Realme 5G Smartphone: రియల్మీ మరో కీలక నిర్ణయం.. రూ.7000 ధరకే 5జీ స్మార్ట్ఫోన్.. !
భారత్లో అతి తక్కువ ధరకే 5జీ మొబైల్ అందుబాటులోకి వస్తున్నాయి. ఇటీవల రూ.15 వేలలోపే 5జీ మొబైల్ను అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు పలు మొబైల్ ఉత్పత్తి కంపెనీలు..
భారత్లో అతి తక్కువ ధరకే 5జీ మొబైల్ అందుబాటులోకి వస్తున్నాయి. ఇటీవల రూ.15 వేలలోపే 5జీ మొబైల్ను అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు పలు మొబైల్ ఉత్పత్తి కంపెనీలు వెల్లడించాయి. అయితే ఇప్పుడు రియల్మీ 8 5జీ స్మార్ట్ఫోన్ కేవలం రూ.13,999 ధరకే తీసుకోవచ్చు. ఇంత తక్కువ ధరకు 5జీ స్మార్ట్ఫోన్ను ఏ కంపెనీ అందించడం లేదు.
1 / 3
ఇక త్వరలో రియల్మీ మరో సంచలన నిర్ణయం తీసుకోబోతోంది. రూ.7 వేలకే 5జీ మొబైల్ విడుదల చేయనుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇండియాలో ఇంకా 5జీ నెట్వర్క్ అందుబాటులో లేదు. అయితే అంతకన్న ముందే మొబైల్ కంపెనీలు అప్రమత్తం అవుతున్నాయి. పోటాపోటీగా 5జీ మొబైళ్లను విడుదల చేస్తున్నాయి. భారత్లో త్వరలో 5జీ కనెక్టివిటీ రానుండటంతో 5జీ స్మార్ట్ఫోన్ రానుండటంతో 5జీ స్మార్ట్ఫోన్లు విడుదలవుతున్నాయి.
2 / 3
రియల్మీ ఇండియాలో సుమారు 7 వేలకే 5జీ స్మార్ట్ ఫోన్ను విడుదల చేయనున్నట్లు రియల్మీ ఇండియా అధినేత మాధవ్ షేఠ్ తెలిపారు. రియల్మీ ఎక్స్7, రియల్మీ ఎక్స్7 ప్రో, రియల్మీ ఎక్స్7 మ్యాక్స్, రియల్మీ నార్జో 30 ప్రో, రియల్మీ ఎక్స్50 ప్రో, రియల్మీ 8 5జీ మోడల్స్ ఉన్నాయి. వీటిలో రియల్మీ 8 5జీ తక్కువ ధరకే లభిస్తుంది.