను ప్రారంభించానని అన్నారు నటి సంయుక్త. అన్ని వయసుల మహిళలకు ఈ సంస్థ చేయూతనిస్తుందని చెప్పారు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5




