RBI: రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా సంచలన నిర్ణయం.. ఆ బ్యాంకుకు రూ.5 కోట్ల జరిమానా విధింపు..!

RBI: ఈ మధ్య కాలంలో రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులపై కొరఢా ఝులిపిస్తోంది. ఆర్బీఐ నిబంధనలు పాటించకపోవడం కారణంగా ..

| Edited By: Phani CH

Updated on: Jul 31, 2021 | 8:04 AM

RBI: ఈ మధ్య కాలంలో రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులపై కొరఢా ఝులిపిస్తోంది. ఆర్బీఐ నిబంధనలు పాటించకపోవడం కారణంగా భారీ ఎత్తున జరిమానాలు విధిస్తోంది. ఇప్పటికే చాలా బ్యాంకులపై ఈ ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటూ షాక్‌ల మీద షాక్‌లు ఇస్తోంది ఆర్బీఐ.

RBI: ఈ మధ్య కాలంలో రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులపై కొరఢా ఝులిపిస్తోంది. ఆర్బీఐ నిబంధనలు పాటించకపోవడం కారణంగా భారీ ఎత్తున జరిమానాలు విధిస్తోంది. ఇప్పటికే చాలా బ్యాంకులపై ఈ ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటూ షాక్‌ల మీద షాక్‌లు ఇస్తోంది ఆర్బీఐ.

1 / 4
ఇక తాజాగా ఆర్బీఐ (RBI) కీలక నిర్ణయం తీసుకుంది. ప్రైవేటు రంగానికి చెందిన యాక్సిస్‌ బ్యాంకుకు భారీ షాకిచ్చింది. నిబంధనలు అతిక్రమించినందుకు గాను 5 కోట్ల రూపాయల జరిమానా విధించింది. అయితే యాక్సిస్ బ్యాంక్ ఆర్‌బీఐ నిబంధనలను అతిక్రమించడం ఇందుకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు.

ఇక తాజాగా ఆర్బీఐ (RBI) కీలక నిర్ణయం తీసుకుంది. ప్రైవేటు రంగానికి చెందిన యాక్సిస్‌ బ్యాంకుకు భారీ షాకిచ్చింది. నిబంధనలు అతిక్రమించినందుకు గాను 5 కోట్ల రూపాయల జరిమానా విధించింది. అయితే యాక్సిస్ బ్యాంక్ ఆర్‌బీఐ నిబంధనలను అతిక్రమించడం ఇందుకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు.

2 / 4
ఆర్‌బీఐ ఆదేశాలు సహా సైబర్ సెక్యూరిటీ ఫ్రేమ్ వర్క్‌ నిబంధనలను ఉల్లంఘించినందుకు గాను ఈ కొరఢా ఝులిపించింది ఆర్బీఐ. స్పాన్సర్ బ్యాంకులు, ఎస్సీబీలు, యుసీబీల మధ్య చెల్లింపు వ్యవస్థను బలోపేతం చేయడంపై ఆర్‌బీఐ జారీ చేసిన కొన్ని నిబంధనలను యాక్సిస్ బ్యాంక్ ఉల్లంఘించింది. ఈ నేపథ్యంలో జరిమానా విధించేందుకు నిర్ణయం తీసుకుంది.

ఆర్‌బీఐ ఆదేశాలు సహా సైబర్ సెక్యూరిటీ ఫ్రేమ్ వర్క్‌ నిబంధనలను ఉల్లంఘించినందుకు గాను ఈ కొరఢా ఝులిపించింది ఆర్బీఐ. స్పాన్సర్ బ్యాంకులు, ఎస్సీబీలు, యుసీబీల మధ్య చెల్లింపు వ్యవస్థను బలోపేతం చేయడంపై ఆర్‌బీఐ జారీ చేసిన కొన్ని నిబంధనలను యాక్సిస్ బ్యాంక్ ఉల్లంఘించింది. ఈ నేపథ్యంలో జరిమానా విధించేందుకు నిర్ణయం తీసుకుంది.

3 / 4
బ్యాంకింగ్ రెగ్యులేషన్ చట్టం 1949లోని సెక్షన్ 46 (4) (ఐ), సెక్షన్ 47 ఎ (1) (సి) నిబంధనల కింద యాక్సిస్ బ్యాంక్‌కు జరిమానా విధించినట్లు ఆర్‌బీఐ వెల్లడించింది. ఇకపోతే జరిమానా ఎందుకు విధించకూడదో కూడా తెలియజేయాలని ఆర్‌బీఐ యాక్సిస్ బ్యాంక్‌కు తెలిపింది. తర్వాత జరిమానా విధింపు నిర్ణయం అమలవుతుంది.

బ్యాంకింగ్ రెగ్యులేషన్ చట్టం 1949లోని సెక్షన్ 46 (4) (ఐ), సెక్షన్ 47 ఎ (1) (సి) నిబంధనల కింద యాక్సిస్ బ్యాంక్‌కు జరిమానా విధించినట్లు ఆర్‌బీఐ వెల్లడించింది. ఇకపోతే జరిమానా ఎందుకు విధించకూడదో కూడా తెలియజేయాలని ఆర్‌బీఐ యాక్సిస్ బ్యాంక్‌కు తెలిపింది. తర్వాత జరిమానా విధింపు నిర్ణయం అమలవుతుంది.

4 / 4
Follow us