Indraani Singh: ఆసియాలో తొలి మహిళా పైలట్‌ కెప్టెన్ ఇంద్రాణీ సింగ్.. పేద పిల్లలు, మహిళ చదువుకోసం ఎన్జీవో నడుపుతున్న మానవతా మూర్తి..

1996లో, కెప్టెన్ ఇంద్రాణి సింగ్ అమెరికన్ కంపెనీ బోయింగ్ ఎయిర్‌బస్ A-300 విమానాన్ని నడిపిన మొదటి మహిళ. ఆసియాలో తొలి వాణిజ్య మహిళా పైలట్‌గా కూడా చరిత్ర సృష్టించారు. కెప్టెన్ ఇంద్రాణి సింగ్ గురించి వివరాల్లోకి వెళ్తే.. 

|

Updated on: Nov 29, 2022 | 6:26 PM

నవంబర్ 28, 1996 రోజున విమానయాన పరిశ్రమలో భారతీయుని పేరు నమోదైంది. ఆ పేరు కెప్టెన్ ఇంద్రాణి సింగ్. అమెరికా కంపెనీ బోయింగ్‌కు చెందిన ఎయిర్‌బస్ ఏ-300 విమానాన్ని నడిపి చరిత్ర సృష్టించారు. దీంతో కెప్టెన్ ఇంద్రాణి సింగ్ ఆసియాలో మొదటి మహిళా పైలట్‌గా అవతరించారు. అంతేకాదు ఆమె ఈ విమానానికి కమాండర్‌గా కూడా వ్యవహరించారు. ఎయిర్‌బస్ A-300 కమాండర్‌గా ఉన్న కెప్టెన్ ఇంద్రాణి సింగ్  ఆసియాలో మొదటి  మహిళా పైలట్‌. 

నవంబర్ 28, 1996 రోజున విమానయాన పరిశ్రమలో భారతీయుని పేరు నమోదైంది. ఆ పేరు కెప్టెన్ ఇంద్రాణి సింగ్. అమెరికా కంపెనీ బోయింగ్‌కు చెందిన ఎయిర్‌బస్ ఏ-300 విమానాన్ని నడిపి చరిత్ర సృష్టించారు. దీంతో కెప్టెన్ ఇంద్రాణి సింగ్ ఆసియాలో మొదటి మహిళా పైలట్‌గా అవతరించారు. అంతేకాదు ఆమె ఈ విమానానికి కమాండర్‌గా కూడా వ్యవహరించారు. ఎయిర్‌బస్ A-300 కమాండర్‌గా ఉన్న కెప్టెన్ ఇంద్రాణి సింగ్ ఆసియాలో మొదటి మహిళా పైలట్‌. 

1 / 5
బెంగాలీ కుటుంబంలో పుట్టి.. ఢిల్లీలో చదువుకున్నారు ఇంద్రాణి. వాస్తవానికి ఇంద్రాణి కుటుంబ సభ్యులు ఎప్పుడూ ఆమె పైలట్ అవుతుందని ఎప్పుడూ అనుకోలేదు. కానీ ఇంద్రాణి చిన్నతనం నుంచి పైలట్ కావాలని కలలు కనేది. ఢిల్లీలోని సమ్మర్ ఫీల్డ్స్ స్కూల్ లో విద్యను పూర్తి చేసిన తర్వాత.. ఆల్ ఇండియా గ్లైడింగ్ క్లబ్‌లో ఇంద్రాణి సింగ్ చేరారు. అనంతరం ఆమె ఇండియన్ ఎయిర్‌లైన్స్‌లో చేరారు. 1989లో ఎయిర్‌బస్ 320 నడపడానికి శిక్షణ కోసం ఫ్రాన్స్‌కు వెళ్లారు. 

బెంగాలీ కుటుంబంలో పుట్టి.. ఢిల్లీలో చదువుకున్నారు ఇంద్రాణి. వాస్తవానికి ఇంద్రాణి కుటుంబ సభ్యులు ఎప్పుడూ ఆమె పైలట్ అవుతుందని ఎప్పుడూ అనుకోలేదు. కానీ ఇంద్రాణి చిన్నతనం నుంచి పైలట్ కావాలని కలలు కనేది. ఢిల్లీలోని సమ్మర్ ఫీల్డ్స్ స్కూల్ లో విద్యను పూర్తి చేసిన తర్వాత.. ఆల్ ఇండియా గ్లైడింగ్ క్లబ్‌లో ఇంద్రాణి సింగ్ చేరారు. అనంతరం ఆమె ఇండియన్ ఎయిర్‌లైన్స్‌లో చేరారు. 1989లో ఎయిర్‌బస్ 320 నడపడానికి శిక్షణ కోసం ఫ్రాన్స్‌కు వెళ్లారు. 

2 / 5
ఫ్రాన్స్‌లో శిక్షణ పూర్తి చేసుకున్న తర్వాత ఇంద్రాణి ఎయిర్‌బస్ 320ని విజయవంతంగా నడిపారు. దీంతో ఆమె ప్రపంచంలోనే తొలి మహిళా పైలట్‌గా గుర్తింపు పొందారు. చిన్నప్పటి నుంచి బడికి వెళుతున్నప్పుడు దారిలో పేద పిల్లలను చూసేవారు. వారిని చూడగానే ఆ పిల్లల చదువు గురించి ఆమె ఆలోచిస్తూ ఉండేది. పైలట్ అయిన తర్వాత కూడా ఇంద్రాణి పేద పిల్లలు.. వారి చదువు గురించి ఆలోచించడం మానలేదు.

ఫ్రాన్స్‌లో శిక్షణ పూర్తి చేసుకున్న తర్వాత ఇంద్రాణి ఎయిర్‌బస్ 320ని విజయవంతంగా నడిపారు. దీంతో ఆమె ప్రపంచంలోనే తొలి మహిళా పైలట్‌గా గుర్తింపు పొందారు. చిన్నప్పటి నుంచి బడికి వెళుతున్నప్పుడు దారిలో పేద పిల్లలను చూసేవారు. వారిని చూడగానే ఆ పిల్లల చదువు గురించి ఆమె ఆలోచిస్తూ ఉండేది. పైలట్ అయిన తర్వాత కూడా ఇంద్రాణి పేద పిల్లలు.. వారి చదువు గురించి ఆలోచించడం మానలేదు.

3 / 5
భారతదేశంలో అక్షరాస్యత పరిధిని పెంచాలన్నది కెప్టెన్ ఇంద్రాణి కల. ఇందుకోసం 1996లో లిటరసీ ఇండియా పేరుతో ఎన్జీవోను ప్రారంభించారు. ఆర్థికంగా వెనుకబడిన వారు చదువుకునేలా చేయడమే ఈ ఎన్జీవో పని. ఇది తన వ్యక్తిగత లక్ష్యమని ఇంద్రాణి స్పష్టం చేశారు. 1996లో ఐదుగురు పిల్లలతో చదువుల యజ్ఞాన్ని ప్రారంభించగా.. ఇప్పుడు ఈ ఎన్జీవో పరిధి 25 వేల మందికి చేరుకుంది. ఇందులో పిల్లలు, మహిళలు కూడా ఉన్నారు. 

భారతదేశంలో అక్షరాస్యత పరిధిని పెంచాలన్నది కెప్టెన్ ఇంద్రాణి కల. ఇందుకోసం 1996లో లిటరసీ ఇండియా పేరుతో ఎన్జీవోను ప్రారంభించారు. ఆర్థికంగా వెనుకబడిన వారు చదువుకునేలా చేయడమే ఈ ఎన్జీవో పని. ఇది తన వ్యక్తిగత లక్ష్యమని ఇంద్రాణి స్పష్టం చేశారు. 1996లో ఐదుగురు పిల్లలతో చదువుల యజ్ఞాన్ని ప్రారంభించగా.. ఇప్పుడు ఈ ఎన్జీవో పరిధి 25 వేల మందికి చేరుకుంది. ఇందులో పిల్లలు, మహిళలు కూడా ఉన్నారు. 

4 / 5
కెప్టెన్ ఇంద్రాణి .. తన స్కూల్ ఫ్రెండ్ కెప్టెన్ కిరత్ సింగ్ గ్రేవాల్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఈ దంపతులకు ఒక కొడుకు ఉన్నాడు. ఇప్పటికీ ఇంద్రాణి పిల్లలు, మహిళలు చదువుకోవాలని కోరుకుంటారు.. ఈ మేరకు అనేక ప్రచార కార్యక్రమాలను చేపడతారు. సమాజంలో మార్పు కోసం ప్రయత్నిస్తూ.. మార్పు తీసుకొచ్చినందుకు ఇంద్రాణి  సింగ్ కు ఉమెన్ అచీవర్స్ అవార్డ్ 2009,  ఇంటర్నేషనల్ కాంగ్రెస్ ఫర్ ఉమెన్స్ గాడ్‌ఫ్రే ఫిలిప్ స్పెషల్ అవార్డులను అందుకున్నారు. 

కెప్టెన్ ఇంద్రాణి .. తన స్కూల్ ఫ్రెండ్ కెప్టెన్ కిరత్ సింగ్ గ్రేవాల్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఈ దంపతులకు ఒక కొడుకు ఉన్నాడు. ఇప్పటికీ ఇంద్రాణి పిల్లలు, మహిళలు చదువుకోవాలని కోరుకుంటారు.. ఈ మేరకు అనేక ప్రచార కార్యక్రమాలను చేపడతారు. సమాజంలో మార్పు కోసం ప్రయత్నిస్తూ.. మార్పు తీసుకొచ్చినందుకు ఇంద్రాణి  సింగ్ కు ఉమెన్ అచీవర్స్ అవార్డ్ 2009,  ఇంటర్నేషనల్ కాంగ్రెస్ ఫర్ ఉమెన్స్ గాడ్‌ఫ్రే ఫిలిప్ స్పెషల్ అవార్డులను అందుకున్నారు. 

5 / 5
Follow us