Rajinikanth: ఒక్క దెబ్బకి రెండు పిట్టలు.. రజినికాంతా.. మజాకానా..
ఒక్కదెబ్బకు రెండు పిట్టలు అంటారు కదా..! ఈ సామెతను ఇప్పుడు చేసి చూపించారు రజినీకాంత్. మామూలుగానే ఈయన ఒక్కసారి చెప్తే వందసార్లు చెప్పినట్లు.. అందుకే ఒక్క సినిమాను ప్రమోట్ చేస్తే రెండు సినిమాలకు అది వర్కవుట్ అయిందిప్పుడు. ఇంతకీ రజినీ అంతగా ఏం చేసారో చూద్దాం పదండి..! కొందరు హీరోల సినిమాలకు ప్రత్యేకంగా ప్రమోషన్స్ ప్లాన్ చేయాల్సిన పనిలేదు. ఎందుకంటే వాళ్లుంటేనే చాలు ప్రమోషన్ వచ్చేస్తుంది.
Updated on: Sep 18, 2024 | 10:10 PM

దానివల్ల కథ స్వరూపమే మారిపోయిందన్నారు ఈ దర్శకుడు. లింగా సినిమా అయితే ఒకెత్తు అయితే.. క్లైమాక్స్లో వచ్చే బెలూన్ జంపింగ్ ఎపిసోడ్ మరో ఎత్తు. ఇప్పటికీ ట్రోలింగ్ మెటీరియల్గా దీన్ని వాడుతుంటారు.

కానీ రజినీకాంత్ లాంటి సూపర్ స్టార్ సైతం ఇప్పుడు టెన్షన్లోనే ఉన్నారు. వేట్టయన్ ఆయన్ని నిద్ర కూడా పోనివ్వట్లేదు. మరి అంతగా రజినీ కంగారు పడటానికి కారణమేంటి.?

ప్రస్తుతం ఈయన వేట్టయన్ సినిమాతో అక్టోబర్ 10న రానున్నారు. వేట్టయన్ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులతో బిజీగా ఉంది. సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ సెప్టెంబర్ 20న జరగనుంది. రిలీజ్ డేట్ దగ్గర పడుతున్నా కూడా స్పెషల్ ప్రమోషన్స్ అయితే చేయట్లేదు మేకర్స్.

రజినీకాంత్, కేఎస్ రవికుమార్ మంచి స్నేహితులు. సూపర్ స్టార్కు ముత్తు, నరసింహా లాంటి బ్లాక్బస్టర్స్ ఇచ్చిన దర్శకుడీయన. ఈ ఇద్దరి కాంబోలో వచ్చిన మూడో సినిమా లింగా డిజాస్టర్ అయింది.

అంతే.. ఇటు కూలీతో పాటు.. అటు వేట్టయన్ గురించి మాట్లాడేసుకుంటున్నారు నెటిజన్లు. ఒక్క దెబ్బకు రెండు పిట్టలంటే ఇదే కాబోలు. లోకేష్ సినిమాటిక్ యూనివర్స్లో కాకుండా.. బయటి కథతో వస్తుంది కూలీ. 2025లో విడుదల కానుంది ఈ చిత్రం.




