Toyota Yaris: భారత్లో టొయోటా యారిస్ కార్ల విక్రయాల నిలిపివేత.. కారణం ఏంటంటే..!
Toyota Yaris: తమ సంస్థ నుంచి వస్తున్న మిడ్ సైజ్ సెడాన్ విభాగంలోని యారిస్ మోడల్ కారు విక్రయాలను భారత్లో నిలిపివేస్తున్నట్లు టొయోటా కిర్లోస్కర్ మోటార్(టీకేఎం) ప్రకటించింది. ..
Subhash Goud | Edited By: Ravi Kiran
Updated on: Sep 28, 2021 | 8:25 AM

Toyota Yaris: తమ సంస్థ నుంచి వస్తున్న మిడ్ సైజ్ సెడాన్ విభాగంలోని యారిస్ మోడల్ కారు విక్రయాలను భారత్లో నిలిపివేస్తున్నట్లు టొయోటా కిర్లోస్కర్ మోటార్(టీకేఎం) ప్రకటించింది. కస్టమర్ల అవసరాలకు అనుగుణంగా మరిన్ని మోడళ్లను తీసుకొచ్చే క్రమంలోనే ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.

ఈ కారు మే, 2018లో మార్కెట్లోకి వచ్చింది. అప్పటి నుంచి కేవలం 19,800 యూనిట్లు మాత్రమే అమ్ముడయ్యాయి. వినియోగదారులు ఈ కారు పట్ల పెద్దగా ఆసక్తి చూపని కారణంగా విక్రయాలను నిలిపివేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటి వరకూ యారిస్ను కొనుగోలు చేసిన వినియోగదారులకు విడిభాగాలు సహా ఇతరత్రా సేవలు కనీసం వచ్చే 10 ఏళ్ల పాటు అందుతాయని టొయోటా హామీ ఇచ్చింది.

అలాగే కంపెనీ నుంచి వస్తున్న ఇతర కార్ల విక్రయాలను మాత్రం ఆపడం లేదని పేర్కొంది. సెడాన్ విభాగంలో వినియోగదారులను ఆకట్టుకునేందుకు తెచ్చిన యారిస్ ఫీచర్లు .. 1496 సీసీ ఇంజిన్, 107 హెచ్పీ శక్తి, లీటర్ ఇంధనంకు 17.1 కిమీ. దీని ధర రూ.8 లక్షల నుంచి రూ.14 లక్షల మధ్య ఉండేది.

ప్రస్తుతం టీకేఎం నుంచి హ్యాచ్బ్యాక్ గ్లాంజా, కాంపాక్ట్ ఎస్యూవీ అర్బన్ క్రూజర్, మల్టీపర్పస్ వెహికల్ ఇన్నోవా క్రిస్టా, ప్రీమియం అండ్ ఎస్యూవీ ఫార్చునర్ కార్లు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి.





























