Ravi Kiran |
Updated on: May 29, 2021 | 12:48 PM
డీమోనిటైజేషన్ తరువాత, రిజర్వ్ బ్యాంక్ 2000, 500 రూపాయల కొత్త నోట్లను మార్కెట్లో ప్రవేశపెట్టింది. దీని తరువాత 100, 200, 50, 20, 10 రూపాయల నోట్లు కూడా మార్కెట్లోకి వచ్చాయి.
మీ దగ్గరున్న రూ. 100 నోటు నిజమైనది అని గుర్తించడానికి మొదటి మార్గం.. 100 నోటు ముందు భాగంలో దేవనగరిలో వ్రాయబడి ఉంటుంది. అదే సమయంలో, నోట్ మధ్యలో మహాత్మా గాంధీ ఫోటో, ఆర్బీఐ బొమ్మ. అంతేకాకుండా 100 అని చిన్న అక్షరాలలో వ్రాయబడి ఉంటుంది.
మీరు కొత్త 100 రూపాయల నోటును మడతపెట్టినప్పుడు, దానిపై ఉన్న వైర్ రంగు మారుతుంది. అది ఆకుపచ్చ నీలం రంగులో ఉంటుంది. అదే కాకుండా, నోట్పై 100 వాటర్మార్క్ కూడా ఉంటుంది. ముద్రణ సంవత్సరం నోటు వెనుక భాగంలో, స్వచ్ఛ భారత్ లోగో, నినాదం, భాషా ప్యానెల్, 'రాణి కి వావ్' అనే అక్షరాలు, దేవనగరి లిపిలో 100 సంఖ్య.
పాత 100 రూపాయల నోటుపై, ముందు వైపు ఒక త్రిభుజం ఆకారం ఉంటుంది. ఈ నోట్ వెనుక వైపున పువ్వులు ఉంటాయి. దూరం నుండి చూసినప్పుడు, వాటిల్లో మొత్తం 100 కనిపిస్తుంది.
ఇవే కాకుండా, 100 రూపాయలు నిజమైనవి అని గుర్తించడానికి కుడి వైపున అశోక స్తంభం చిహ్నం ఉంది. అలాగే మహాత్మా గాంధీ చిత్రం, ఎలక్ట్రోటైప్ (100) వాటర్మార్క్లో కనిపిస్తుంది.