రీతూనా “మజాకా”.. కొండపల్లి బొమ్మలా చీరకట్టులో ఆకట్టుకున్న అందాల భామ
తెలుగమ్మాయి రీతూ వర్మ.. చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ ప్రారంభించిన ఈ భామ ఇప్పుడు హీరోయిన్గా మారిన సినిమాలు చేస్తోంది. తెలుగుతో పాటు తమిళ్ లోనూ వరుసగా సినిమాలు చేస్తూ అభిమానులను సొంతం చేసుకుంటుంది ఈ చిన్నది.కెరీర్ బిగినింగ్ లో కొన్ని షార్ట్ ఫిలిమ్స్ లో నటించింది ఈ భామ. ఆ తర్వాత సినిమాల్లోకి చైల్డ్ ఆర్టిస్ట్ గా వచ్చింది. ఎన్టీఆర్ హీరోగా నటించిన బాద్షా సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా.. హీరోయిన్ చెల్లి పాత్రలో మెరిసింది.
Updated on: Feb 20, 2025 | 2:57 PM

తెలుగమ్మాయి రీతూ వర్మ.. చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ ప్రారంభించిన ఈ భామ ఇప్పుడు హీరోయిన్గా మారిన సినిమాలు చేస్తోంది. తెలుగుతో పాటు తమిళ్ లోనూ వరుసగా సినిమాలు చేస్తూ అభిమానులను సొంతం చేసుకుంటుంది ఈ చిన్నది.

కెరీర్ బిగినింగ్ లో కొన్ని షార్ట్ ఫిలిమ్స్ లో నటించింది ఈ భామ. ఆ తర్వాత సినిమాల్లోకి చైల్డ్ ఆర్టిస్ట్ గా వచ్చింది. ఎన్టీఆర్ హీరోగా నటించిన బాద్షా సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా.. హీరోయిన్ చెల్లి పాత్రలో మెరిసింది. ఆ తర్వాత కొంత గ్యాప్ ఇచ్చింది.

2013లో శ్రీవిష్ణు నటించిన ప్రేమ ఇష్క్ కాదల్ అనే సినిమాలో హీరోయిన్ గా చేసింది. ఈ సినిమాలో రీతూ తన నటనతో ఆకట్టుకుంది. ఆతర్వాత నా రాకుమారుడు, ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాల్లో హీరోయిన్ గా చేసి ఆకట్టుకుంది.

ఇక 2016లో వచ్చిన పెళ్ళిచూపులు సినిమా ఈ బ్యూటీకి మంచి క్రేజ్ తెచ్చిపెట్టింది. ఈ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో రీతూకి ఆఫర్స్ క్యూ కట్టాయి. నిన్నిలా నిన్నిలా, టక్ జగదీష్, ఒకే ఒక జీవితం, కణం, ఆకాశం, మార్క్ ఆంటోని సినిమాలు చేసింది.

ఈ భామ నటనకు ప్రాధాన్యత ఉన్న సినిమాల ఎంచుకుంటూ రాణిస్తుంది. ఇటీవలే శ్రీవిష్ణు హీరోగా నటించిన స్వాగ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఇప్పుడు సందీప్ కిషన్ తో కలిసి మజాకా అనే సినిమా చేస్తుంది. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.





























