Samantha: ఏమాయ చేసావే సినిమా.. యాక్టింగ్ చూస్తే సిగ్గుగా అనిపిస్తుంది.. సమంత ఆసక్తికర కామెంట్స్..
చాలా కాలం అనారోగ్య సమస్యలతో సినిమాలకు దూరంగా ఉన్న సమంత ఇప్పుడిప్పుడే రీఎంట్రీ ఇస్తుంది. అటు కథానాయికగా కాకుండా ఇటు నిర్మాతగానూ రాణిస్తుంది. ఆమె నిర్మాతగా వ్యవహరించిన తొలి సినిమా శుభం. త్వరలోనే ఈ మూవీ విడుదల కానుంది. దీంతో ఈ మూవీ ప్రమోషన్లలో పాల్గొంటుంది సామ్.
Updated on: Apr 20, 2025 | 8:48 PM

టాలీవుడ్ హీరోయిన్ సమంత నిర్మాతగా వ్యవహరించిన మొదటి చిత్రం శుభం. త్వరలోనే ఈ మూవీ రిలీజ్ కానుంది. ఈ క్రమంలో ఈ సినిమా ప్రమోషన్లలో బాగంగా శనివారం సాయంత్రం జరిగిన ఓ కార్యక్రమంలో ఆమె పాల్గొని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

తమ సినిమాలో నటీనటులందరు కొత్తవారే అని... వారి యాక్టింగ్ తనను ఎంతో కదిలించిందని అన్నారు. భవిష్యత్తులో వారందరూ ఉన్నత స్థాయికి వెళ్లాలని కోరుకున్నారు. తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ కంటెంట్ కు పెద్ద పీట వేస్తారని చెప్పుకొచ్చింది.

మంచి కథ ఉన్న సినిమాలను అడియన్స్ ఆదరిస్తుంటారని.. మనసుకు హత్తుకునే కంటెంట్ తో వస్తోన్న తమ చిత్రాన్ని సైతం ఆదరిస్తారని చెప్పుకొచ్చింది. నటీనటులు కొత్తవారే అయినప్పటికీ అద్భుతంగా యాక్ట్ చేశారని తెలిపింది.

నటిగా తన కెరీర్ స్టార్ట్ చేసినప్పుడు యాక్టింగ్ గురించి పెద్దగా తెలియదని.. తాను నటించిన మొదటి రెండు సినిమాలు ఇప్పుడు చూస్తే చాలా సిగ్గుగా అనిపిస్తుందని.. దారుణంగా యాక్ట్ చేశాననే ఫీలింగ్ వస్తుందని..ఇంకా బాగా నటించవచ్చు కదా అనిపిస్తుందని తెలిపింది.

కానీ ఇప్పుడు నటీనటులు అలా కాదని.. తొలి సినిమానే అయినప్పటికీ ఎంతో బాగా యాక్టింగ్ చేశారని తెలిపింది. జీవితంలో సవాళ్లను స్వీకరించడం తనకు ఇష్టమని. నిర్మాతగా ఇదొక కొత్త ప్రయాణమని చెప్పుకొచ్చింది.




